అన్వేషించండి

Tomato Price Hike: టమాటాల కోసం దేశ సరిహద్దులు దాటుతున్న ప్రజలు, కారణం ఏంటంటే?

Tomato Price Hike: దేశంలో టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో దేశ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న కొంతమంది ప్రజలు వేరే దేశాలకు వెళ్తున్నారు. తక్కువ ధరకు టమాటాలు తెచ్చుకుంటున్నారు. 

Tomato Price Hike: దేశంలో టమాటాల ధర విపరీతంగా పెరిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈక్రమంలోనే చాలా మంది ఎక్కడ టమాటాలు తక్కువ ధరకు దొరుకుతున్నాయో తెలుసుకొని మరీ వెళ్తున్నారు. దగ్గర్లోనే ఓ ఐదారు మార్కెట్లలో ఇలా చేస్తే విచిత్రమేమీ లేదు కానీ.. టమాటాల కోసం ఇతర దేశానికి వెళ్తే మాత్రం చెప్పుకోదగ్గ విషయమే. ఉత్తరాఖండ్ లోని పితోర్ ఘర్ జిల్లాలోని భారత్ - నేపాల్ రిహద్దు వెంబడి చాలా మంది ప్రజలు ఉంటున్నారు. అయితే వీరంతా మనం దేశంలో టమాటా ధరలు ఎక్కువగా ఉండడంతో నేపాల్ కు వెళ్లి మరీ టామాటాలు కొనుగోలు చేస్తున్నారు. నేపాల్ సరిహద్దులోని సమీప ప్రాంతాల్లో టనాటా ధరలు మన దేశంలోని ధరలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. దాదాపుగా సగం ధరకే లభిస్తున్నాయట. అందుకే ధార్చుల, బన్ బాసా నివాసితులు నేపాల్ వెళ్లి టమాటాలు తెచ్చుకుంటున్నారు. మన దగ్గర కిలో టమాటాలు రూ.120 నుంచి రూ.150 వరకు ఉన్నాయి. అదే నేపాల్ లో అయితే 62 రూపాయల నుంచి 69 రూపాయలకు మాత్రమే కిలో టమాటాలు వస్తున్నాయి. 

మరోవైపు దేశంలో టమోటా ధరలు విపరీతంగా మండిపోవడంతో కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు తక్కువ ధరకు అందించేందుకు సిద్ధం అవుతోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి టమాటా కొనుగోలు చేసి ఎక్కువ ధరలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి అక్కడకు పంపిణీ చేయాలని జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్యలను వినియోగదారుల వ్యవహారాల శాఖ కోరింది.

భారీ వర్షాలు కురుస్తుండడంతో పెరిగిన టమాటా ధరలు 

ఈక్రమంలోనే శుక్రవారం నాటికి ఢిల్లీ - ఎన్‌సీఆర్‌లోని వినియోగదారులకు తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో అనేక చోట్ల కిలో టమాట ధర రూ.200కు చేరుకుంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో పంట దిగుబడి, సరుకు రవాణాలో అంతరాయం కారణంగా టమాటా ధర రికార్డు స్థాయిలో నమోదు అవుతుంది. ఈ క్రమంలోనే గత నెల రోజులుగా టనాటా ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న ప్రాంతాలను గుర్తించి అక్కడి రిటైల్ కేంద్రాల్లో పంపిణీ చేయాలని భావిస్తోంది. 

మిగతా రాష్ట్రాలకు సరఫరా..!

దాదాపు దేశంలోని ప్రతీ రాష్ట్రంలో టమోటా ఉత్పత్తి చేస్తున్నప్పటికీ.. దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతాలు నుంచే దాదాపు 60 శాతం పండిస్తున్నాయి. వారు వాడుకోగా మిగిలిన ఉత్పత్తిని దేశంలోని మిగతా రాష్ట్రాల్లోకి సరఫరా చేస్తున్నారు. అలాగే ఆ ప్రాంతాల్లో ఉత్పత్తి సీజన్ లు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు గరిష్ట హార్వెస్టింగ్ కాలం ఉంటుంది. జులై నుంచి ఆగస్టు మరియు అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఎక్కువగా పండిస్తారు. ప్రస్తుతం గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ నుంచి టమోటా సరఫరాలు అవుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీ మరియు సమీప నగరాలకు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ప్రస్తుతం టమాటాలు అందుతున్నాయి. త్వరలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ నుంచి కొత్త పంటలు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. త్వరలోనే ఆ ధరలు అన్నీ తగ్గుతాయని చెప్పింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
FOMO: వేరే వాళ్ల స్టాటస్ చూసి వీళ్లకు సోకులు ఎక్కువయ్యాయని అనుకుంటున్నారా? అయితే మీరు ఫోమో బాధితులే!
వేరే వాళ్ల స్టాటస్ చూసి వీళ్లకు సోకులు ఎక్కువయ్యాయని అనుకుంటున్నారా? అయితే మీరు ఫోమో బాధితులే!
Sandhya Nama Upasate Trailer : క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
Embed widget