అన్వేషించండి

Padma Awards 2025 : పద్మ అవార్డులను ప్రారంభంలో ఈ పేర్లతోనే పిలిచేవారట - ఇంతకీ ఆ పేర్లు ఏంటంటే..

Padma Awards 2025 : పద్మ అవార్డుల ప్రదానం భారతరత్నతో ప్రారంభమైంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, భారత ప్రభుత్వం 1954లో భారతరత్న, పద్మవిభూషణ్‌లను ఇవ్వాలని నిర్ణయించింది.

Padma Awards 2025 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డుల కోసం పలువురి పేర్లను ప్రకటించింది. ఇందులో గాయకుడు భేరు సింగ్ చౌహాన్, భీమ్ సింగ్ భవేష్, అథ్లెట్ హర్విందర్ సింగ్, డాక్టర్ నీర్జా భట్ల మరియు కువైట్ యోగా ట్రైనర్ షేఖా ఏజే అల్ సబాహా వంటి పలువురు ప్రముఖులున్నారు. సాధారణంగా దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే  3 విభాగాల్లో అందిస్తారు. అయితే చాలా మందికి తెలియని విషయమేమిటంటే.. ప్రారంభంలో వీటిని వేరే పేర్లతో పిలిచేవారు. ఆ పేర్లతోనే అవార్డులు అందించేవారు. అయితే ఈ పేర్లను ఎప్పుడు మార్చారు అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1954 నుంచి మొదలు..

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, భారత ప్రభుత్వం 1954 నుంచి భారతరత్న, పద్మవిభూషణ్‌లను ఇవ్వాలని నిర్ణయించింది. అప్పట్నుంచి వివిధ రంగాల్లో అద్భుతమైన, విశేష సేవలందించిన వారికి ఈ అవార్డులు అందజేస్తున్నారు. కళ, సామాజిక సేవ, సైన్స్, ఇంజినీరింగ్, వ్యాపారం, పరిశ్రమ, వైద్యం, సాహిత్యం, క్రీడలు వంటి విభిన్న రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు ఈ అవార్డులను అందజేస్తున్నారు. ఈ పురస్కారాలను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. అనంతరం ఆ ఏడాదిలో వచ్చే మార్చి-ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్‌లో జరిగే వేడుకలో వారికి అవార్డులను అందిస్తారు.

ప్రారంభంలో ప్రతిపాదించిన పేర్లు ఇవే

1954లో పద్మ అవార్డులను ప్రకటించినప్పుడు కేవలం దాన్ని పద్మవిభూషణ్ పేరుతో మాత్రమే పురస్కారాలను అందించేవారు. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ అనే మూడు కేటగిరీలు ఉండేవి. కానీ ఈ పేర్లు కేవలం సంవత్సరం వరకే కొనసాగాయి. ఆ తర్వాత జనవరి 8, 1955న రాష్ట్రపతి భవన్ జారీ చేసిన నోటిఫికేషన్‌లో, ఈ అవార్డుల పేర్లను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీగా మార్చారు. అప్పట్నుంచి ఈ పేర్లు వాడుకలోకి వచ్చాయి.

పద్మ అవార్డుల్లో కీలక నిబంధనలు

పద్మ అవార్డులు అందుకున్న వారు మరో 5ఏళ్ల పాటు మరే ఇతర పద్మ అవార్డును అందుకోలేరు. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే.. ఒకరికి ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డు వస్తే.. అతను మరో 5 ఏళ్ల తర్వాతే పద్మభూషణ్ లేదా పద్మవిభూషణ్‌కు అర్హులుగా భావిస్తారు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రం ఆయా పరిస్థితులకు అనుగుణంగా నియమాలను మార్చే అవకాశం కూడా ఉంటుంది.

ఈ ఏడాది పద్మ అవార్డులు వరించింది వీళ్లనే

కేంద్ర ప్రభుత్వం జనవరి 25న పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసింది. అందులో భాగంగా ఏడుగురికి పద్మ విభూషణ్, 19మందికి పద్మ భూషణ్, 113మందికి పద్మ శ్రీ అవార్డులు అందజేయనున్నట్టు తెలిపింది. వీరిలో వైద్య విభాగంలో సేవలందించిన తెలంగాణకు చెందిన దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ వరించగా, కళల విభాగంలో ఏపీకి చెందిన సినీ నటుడు బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైనారు.

Also Read : Batool Begum : రాముని కీర్తనలు పాడే బతూల్ బేగంను వరించిన పద్మశ్రీ - ఇంతకీ ఆమె ఎవరంటే..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Peddi Ticket Price Hike In Telangana:
Peddi Ticket Price Hike In Telangana: "పెద్ది"కి గుడ్ న్యూస్- తెలంగాణలో టికెట్‌ ధరలు పెంపు
Kanpur Petrol Pump Scam: ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
Indian Mango party San Francisco: అమెరికాలో ఫ్రీ మ్యాంగో ఫెస్టివల్ పెట్టిన భారతీయులు - క్యూలో నిలబడి తిన్న అమెరికన్లు - వీడియోలు వైరల్
అమెరికాలో ఫ్రీ మ్యాంగో ఫెస్టివల్ పెట్టిన భారతీయులు - క్యూలో నిలబడి తిన్న అమెరికన్లు - వీడియోలు వైరల్
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాల్లో 2 రోజులపాటు వర్షాలు, ఏపీలో రెడ్ అలర్ట్.. పిడుగులు పడతాయని వార్నింగ్
తెలంగాణలో పలు జిల్లాల్లో 2 రోజులపాటు వర్షాలు, ఏపీలో రెడ్ అలర్ట్.. పిడుగుల వార్నింగ్
Minister Ponnam Prabhakar counter to Pawan Kalyan: ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
NHAI Toll Exemption List: టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
AP DSC Sports Quota Controversy: ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
Kanpur Petrol Pump Scam: ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Embed widget