అన్వేషించండి

Pralhad Joshi: కేంద్రం ఓ నీచమైన ప్రభుత్వమన్న సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ నేతల ఫైర్

Pralhad Joshi: కేంద్రం ఒక నీచమైన ప్రభుత్వమని, మానవత్వం లేదన్న సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు.

Pralhad Joshi: కేంద్రంలో ఉన్నది నీచమైన ప్రభుత్వం అని, మానవత్వం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేదలకు వ్యతిరేకంగా బీజేపీ కేంద్ర సర్కారు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కర్ణాటకకు బియ్యం సరఫరా చేయకపోవడంపై మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై సీఎం సిద్ధరామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ అత్యున్నత పదవిలో ఉండటం పట్ల కాంగ్రెస్ అసూయ పడుతోందని అన్నారు. గాంధీ కుటుంబానికి ప్రధాని కూర్చీపై సర్వ హక్కులు ఉన్నాయని భావిస్తోందని విమర్శించారు. సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీ ప్రధాన మోదీని నీచ్ అని పిలవడానికి ప్రయత్నించాయని అన్నారు. మోదీ పేద నేపథ్యం నుంచి వచ్చి దేశ అత్యున్నత పదవి చేపట్టడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను చూసి అసూయపడుతోందని చెప్పారు. ప్రధానమంత్రి పదవిపై తమకే అన్ని హక్కులు ఉన్నాయని కాంగ్రెస్ భావిస్తోందని, పీఎం కుర్చీ గాంధీ కుటుంబానికి చెందినదేనని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల సదర్భంగా ఇచ్చిన ఐదు కీలకమైన హామీల్లో అన్నభాగ్య పథకం కూడా ఒకటి. ఈ హామీ ప్రకారం.. ప్రతి బీపీఎల్ (దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు) ఖాతాదారులకు 5 కిలోల చొప్పున అదనంగా బియ్యాన్ని పంపిణీ చేస్తామని కాంగ్రెస్ నాయకత్వం హామీ ఇచ్చింది. అన్నభాగ్య పథకాన్ని అమలు చేసేందుకు అదనంగా ధాన్యాన్ని సేకరించాల్సి ఉంటుంది. కానీ బియ్యం సేకరణ సాధ్యం కావడం లేదు. ఈ క్రమంలో తమకు బియ్యం ఇవ్వాల్సింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే కేంద్రంలోని బీజేపీ సర్కారు బియ్యాన్ని సరఫరా చేయడానికి నిరాకరించిందని సీఎం సిద్ధరామయ్య తెలిపారు.

అన్నభాగ్య పథకం కింద లబ్ధిదారులైన పేదలకు అదనంగా 5 కిలోల చొప్పున సరఫరా చేయాలనే తమ విన్నపాన్ని అంగీకరించలేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 7 కిలోల బియ్యం ఇచ్చేవాళ్లమని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 - 5 కిలోలకు కుదించిందని విమర్శించారు. దాని వల్లే ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం అదనంగా ఇస్తామని ఎన్నికల ప్రచారం హామీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు సిద్ధరామయ్య. పంపిణీ చేసేందుకు బియ్యం కోసం కేంద్రాన్ని సంప్రదించగా.. బియ్యం ఇవ్వలేదని అన్నారు. కేంద్రం నుంచి తామేమీ ఉచితంగా బియ్యం అడగడం లేదని, డబ్బు చెల్లిస్తామని అంటున్నా కేంద్రం ఇవ్వడం లేదని సిద్ధరామయ్య మండిపడ్డారు. ఈ క్రమంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నీచమైనదని, మానవత్వం లేనిదని కామెంట్ చేశారు.

బియ్యం ఇవ్వడంలేదంటూ కేంద్రంపై సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వివరణ ఇచ్చారు. దేశం మొత్తం కరువు పరిస్థితులు ఉన్నాయని, బియ్యం నిల్వలు క్షీణిస్తున్నందు వల్ల ఎగుమతులను కూడా నిషేధించినట్లు వెల్లడించారు. దేశంలో బియ్యం ధరలు పెరుగుతున్నట్లు చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అడిగినా.. కేంద్రం బియ్యం ఇవ్వడంలేదని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. నీచ్ అనే పదాలు వాడటం.. కాంగ్రెస్ పార్టీ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Raghav Chadha: ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
Tamil Nadu Elections 2026: విజయ్ డబుల్ రోల్ వ్యూహం - తమిళనాడు రాజకీయాల్లో సాహసమా లేక తప్పిదమా?
విజయ్ డబుల్ రోల్ వ్యూహం - తమిళనాడు రాజకీయాల్లో సాహసమా లేక తప్పిదమా?
మహాకాళేశ్వర్ ఆలయంలో పొరపాటు చేసిన అక్షయ్ కుమార్ - ఏ శివాలయానికి వెళ్లినా మీరు ఆ పొరపాటు చేయకండి!
మహాకాళేశ్వర్ ఆలయంలో పొరపాటు చేసిన అక్షయ్ కుమార్ - ఏ శివాలయానికి వెళ్లినా మీరు ఆ పొరపాటు చేయకండి!
Life of Jesus : యేసు మరణం గుడ్ ఫ్రైడే, జననం క్రిస్మస్.. మరి ఈస్టర్? జీసస్ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలివే  
యేసు మరణం గుడ్ ఫ్రైడే, జననం క్రిస్మస్.. మరి ఈస్టర్? జీసస్ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలివే  

వీడియోలు

Arjun Tendulkar Comments on Mumbai Indians | ముంబై ఇండియన్స్ పై అర్జున్ టెండూల్కర్ కామెంట్స్ | ABP Desam
Jadeja Breaks Silence on MS Dhoni | ధోనీపై జడేజా సంచలన వ్యాఖ్యలు | ABP Desam
IPL 2026 DC VS LSG Highlights | ఆల్ రౌండ్ షోతో బోణీ కొట్టిన ఢిల్లీ | ABP Desam
Rishabh Pant LSG vs Delhi Capitals IPL 2026 | లక్నో సూపర్ జెయింట్స్ ఓటమికి కారణం అదేనా | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raghav Chadha: ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
Telangana Rythu Bharosa Scheme Update: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
YSRCP No friends: మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
Tamil Nadu Elections 2026: విజయ్ డబుల్ రోల్ వ్యూహం - తమిళనాడు రాజకీయాల్లో సాహసమా లేక తప్పిదమా?
విజయ్ డబుల్ రోల్ వ్యూహం - తమిళనాడు రాజకీయాల్లో సాహసమా లేక తప్పిదమా?
Biker Movie Review - 'బైకర్' రివ్యూ: తండ్రీ కుమారుల కథ ఎలా ఉంది? 'నారీ నారీ...' తర్వాత శర్వానంద్ మరో సక్సెస్ కొట్టారా?
'బైకర్' రివ్యూ: తండ్రీ కుమారుల కథ ఎలా ఉంది? 'నారీ నారీ...' తర్వాత శర్వానంద్ మరో సక్సెస్ కొట్టారా?
Kaleshwaram Politics: కాళేశ్వరంపై రేవంత్ వాదననే వినిపిస్తున్నకేంద్రం - బీఆర్ఎస్‌ ఉక్కిరిబిక్కిరి -ఎదురుదాడి ఎలా?
కాళేశ్వరంపై రేవంత్ వాదననే వినిపిస్తున్నకేంద్రం - బీఆర్ఎస్‌ ఉక్కిరిబిక్కిరి -ఎదురుదాడి ఎలా?
Mrithyunjay OTT : ఆ మర్డర్స్ చేసింది ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ్
ఆ మర్డర్స్ చేసింది ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ్
Palasa- Ichchapuram: ఉద్దానం ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్‌! దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో పలాస- ఇచ్చాపురం సెక్షన్‌ విలీనం!
ఉద్దానం ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్‌! దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో పలాస- ఇచ్చాపురం సెక్షన్‌ విలీనం!
Embed widget