అన్వేషించండి

Supreme Court : టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

Supreme Court :'వక్ఫ్ బోర్డు విషయంలో కేంద్రానికి అనేక ప్రశ్నలు సుప్రీంకోర్టు సంధించింది. ప్రస్తుతానికి బోర్డులో ముస్లిం సభ్యులు మాత్రమే ఉండాలి' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Supreme Court : కొత్త వక్ఫ్‌ చట్టంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. కొన్ని అంశాలపై అనుమానాలు ఉన్నాయని అభిప్రాయపడింది. జిల్లా కలెక్టర్లకు ఇచ్చిన అధికారులపై అస్పష్టత ఉందని పేర్కొంది. 

వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, కొత్త చట్టంలోని చాలా రూల్స్‌పై ప్రశ్నలు సంధించింది. ముఖ్యంగా వినియోగదారుల ఆస్తుల ద్వారా వక్ఫ్‌కు సంబంధించిన నిబంధనలపై కేంద్రాన్ని నిలదీసింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను చేర్చే నిబంధనపై కూడా కోర్టు ప్రశ్నించింది. ముస్లింలను హిందూ బోర్డులో భాగం కావడానికి అనుమతిస్తుందా అని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది. 

వక్ఫ్ బోర్డులో ఎక్స్-అఫిషియో సభ్యులు కాకుండా ముస్లిం సభ్యులు మాత్రమే ఉండాలని కోర్టు కామెంట్ చేసింది. దీనిని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యతిరేకించారు. ఈ పిటిష్లపై గురువారం (ఏప్రిల్ 17, 2025) మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ విచారణకు జరగనుంది. 

ఈ వక్ఫ్‌ బిల్లును వ్యతిరేకిస్తూ చాలా పిటిషన్లు వచ్చినందున విచారణ ప్రారంభంలోనే ప్రధాన న్యాయమూర్తి పిటిషనర్లకు కీలకాంశాలు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. పిటిషనర్లు ఏ అంశాలను వాదించాలనుకుంటున్నారని? పిటిషనర్లలో ఒకరి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ, కొత్త చట్టంలోని అనేక నిబంధనలు ఆర్టికల్ 26ను ఉల్లంఘిస్తున్నాయని అన్నారు.

వక్ఫ్ సవరణ చట్టం 2025కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఎవరైనా ముస్లిం అవునా కాదా అని ఎలా నిర్ణయించగలరని అభ్యంతరం వ్యక్తం చేశారు. వక్ఫ్‌కు ఆస్తిని దానం చేయడానికి, ఆ వ్యక్తి కనీసం 5 ఏళ్లుగా ఇస్లాంను అనుసరిస్తూ ఉండాలి అని పేర్కొన్న కొత్త చట్టంలో మార్పును కపిల్ సిబల్ వ్యతిరేకించారు.
 
వక్ఫ్ నిర్వహణ చట్టంలోని సెక్షన్ 3Rని ప్రస్తావిస్తూ కపిల్ సిబల్ ఈ ప్రశ్నను లేవనెత్తారు. వక్ఫ్ అంటే ఐదు సంవత్సరాలుగా ఇస్లాంను అనుసరిస్తున్న వ్యక్తి అని చెబుతుందని ఆయన అన్నారు. దీని అర్థం ఆ వ్యక్తి ఐదు సంవత్సరాలుగా ఇస్లాంను అనుసరిస్తున్నాడని చెప్పాల్సి ఉంటుందని, అయితే ఎవరైనా ముస్లిం అవునా కాదా అని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు, ఎలా నిర్ణయించగలదని ఆయన అన్నారు.
 
ఇస్లాంలో వారసత్వం ఎవరికి లభిస్తుందో చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు ఉన్నారని కపిల్ సిబల్ ప్రశ్నించారు. కపిల్ సిబల్ వాదనపై ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా జోక్యం చేసుకుని, 'కానీ హిందూ మతంలో ఇది జరుగుతుంది. అందుకే పార్లమెంటు ముస్లింల కోసం ఒక చట్టం చేసింది. ఇది హిందువుల మాదిరిగా ఉండకపోవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ ఈ విషయంలో చట్టం చేయకుండా ఉండలేదు' అని అన్నారు. ఆర్టికల్ 26 అందరికీ వర్తిస్తుందని ఆయన అన్నారు.
 
ఇస్లాంలో వారసత్వ నిర్ణయం మరణానంతరం తీసుకుంటారని కానీ ప్రభుత్వం ముందే జోక్యం చేసుకుంటుందని కపిల్ సిబల్ అన్నారు. ప్రభుత్వం ఆస్తిని గుర్తించి అది వక్ఫ్ కాదా అని ప్రకటించడం ఎలా సాధ్యమవుతుంది. వక్ఫ్ ఆస్తిని గుర్తించడానికి కలెక్టర్‌కు నిర్ణయం తీసుకునే హక్కు ఇవ్వడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదైనా వివాదం ఉంటే, ఆ ఆస్తి వక్ఫ్ కాదా అని కలెక్టర్ నిర్ణయించే బాధ్యత చట్టంలో కలెక్టర్‌కు ఇచ్చారని అన్నారు. కలెక్టర్ ప్రభుత్వ వ్యక్తి అని అతనికి నిర్ణయం తీసుకునే హక్కు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధంగా తెలిపారు. కలెక్టర్ న్యాయమూర్తి పాత్ర పోషిస్తే అది రాజ్యాంగ విరుద్ధమని ఆయన వాదించారు.
 
సుప్రీంకోర్టులో విచారణ ముగియబోతున్న టైంలో  ఈ విచారణ పెండింగ్‌లో ఉన్నంత వరకు రెండు ఆదేశాలు ఇస్తున్నట్టు కోర్టు సూచించింది. వక్ఫ్ బోర్డులోని ఎక్స్-అఫిషియో సభ్యులు తప్ప అందరు సభ్యులు ముస్లింలై ఉండాలి. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించే వారి అతిపెద్ద ఆందోళన ఏమిటంటే, నమోదు చేయని వక్ఫ్ బై యూజర్ డీనోటిఫై చేయనున్నారు. అంటే అది ఇకపై వక్ఫ్ కాదు. దీనిపై సుప్రీంకోర్టు, విచారణ పెండింగ్‌లో ఉన్నంత వరకు ప్రభుత్వం ఇలాంటివి ఏమీ చేయదని పేర్కొంది.

వక్ఫ్ సవరణ చట్టం 2025 పై విచారణ సందర్భంగా, హిందూ ట్రస్ట్ బోర్డులో హిందువులు కాని సభ్యులు ఉన్నారా అని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కూడా కోర్టు ప్రస్తావించింది. అందులో హిందూయేతరులు సభ్యులుగా ఉన్నారా అని క్వశ్చన్ చేసింది. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చడంపై పిటిషనర్ల అభ్యంతరానికి సంబంధించి సుప్రీంకోర్టు ఈ ప్రశ్న అడిగింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kerala Assembly Elections 2026: కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
Dangerous bike smoke: బైక్ ఆన్ చేసి గదిలో ఉంచితే ప్రాణాలు మిగలవు - పుంగనూరు ఘటనలో జరిగింది ఇదే - ఎందుకంటే ?
బైక్ ఆన్ చేసి గదిలో ఉంచితే ప్రాణాలు మిగలవు - పుంగనూరు ఘటనలో జరిగింది ఇదే - ఎందుకంటే ?
Tamil Nadu Assembly Elections 2026: రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
Visa Interview Tips : వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలా? ముందుగానే ఇలా ప్రిపేర్ అవ్వండి, వీసా రిజెక్ట్ కాదు
వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలా? ముందుగానే ఇలా ప్రిపేర్ అవ్వండి, వీసా రిజెక్ట్ కాదు

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ramzan 2026: ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. 10 వేల ఖాతాల్లోకి నగదు జమ
ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. 10 వేల ఖాతాల్లోకి నగదు జమ
BRS On Rohit Reddy: మొయినాబాద్ డ్రగ్స్ కేసు- రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశాలు
మొయినాబాద్ డ్రగ్స్ కేసు- రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశాలు
Pakistan Airstrike: కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
Akshay Kumar: నవ్వించడం కష్టమే కానీ... అవార్డులు ఇవ్వరుగా - అక్షయ్ కుమార్ కామెంట్స్‌
నవ్వించడం కష్టమే కానీ... అవార్డులు ఇవ్వరుగా - అక్షయ్ కుమార్ కామెంట్స్‌
Telangana Assembly Budget Session: ప్రశ్నోత్తరాలు లేకుండా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ విమర్శలు! బీజేపీ వినూత్న నిరసన
ప్రశ్నోత్తరాలు లేకుండా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ విమర్శలు! బీజేపీ వినూత్న నిరసన
Kerala Assembly Elections 2026: కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
YSRCP local polls plan: లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
Weight Loss Journey : మూడు సంవత్సరాల్లో 72 కిలోలు తగ్గిన మహిళ.. ఈ 7 సింపుల్ హ్యాబిట్స్ మిమ్మల్నీ కూడా మార్చేస్తాయి
మూడు సంవత్సరాల్లో 72 కిలోలు తగ్గిన మహిళ.. ఈ 7 సింపుల్ హ్యాబిట్స్ మిమ్మల్నీ కూడా మార్చేస్తాయి
Embed widget