అన్వేషించండి

Vande Bharat Trains: రైళ్లు ఎక్కడ ఆగాలో కూడా మేం చెప్పాలా? పిటిషనర్‌కు షాకింగ్ రిప్లై ఇచ్చిన సుప్రీంకోర్టు

Supreme Court on Vande Bharat: రైళ్లు ఎక్కడెక్కడ ఆగాలో రైల్వే శాఖ నిర్ణయిస్తుందని, ఫలానా చోట ఆపాలని డిమాండ్ చేసే హక్కు ఎవరికి లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది.

Supreme Court on Vande Bharat: వందే భారత్ రైలు తిరూరు స్టాపింగ్‌లో ఆపాలని కేరళకు చెందిన న్యాయవాది పీటీ శిజిష్‌ వేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  రైళ్లకు ఎక్కడ స్టాపింగ్ ఇవ్వాలో తాము ఆదేశించలేమని వ్యాఖ్యానించింది. రైళ్లు ఎక్కడెక్కడ ఆగాలో రైల్వే శాఖ నిర్ణయిస్తుందని, ఫలానా చోట ఆపాలని డిమాండ్ చేసే హక్కు ఎవరికి లేదని వెల్లడించింది. ఈ విషయంపై తాము జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్ ను కొట్టివేసింది.

అసలు ఏం జరిగిందంటే?
కేరళలోని మలప్పురం జిల్లా తిరూర్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్‌ రైలు నిలిపేలా దక్షిణ రైల్వేకు ఆదేశాలివ్వాలని కోరుతూ రాష్ట్రానికి చెందిన న్యాయవాది పీటీ శిజిష్‌ ఆ హైకోర్టును ఆశ్రయించారు. తొలుత తిరూర్‌లో వందే భారత్‌ను ఆపాలని నిర్ణయించారని అయితే రాజకీయ కారణాలతో రైల్వే శాఖ ఆ నిర్ణయాన్ని మార్చుకుందని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు విచారణార్హం కాదంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో శిజిష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఆ హక్కు ఎవరికీ లేదు
సోమవారం సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం వద్దకు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. దీనిపై విచారణ చేపట్టేందుకు ధర్మాసనం విముఖత వ్యక్తం చేసింది. ఇలాంటి అభ్యర్థనతో అత్యున్నత న్యాయస్థానానికి రావడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇవన్నీ ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయాలని తేల్చి చెప్పింది. ‘వందేభారత్‌ రైలు ఏ స్టేషన్‌లో ఆగాలనేది నిర్ణయించాలని మీరు మమ్మల్ని కోరుతున్నారు. ఆ తర్వాత డిల్లీ-ముంబై రాజధాని ట్రైన్ స్టాప్‌ ఎక్కడుండాలో కూడా మమ్మల్ని షెడ్యూల్‌ చేయమంటారా? రైళ్లు ఎక్కడెక్కడ ఆగాలనేది రైల్వే శాఖ నిర్ణయిస్తుంది. రైలు ఫలానా స్టేషన్‌ దగ్గర ఆగాలని డిమాండ్‌ చేసే హక్కు ఎవరికీ లేదు’ అంటూ వ్యాఖ్యానించింది. 

ఎక్స్‌ప్రెస్ పదానికి అర్థమే ఉండదు
‘వందే భారత్‌ లాంటి హైస్పీడ్‌ రైళ్ల స్టాపింగులను డిమాండ్ల ప్రాతిపదికన నిర్ణయించడం సరికాదు. ప్రతి జిల్లాలో నుంచి ఓ వ్యక్తి తమకు నచ్చిన రైల్వే స్టేషన్‌లో స్టాప్‌ ఉండాలని డిమాండ్‌ చేయడం ప్రారంభిస్తే..  హైస్పీడ్‌ రైళ్ల ఏర్పాటుకు ప్రయోజనం లేకుండా పోతుంది. ఎక్స్‌ప్రెస్‌ రైలు అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. ఇలాంటివి మేం ప్రభుత్వానికి చెప్పలేం. ఇది విధానపరమైన అంశం. అధికారుల దగ్గరకు వెళ్లండి’’ అంటూ పిటిషన్‌ను సుప్రింకోర్టు కొట్టివేసింది. కనీసం తన పిటిషన్‌ను పరిశీలించేలా ప్రభుత్వానికి సూచించాలని పిటిషనర్‌ అభ్యర్థించగా.. ధర్మాసనం అందుకు తిరస్కరించింది. తాము ఇందులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

వందేభారత్ రైళ్లకు పెరుగుతున్న డిమాండ్
ఏప్రిల్ 25న తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్‌లో కేరళ తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. మెరుగైన, అత్యాధునిక వసతులు ఉండడంతో వందే భారత్ రైలుకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో తమకు సమీపంలోని పెద్ద స్టేషన్లలో స్టాపింగ్ కల్పించాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం తిరువనంతపురం నుంచి కానూరు మధ్య వందే భారత్ రైలు నడుస్తోంది. మొత్తం కేరళ రాష్ట్రంలో 501 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 11 జిల్లాల్లో ప్రయాణిస్తుండగా కేవలం 6 స్టాపింగులు మాత్రమే ఉన్నాయి. ఈ ట్రైన్‌కు 16 కోచ్‌లు ఉంటాయి. ఈ ట్రైన్‌పై మే నెలలో రాళ్లదాడి జరిగింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget