అన్వేషించండి

Supreme Court : టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

Supreme Court :'వక్ఫ్ బోర్డు విషయంలో కేంద్రానికి అనేక ప్రశ్నలు సుప్రీంకోర్టు సంధించింది. ప్రస్తుతానికి బోర్డులో ముస్లిం సభ్యులు మాత్రమే ఉండాలి' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Supreme Court : కొత్త వక్ఫ్‌ చట్టంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. కొన్ని అంశాలపై అనుమానాలు ఉన్నాయని అభిప్రాయపడింది. జిల్లా కలెక్టర్లకు ఇచ్చిన అధికారులపై అస్పష్టత ఉందని పేర్కొంది. 

వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, కొత్త చట్టంలోని చాలా రూల్స్‌పై ప్రశ్నలు సంధించింది. ముఖ్యంగా వినియోగదారుల ఆస్తుల ద్వారా వక్ఫ్‌కు సంబంధించిన నిబంధనలపై కేంద్రాన్ని నిలదీసింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను చేర్చే నిబంధనపై కూడా కోర్టు ప్రశ్నించింది. ముస్లింలను హిందూ బోర్డులో భాగం కావడానికి అనుమతిస్తుందా అని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది. 

వక్ఫ్ బోర్డులో ఎక్స్-అఫిషియో సభ్యులు కాకుండా ముస్లిం సభ్యులు మాత్రమే ఉండాలని కోర్టు కామెంట్ చేసింది. దీనిని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యతిరేకించారు. ఈ పిటిష్లపై గురువారం (ఏప్రిల్ 17, 2025) మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ విచారణకు జరగనుంది. 

ఈ వక్ఫ్‌ బిల్లును వ్యతిరేకిస్తూ చాలా పిటిషన్లు వచ్చినందున విచారణ ప్రారంభంలోనే ప్రధాన న్యాయమూర్తి పిటిషనర్లకు కీలకాంశాలు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. పిటిషనర్లు ఏ అంశాలను వాదించాలనుకుంటున్నారని? పిటిషనర్లలో ఒకరి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ, కొత్త చట్టంలోని అనేక నిబంధనలు ఆర్టికల్ 26ను ఉల్లంఘిస్తున్నాయని అన్నారు.

వక్ఫ్ సవరణ చట్టం 2025కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఎవరైనా ముస్లిం అవునా కాదా అని ఎలా నిర్ణయించగలరని అభ్యంతరం వ్యక్తం చేశారు. వక్ఫ్‌కు ఆస్తిని దానం చేయడానికి, ఆ వ్యక్తి కనీసం 5 ఏళ్లుగా ఇస్లాంను అనుసరిస్తూ ఉండాలి అని పేర్కొన్న కొత్త చట్టంలో మార్పును కపిల్ సిబల్ వ్యతిరేకించారు.
 
వక్ఫ్ నిర్వహణ చట్టంలోని సెక్షన్ 3Rని ప్రస్తావిస్తూ కపిల్ సిబల్ ఈ ప్రశ్నను లేవనెత్తారు. వక్ఫ్ అంటే ఐదు సంవత్సరాలుగా ఇస్లాంను అనుసరిస్తున్న వ్యక్తి అని చెబుతుందని ఆయన అన్నారు. దీని అర్థం ఆ వ్యక్తి ఐదు సంవత్సరాలుగా ఇస్లాంను అనుసరిస్తున్నాడని చెప్పాల్సి ఉంటుందని, అయితే ఎవరైనా ముస్లిం అవునా కాదా అని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు, ఎలా నిర్ణయించగలదని ఆయన అన్నారు.
 
ఇస్లాంలో వారసత్వం ఎవరికి లభిస్తుందో చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు ఉన్నారని కపిల్ సిబల్ ప్రశ్నించారు. కపిల్ సిబల్ వాదనపై ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా జోక్యం చేసుకుని, 'కానీ హిందూ మతంలో ఇది జరుగుతుంది. అందుకే పార్లమెంటు ముస్లింల కోసం ఒక చట్టం చేసింది. ఇది హిందువుల మాదిరిగా ఉండకపోవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ ఈ విషయంలో చట్టం చేయకుండా ఉండలేదు' అని అన్నారు. ఆర్టికల్ 26 అందరికీ వర్తిస్తుందని ఆయన అన్నారు.
 
ఇస్లాంలో వారసత్వ నిర్ణయం మరణానంతరం తీసుకుంటారని కానీ ప్రభుత్వం ముందే జోక్యం చేసుకుంటుందని కపిల్ సిబల్ అన్నారు. ప్రభుత్వం ఆస్తిని గుర్తించి అది వక్ఫ్ కాదా అని ప్రకటించడం ఎలా సాధ్యమవుతుంది. వక్ఫ్ ఆస్తిని గుర్తించడానికి కలెక్టర్‌కు నిర్ణయం తీసుకునే హక్కు ఇవ్వడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదైనా వివాదం ఉంటే, ఆ ఆస్తి వక్ఫ్ కాదా అని కలెక్టర్ నిర్ణయించే బాధ్యత చట్టంలో కలెక్టర్‌కు ఇచ్చారని అన్నారు. కలెక్టర్ ప్రభుత్వ వ్యక్తి అని అతనికి నిర్ణయం తీసుకునే హక్కు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధంగా తెలిపారు. కలెక్టర్ న్యాయమూర్తి పాత్ర పోషిస్తే అది రాజ్యాంగ విరుద్ధమని ఆయన వాదించారు.
 
సుప్రీంకోర్టులో విచారణ ముగియబోతున్న టైంలో  ఈ విచారణ పెండింగ్‌లో ఉన్నంత వరకు రెండు ఆదేశాలు ఇస్తున్నట్టు కోర్టు సూచించింది. వక్ఫ్ బోర్డులోని ఎక్స్-అఫిషియో సభ్యులు తప్ప అందరు సభ్యులు ముస్లింలై ఉండాలి. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించే వారి అతిపెద్ద ఆందోళన ఏమిటంటే, నమోదు చేయని వక్ఫ్ బై యూజర్ డీనోటిఫై చేయనున్నారు. అంటే అది ఇకపై వక్ఫ్ కాదు. దీనిపై సుప్రీంకోర్టు, విచారణ పెండింగ్‌లో ఉన్నంత వరకు ప్రభుత్వం ఇలాంటివి ఏమీ చేయదని పేర్కొంది.

వక్ఫ్ సవరణ చట్టం 2025 పై విచారణ సందర్భంగా, హిందూ ట్రస్ట్ బోర్డులో హిందువులు కాని సభ్యులు ఉన్నారా అని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కూడా కోర్టు ప్రస్తావించింది. అందులో హిందూయేతరులు సభ్యులుగా ఉన్నారా అని క్వశ్చన్ చేసింది. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చడంపై పిటిషనర్ల అభ్యంతరానికి సంబంధించి సుప్రీంకోర్టు ఈ ప్రశ్న అడిగింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
Narendra Modi Tenure: ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
LPG Crisis: రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget