అన్వేషించండి

Pralhad Joshi: కేంద్రం ఓ నీచమైన ప్రభుత్వమన్న సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ నేతల ఫైర్

Pralhad Joshi: కేంద్రం ఒక నీచమైన ప్రభుత్వమని, మానవత్వం లేదన్న సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు.

Pralhad Joshi: కేంద్రంలో ఉన్నది నీచమైన ప్రభుత్వం అని, మానవత్వం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేదలకు వ్యతిరేకంగా బీజేపీ కేంద్ర సర్కారు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కర్ణాటకకు బియ్యం సరఫరా చేయకపోవడంపై మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై సీఎం సిద్ధరామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ అత్యున్నత పదవిలో ఉండటం పట్ల కాంగ్రెస్ అసూయ పడుతోందని అన్నారు. గాంధీ కుటుంబానికి ప్రధాని కూర్చీపై సర్వ హక్కులు ఉన్నాయని భావిస్తోందని విమర్శించారు. సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీ ప్రధాన మోదీని నీచ్ అని పిలవడానికి ప్రయత్నించాయని అన్నారు. మోదీ పేద నేపథ్యం నుంచి వచ్చి దేశ అత్యున్నత పదవి చేపట్టడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను చూసి అసూయపడుతోందని చెప్పారు. ప్రధానమంత్రి పదవిపై తమకే అన్ని హక్కులు ఉన్నాయని కాంగ్రెస్ భావిస్తోందని, పీఎం కుర్చీ గాంధీ కుటుంబానికి చెందినదేనని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల సదర్భంగా ఇచ్చిన ఐదు కీలకమైన హామీల్లో అన్నభాగ్య పథకం కూడా ఒకటి. ఈ హామీ ప్రకారం.. ప్రతి బీపీఎల్ (దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు) ఖాతాదారులకు 5 కిలోల చొప్పున అదనంగా బియ్యాన్ని పంపిణీ చేస్తామని కాంగ్రెస్ నాయకత్వం హామీ ఇచ్చింది. అన్నభాగ్య పథకాన్ని అమలు చేసేందుకు అదనంగా ధాన్యాన్ని సేకరించాల్సి ఉంటుంది. కానీ బియ్యం సేకరణ సాధ్యం కావడం లేదు. ఈ క్రమంలో తమకు బియ్యం ఇవ్వాల్సింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే కేంద్రంలోని బీజేపీ సర్కారు బియ్యాన్ని సరఫరా చేయడానికి నిరాకరించిందని సీఎం సిద్ధరామయ్య తెలిపారు.

అన్నభాగ్య పథకం కింద లబ్ధిదారులైన పేదలకు అదనంగా 5 కిలోల చొప్పున సరఫరా చేయాలనే తమ విన్నపాన్ని అంగీకరించలేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 7 కిలోల బియ్యం ఇచ్చేవాళ్లమని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 - 5 కిలోలకు కుదించిందని విమర్శించారు. దాని వల్లే ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం అదనంగా ఇస్తామని ఎన్నికల ప్రచారం హామీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు సిద్ధరామయ్య. పంపిణీ చేసేందుకు బియ్యం కోసం కేంద్రాన్ని సంప్రదించగా.. బియ్యం ఇవ్వలేదని అన్నారు. కేంద్రం నుంచి తామేమీ ఉచితంగా బియ్యం అడగడం లేదని, డబ్బు చెల్లిస్తామని అంటున్నా కేంద్రం ఇవ్వడం లేదని సిద్ధరామయ్య మండిపడ్డారు. ఈ క్రమంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నీచమైనదని, మానవత్వం లేనిదని కామెంట్ చేశారు.

బియ్యం ఇవ్వడంలేదంటూ కేంద్రంపై సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వివరణ ఇచ్చారు. దేశం మొత్తం కరువు పరిస్థితులు ఉన్నాయని, బియ్యం నిల్వలు క్షీణిస్తున్నందు వల్ల ఎగుమతులను కూడా నిషేధించినట్లు వెల్లడించారు. దేశంలో బియ్యం ధరలు పెరుగుతున్నట్లు చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అడిగినా.. కేంద్రం బియ్యం ఇవ్వడంలేదని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. నీచ్ అనే పదాలు వాడటం.. కాంగ్రెస్ పార్టీ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget