అన్వేషించండి

Mahakumbh Mela Stampede 2025: మహా కుంభమేళాలో ఘోర విషాదం - 20 మంది మృతి?, 100 మందికి పైగా గాయాలు

Mahakumbh Mela 2025: ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో సెక్టార్ 2 వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాటలో 20 మంది మృతి చెందగా.. 100 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Several People Died In Mahakumbh Mela Stampede 2025: ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో (Maha Kumbhmela 2025) బుధవారం తెల్లవారుజామున ఘోర విషాదం చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్దకు పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలిరాగా.. విపరీతమైన రద్దీ నెలకొని సెక్టార్ 2 వద్ద బారికేడ్లు విరిగి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కనీసం 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. వెంటనే స్పందించిన అధికారులు, సిబ్బంది క్షతగాత్రులను అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. ఘటనా స్థలంలో ఎటు చూసిన హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుండగా.. మరణాల సంఖ్యపై యూపీ ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. తొక్కిసలాట నేపథ్యంలో అమృతస్నానం కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు 13 అఖాడాలు ప్రకటించారు.

అటు, ఘటనా స్థలానికి 70 అంబులెన్సులు చేరుకున్నాయి. దాదాపు 3 గంటల పాటు క్షతగాత్రుల తరలింపు ప్రక్రియ సాగింది. ప్రయాగ్‌రాజ్‌లో 8 నుంచి 10 కోట్ల మంది ఉన్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం వరకూ ఇది మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. భక్తులు భారీగా పోటెత్తడంతో అటుగా వెళ్లే జాతీయ రహదారిపై భారీ రద్దీ నెలకొంది. దాదాపు 20 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.

సీఎం యోగికి ప్రధాని మోదీ ఫోన్

అటు, ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేశారు. గంటల వ్యవధిలోనే మూడుసార్లు ఆయనతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని ఆరా తీశారు. మరోవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఘటనపై ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని.. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. 

భక్తులకు సీఎం సూచనలు

ప్రస్తుతం, ప్రయాగరాజ్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. 'త్రివేణి సంగమం ముక్కు భాగానికి చేరుకోవాలన్న ఉద్దేశంతో జనం పోటెత్తారు. దీంతో తీవ్ర ఒత్తిడి ఉంటోంది. మౌనీ అమావాస్యం సందర్భంగా జనం భారీగా వచ్చారు. అఖాడాలు వెళ్లే మార్గం వద్ద ఉన్న బారికేడ్లను నెట్టివేశారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. గాయపడ్డ వారిని వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. త్రివేణి సంగమం ప్రధాన కేంద్రం వద్దకు రాకుండా సమీపంలోని ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించండి. ఆదేశాలు, సూచనలు పాటిస్తూ అధికారులకు సహకరించండి. ఎలాంటి వదంతులను నమ్మొద్దు.' అని సీఎం స్పష్టం చేశారు.

Also Read: GSLV F15 Satellite: సెంచరీ కొట్టిన ఇస్రో - నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్‌వీ ఎఫ్ 15, చారిత్రాత్మక విజయం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kerala Assembly Elections 2026: కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
Dangerous bike smoke: బైక్ ఆన్ చేసి గదిలో ఉంచితే ప్రాణాలు మిగలవు - పుంగనూరు ఘటనలో జరిగింది ఇదే - ఎందుకంటే ?
బైక్ ఆన్ చేసి గదిలో ఉంచితే ప్రాణాలు మిగలవు - పుంగనూరు ఘటనలో జరిగింది ఇదే - ఎందుకంటే ?
Tamil Nadu Assembly Elections 2026: రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
Visa Interview Tips : వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలా? ముందుగానే ఇలా ప్రిపేర్ అవ్వండి, వీసా రిజెక్ట్ కాదు
వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలా? ముందుగానే ఇలా ప్రిపేర్ అవ్వండి, వీసా రిజెక్ట్ కాదు

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Budget Session:ప్రశ్నోత్తరాలు లేకుండా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. బీజేపీ వినూత్న విరసన
ప్రశ్నోత్తరాలు లేకుండా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. బీజేపీ వినూత్న విరసన
Kerala Assembly Elections 2026: కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
Pakistan Airstrike: కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
YSRCP local polls plan: లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
Akshay Kumar: నవ్వించడం కష్టమే కానీ... అవార్డులు ఇవ్వరుగా - అక్షయ్ కుమార్ కామెంట్స్‌
నవ్వించడం కష్టమే కానీ... అవార్డులు ఇవ్వరుగా - అక్షయ్ కుమార్ కామెంట్స్‌
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
Weight Loss Journey : మూడు సంవత్సరాల్లో 72 కిలోలు తగ్గిన మహిళ.. ఈ 7 సింపుల్ హ్యాబిట్స్ మిమ్మల్నీ కూడా మార్చేస్తాయి
మూడు సంవత్సరాల్లో 72 కిలోలు తగ్గిన మహిళ.. ఈ 7 సింపుల్ హ్యాబిట్స్ మిమ్మల్నీ కూడా మార్చేస్తాయి
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Embed widget