అన్వేషించండి

Supreme Court : టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

Supreme Court :'వక్ఫ్ బోర్డు విషయంలో కేంద్రానికి అనేక ప్రశ్నలు సుప్రీంకోర్టు సంధించింది. ప్రస్తుతానికి బోర్డులో ముస్లిం సభ్యులు మాత్రమే ఉండాలి' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Supreme Court : కొత్త వక్ఫ్‌ చట్టంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. కొన్ని అంశాలపై అనుమానాలు ఉన్నాయని అభిప్రాయపడింది. జిల్లా కలెక్టర్లకు ఇచ్చిన అధికారులపై అస్పష్టత ఉందని పేర్కొంది. 

వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, కొత్త చట్టంలోని చాలా రూల్స్‌పై ప్రశ్నలు సంధించింది. ముఖ్యంగా వినియోగదారుల ఆస్తుల ద్వారా వక్ఫ్‌కు సంబంధించిన నిబంధనలపై కేంద్రాన్ని నిలదీసింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను చేర్చే నిబంధనపై కూడా కోర్టు ప్రశ్నించింది. ముస్లింలను హిందూ బోర్డులో భాగం కావడానికి అనుమతిస్తుందా అని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది. 

వక్ఫ్ బోర్డులో ఎక్స్-అఫిషియో సభ్యులు కాకుండా ముస్లిం సభ్యులు మాత్రమే ఉండాలని కోర్టు కామెంట్ చేసింది. దీనిని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యతిరేకించారు. ఈ పిటిష్లపై గురువారం (ఏప్రిల్ 17, 2025) మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ విచారణకు జరగనుంది. 

ఈ వక్ఫ్‌ బిల్లును వ్యతిరేకిస్తూ చాలా పిటిషన్లు వచ్చినందున విచారణ ప్రారంభంలోనే ప్రధాన న్యాయమూర్తి పిటిషనర్లకు కీలకాంశాలు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. పిటిషనర్లు ఏ అంశాలను వాదించాలనుకుంటున్నారని? పిటిషనర్లలో ఒకరి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ, కొత్త చట్టంలోని అనేక నిబంధనలు ఆర్టికల్ 26ను ఉల్లంఘిస్తున్నాయని అన్నారు.

వక్ఫ్ సవరణ చట్టం 2025కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఎవరైనా ముస్లిం అవునా కాదా అని ఎలా నిర్ణయించగలరని అభ్యంతరం వ్యక్తం చేశారు. వక్ఫ్‌కు ఆస్తిని దానం చేయడానికి, ఆ వ్యక్తి కనీసం 5 ఏళ్లుగా ఇస్లాంను అనుసరిస్తూ ఉండాలి అని పేర్కొన్న కొత్త చట్టంలో మార్పును కపిల్ సిబల్ వ్యతిరేకించారు.
 
వక్ఫ్ నిర్వహణ చట్టంలోని సెక్షన్ 3Rని ప్రస్తావిస్తూ కపిల్ సిబల్ ఈ ప్రశ్నను లేవనెత్తారు. వక్ఫ్ అంటే ఐదు సంవత్సరాలుగా ఇస్లాంను అనుసరిస్తున్న వ్యక్తి అని చెబుతుందని ఆయన అన్నారు. దీని అర్థం ఆ వ్యక్తి ఐదు సంవత్సరాలుగా ఇస్లాంను అనుసరిస్తున్నాడని చెప్పాల్సి ఉంటుందని, అయితే ఎవరైనా ముస్లిం అవునా కాదా అని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు, ఎలా నిర్ణయించగలదని ఆయన అన్నారు.
 
ఇస్లాంలో వారసత్వం ఎవరికి లభిస్తుందో చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు ఉన్నారని కపిల్ సిబల్ ప్రశ్నించారు. కపిల్ సిబల్ వాదనపై ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా జోక్యం చేసుకుని, 'కానీ హిందూ మతంలో ఇది జరుగుతుంది. అందుకే పార్లమెంటు ముస్లింల కోసం ఒక చట్టం చేసింది. ఇది హిందువుల మాదిరిగా ఉండకపోవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ ఈ విషయంలో చట్టం చేయకుండా ఉండలేదు' అని అన్నారు. ఆర్టికల్ 26 అందరికీ వర్తిస్తుందని ఆయన అన్నారు.
 
ఇస్లాంలో వారసత్వ నిర్ణయం మరణానంతరం తీసుకుంటారని కానీ ప్రభుత్వం ముందే జోక్యం చేసుకుంటుందని కపిల్ సిబల్ అన్నారు. ప్రభుత్వం ఆస్తిని గుర్తించి అది వక్ఫ్ కాదా అని ప్రకటించడం ఎలా సాధ్యమవుతుంది. వక్ఫ్ ఆస్తిని గుర్తించడానికి కలెక్టర్‌కు నిర్ణయం తీసుకునే హక్కు ఇవ్వడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదైనా వివాదం ఉంటే, ఆ ఆస్తి వక్ఫ్ కాదా అని కలెక్టర్ నిర్ణయించే బాధ్యత చట్టంలో కలెక్టర్‌కు ఇచ్చారని అన్నారు. కలెక్టర్ ప్రభుత్వ వ్యక్తి అని అతనికి నిర్ణయం తీసుకునే హక్కు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధంగా తెలిపారు. కలెక్టర్ న్యాయమూర్తి పాత్ర పోషిస్తే అది రాజ్యాంగ విరుద్ధమని ఆయన వాదించారు.
 
సుప్రీంకోర్టులో విచారణ ముగియబోతున్న టైంలో  ఈ విచారణ పెండింగ్‌లో ఉన్నంత వరకు రెండు ఆదేశాలు ఇస్తున్నట్టు కోర్టు సూచించింది. వక్ఫ్ బోర్డులోని ఎక్స్-అఫిషియో సభ్యులు తప్ప అందరు సభ్యులు ముస్లింలై ఉండాలి. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించే వారి అతిపెద్ద ఆందోళన ఏమిటంటే, నమోదు చేయని వక్ఫ్ బై యూజర్ డీనోటిఫై చేయనున్నారు. అంటే అది ఇకపై వక్ఫ్ కాదు. దీనిపై సుప్రీంకోర్టు, విచారణ పెండింగ్‌లో ఉన్నంత వరకు ప్రభుత్వం ఇలాంటివి ఏమీ చేయదని పేర్కొంది.

వక్ఫ్ సవరణ చట్టం 2025 పై విచారణ సందర్భంగా, హిందూ ట్రస్ట్ బోర్డులో హిందువులు కాని సభ్యులు ఉన్నారా అని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కూడా కోర్టు ప్రస్తావించింది. అందులో హిందూయేతరులు సభ్యులుగా ఉన్నారా అని క్వశ్చన్ చేసింది. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చడంపై పిటిషనర్ల అభ్యంతరానికి సంబంధించి సుప్రీంకోర్టు ఈ ప్రశ్న అడిగింది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Embed widget