అన్వేషించండి

Odisha MLA Car: ఒడిశాలో లఖింపుర్ తరహా ఘటన - జనంపైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు, 22 మందికి గాయాలు

Odisha MLA Car: ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బీజేడీ ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్దేవ్ కారు జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 22 మంది గాయపడ్డారు. దీంతో ప్రజలు ఆగ్రహించి ఎమ్మెల్యేపై దాడి చేశారు.

Odisha MLA Car: ఉత్తర్ ప్రదేశ్(UttarPradesh) లో లఖింపుర్​ ఖేరి దుర్ఘటన మరువక ముందే ఒడిశాలో మరో ఘోరం జరిగింది. ఒడిశాలోని ఖుర్దాలో బీజేడీ ఎమ్మెల్యే(సస్పెండ్) ఎమ్మెల్యే ప్రశాంత్​ జగ్​దేవ్(Prashant Jagdev)​ కారు జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 22 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వీరిలో 15 మంది బీజేపీ(BJP) కార్యకర్తలు, ఏడుగురు పోలీసు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బానాపుర్‌ ఇన్‌ఛార్జ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌ఆర్‌ సాహు కూడా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని భువనేశ్వర్​ ఎయిమ్స్ కు తరలించారు.

మద్యం మత్తులో ఎమ్మెల్యే!

పంచాయతీ సమితి ఛైర్‌పర్సన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఖుర్దా జిల్లాలోని బానాపుర్ బ్లాక్​ ఆఫీస్​ ముందు పలు పార్టీల కార్యకర్తలు గుమిగూడి ఉన్నారు. ఈ సమయంలోనే బిజూ జనతా దళ్‌ (బీజేడీ) బహిష్కృత ఎమ్మెల్యే ప్రశాంత్‌ జగ్దేవ్‌ కారుతో వారిపైకి దూసుకెళ్లారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు ఎమ్మెల్యే(MLA)పై దాడికి దిగారు. ఆయన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఘటనా సమయంలో ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన జగ్​దేవ్ ​ను పోలీసులు రక్షించారు. భువనేశ్వర్‌లోని ఆసుపత్రికి తరలించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంగా గత ఏడాది సెప్టెంబరులో జగ్దేవ్‌ను బీజేడీ సస్పెండ్‌ చేసింది.

"ఈ ఘటనలో బాణాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్-ఇన్చార్జ్ ఆర్ఆర్ సాహుతో సహా ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించాం. దాదాపు 15 మంది బీజేపీ కార్యకర్తలు, ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. దీనిపై విచారణ ప్రారంభించాం’’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 

ప్రాణ నష్టంపై నివేదిక అందలేదు  : ఎస్పీ 

ప్రజల దాడిలో గాయపడిన ఎమ్మెల్యేకు తొలుత తంగి ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం భువనేశ్వర్‌కు తరలించినట్లు ఖుర్దా ఎస్పీ అలేఖ్ చంద్ర పాహి తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు జగ్దేవ్ గతేడాది సస్పెన్షన్‌కు గురయ్యారు. "ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు ఇంకా నివేదిక అందలేదు" అని ఎస్పీ పాహి అన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
Embed widget