అన్వేషించండి

Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?

Sitaram Yechury Dead Body: సీతారాం ఏచూరి డెడ్ బాడీని న్యూఢిల్లీ ఎయిమ్స్‌కు కుటుంబ సభ్యులు అప్పగించనున్నారు. ఈ మేరకు ఎయిమ్స్ ఓ ప్రకటన విడుదల చేసింది.

Sitaram Yechury Death: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఢిల్లీలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన గత నెల 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటూ గురువారం చనిపోయారు. అయితే, అందరిలా సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని అంత్యక్రియలు చేయడం లేదని సీపీఎం ప్రకటించింది. ఆయన కోరిక మేరకు ఆయన దేహాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌కు అప్పగించనున్నట్లుగా ప్రకటించింది. 

ఎయిమ్స్ ప్రకటన

అంతేకాక, ఎయిమ్స్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘సీతారాం ఏచూరి (72) నిమోనియాతో ఆగస్టు 19న ఎయిమ్స్‌లో అడ్మిట్ అయ్యారు. సెప్టెంబరు 12 సాయంత్రం 3.05 గంటలకు చనిపోయారు. డెడ్ బాడీని ఆయన ఫ్యామిలీ ఢిల్లీలోని ఎయిమ్స్‌కు అప్పగించింది. టీచింగ్ అండ్ రీసెర్చ్ కోసం ఈ డెడ్ బాడీ ఉపయోగపడుతుంది’’ అని ఎయిమ్స్ ఆస్పత్రి ప్రకటించింది.

Also Read: వామపక్ష యోధుడు సీతారాం ఏచూరి కన్నుమూత

ప్రస్తుతానికి ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలోని మార్చురీలో సీతారాం ఏచూరి పార్థివ దేహం ఉన్నట్లుగా సీపీఎం వర్గాలు వెల్లడించాయి. 14వ తేదీ ఉదయం 8 గంటలకు ఢిల్లీలోని వసంత్ కుంజులో గల నివాసానికి పార్థివ దేహాన్ని తీసుకెళ్లనున్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏచూరీ పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. అదే సమయంలో ప్రముఖులు నివాళులు అర్పించేందుకు వీలు కల్పించనున్నారు. తర్వాత అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ ఎయిమ్స్‌కు సీతారాం ఏచూరి పార్థివ దేహం అప్పగించనున్నారు.

డెడ్ బాడీ కూడా దేశానికి ఉపయోగపడేలా - బీవీ రాఘవులు
ఈ విషయంపై సీపీఎం నేత బీవీ రాఘవులు మాట్లాడారు. సీతారాం ఏచూరి రాజకీయాల్లో రావడమే కుటుంబాన్ని త్యాగం చేసి వచ్చారని అన్నారు. ‘‘అందుకని తన పార్థివ దేహం కూడా దేశానికి, ప్రజలకు ఉపయోగపడాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి, తన పార్థివ దేహం కూడా ప్రయోగాల కోసం ఉపయోగపడాలనే ఉద్దేశం ఆయనకు ఎప్పుడూ ఉండేది. అందుకే ఆయన మరణానంతరం దేహాన్ని ఆస్పత్రికి ఇవ్వనున్నారు. ఆయన ఏ ఆస్పత్రిలో చనిపోయారో అదే ఆస్పత్రిలోని మెడికల్ కాలేజీకి తన పార్థివ దేహాన్ని అప్పగించనున్నారు’’ అని బీవీ రాఘవులు వెల్లడించారు.

Also Read: స్టూడెంట్ లీడర్ నుంచి జనరల్ సెక్రటరీ వరకు, ఇది సీతారాం ఏచూరి రాజకీయ ప్రస్థానం

రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పై మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. సీతారాం ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమని అన్నారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని అభిప్రాయపడ్డారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో అడుగుపెట్టిన ఏచూరి దాదాపు నాలుగు దశాబ్ధాలుగా  జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి అన్నారు. రాజ్య సభ ఎంపీగా, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా ఆయన దేశంలో అందరికీ సుపరిచితుడయ్యారని.. ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget