అన్వేషించండి

President Droupadi Murmu: 'త్వరలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్' - శత్రువులకు కశ్మీర్ లోయ ప్రజలు గట్టి జవాబిచ్చారన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

President Speech: దేశ ప్రజలు నిజాయతీ, సుస్థిరతకు పట్టం కట్టారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 18వ లోక్ సభతో పాటు రాజ్యసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.

President Droupadi Murmu Addresses Parliament: ప్రభుత్వం పదేళ్లలో సుస్థిర అభివృద్ధి సాధించిందని.. త్వరలో భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) అన్నారు. కొత్తగా కొలువుదీరిన 18వ లోక్‌సభతో పాటు రాజ్యసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ఆమె గురువారం ప్రసంగించారు. తొలుత రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ (Parliament) చేరుకున్న రాష్ట్రపతికి ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె సభలో మూడోసారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వ ప్రాధామ్యాలను వివరించారు. ఈ సందర్భంగా 18వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యులను అభినందించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించిన ఎన్నికల సంఘాన్ని అభినందించారు. 'ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికలు సజావుగా జరిగాయి. ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన ఈసీకి అభినందనలు. ఈ ఎన్నికల్లో ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారు. నిజాయతీని నమ్మి ప్రభుత్వానికి మరోసారి అవకాశం కల్పించారు. దేశ ప్రజల విశ్వాసం గెలిచిన మీరంతా సభకు వచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో విజయవంతమవుతారని ఆశిస్తున్నా. దేశ ప్రజలందరి ఆకాంక్షలను నెరవేర్చాలి.' అని రాష్ట్రపతి అన్నారు.

'శత్రువుల కుట్రకు గట్టి జవాబు'

జమ్మూకశ్మీర్‌పై శత్రువులు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్రపతి అన్నారు. కానీ, ఈసారి కశ్మీర్ లోయలో మార్పు కనిపించిందని.. అక్కడి ప్రజలు శత్రువుల కుట్రలకు గట్టి బదులిచ్చారని చెప్పారు. ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారని వెల్లడించారు. రిఫార్మ్, పర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ (సంస్కరణలు, పనితీరు, మార్పు) ఆధారంగా ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని.. త్వరలో భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అన్నారు. 'ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తోంది. చిన్న, సన్నకారు రైతుల కోసం పీఎం సమ్మాన్ నిధి కింద ఇప్పటివరకూ రూ.3.20 లక్షల కోట్లు ఇచ్చాం. రైతుల ఖాతాల్లోనే నేరుగా నగదు జమ చేస్తూ ఆర్థిక భరోసా అందిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఆర్గానికి ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిన క్రమంలో అందుకు అనుగుణంగా భారత్ ఉత్పత్తులు అందిస్తోంది.' అని పేర్కొన్నారు.

'ఆరోగ్య రంగంలో అగ్రగామి'

'భారతదేశం ఆరోగ్యం రంగంలో అగ్రగామిగా ఉంది. మహిళల ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. పెద్ద ఎత్తున మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం కల్పిస్తున్నాం. ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాం. ప్రపంచ వృద్ధిలో భారత్ 15 శాతం భాగస్వామ్యం అవుతోంది. అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.  గ్రీన్ ఎనర్జీ దిశగా ప్రభుత్వం పని చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ వేగంగా సాగుతోంది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. డిజిటల్ ఇండియా సాధనకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. దేశంలో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. రక్షణ రంగాన్ని మరింతగా బలోపేతం చేశాం. సైనికులకు ఒకే ర్యాంకు ఒకే పింఛన్ అమలు చేశాం. రక్షణ ఉత్పత్తులు భారీగా పెరిగాయి. సీఏఏ కింద శరణార్థులకు ప్రభుత్వం పౌరసత్వం కల్పించింది. జులై 1 నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి రానున్నాయి.' అని రాష్ట్రపతి వెల్లడించారు.

పరీక్షల్లో పారదర్శకతపై

ఇటీవల నీట్, నెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రభుత్వం చేపట్టే నియామకాలు, నిర్వహించే ప్రవేశ పరీక్షలు పారదర్శకంగా జరగాలని అన్నారు. పేపర్ లీక్స్, పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ఉన్నత స్థాయిలో విచారణ జరుగుతోందని చెప్పారు. 'ఇలాంటి ఘటనల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరముంది. నీట్, ఇతర పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. పేపర్ లీక్ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం.' అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పష్టం చేశారు.

Also Read: Lal Krishna Advani: ఎల్కే అద్వానీకి అనారోగ్యం-ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

West Bengal Elections: ప్రధాని మోదీ నుంచి హేమా మాలిని వరకు... 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన బీజేపీ
ప్రధాని మోదీ నుంచి హేమా మాలిని వరకు... 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన బీజేపీ
Kerala Assembly Elections: ఇంట్లో కుస్తీ - బయట దోస్తీ - కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల తీరుపై అమిత్ షా ఫైర్
ఇంట్లో కుస్తీ - బయట దోస్తీ - కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల తీరుపై అమిత్ షా ఫైర్
PM Modi: దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల తగ్గింపు ఉండదు: ప్రధాని మోదీ కీలక ప్రకటన
దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల తగ్గింపు ఉండదు: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Strait of Hormuz: హర్మూజ్ దాటిన భారత 7వ LPG ట్యాంకర్.. ఇరాన్ స్పెషల్ మెస్సేజ్ - అసూయతో రగిలిపోతున్న పాక్
హర్మూజ్ దాటిన భారత 7వ LPG ట్యాంకర్.. ఇరాన్ స్పెషల్ మెస్సేజ్ - అసూయతో రగిలిపోతున్న పాక్

వీడియోలు

Rajasthan Royals vs Gujarat Titans IPL 2026 | రాజ‌స్థాన్ రాయల్స్ థ్రిల్లింగ్ విక్ట‌రీ
IPL 2026 Jofra Archer Death Overs RR vs GT | 19వ ఓవర్ లో జోఫ్రా ఆర్చర్ మ్యాజిక్
Siraj Catch Drop GT vs RR IPL 2026 | సిరాజ్ ఈజీ క్యాచ్‌ను సిక్సర్‌గా మార్చేశాడా
IPL 2026 Delhi Capitals vs Mumbai Indians | ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం
Riyan Parag Credits Dhruv Jurel RR vs GT IPL 2026 | రియాన్ పరాగ్ ప్లాన్ వెనుక ఉన్నది అతనే

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB VS CSK Updates: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ.. 2 వ‌రుస విజ‌యాలతో జోరు.. స‌త్తా చాటిన భువీ, 43 ర‌న్స్ తో సీఎస్కే చిత్తు
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ.. 2 వ‌రుస విజ‌యాలతో జోరు.. స‌త్తా చాటిన భువీ, 43 ర‌న్స్ తో సీఎస్కే చిత్తు
AP Rains Alert: ఏపీలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.. మరోవైపు నిప్పులు చెరిగే ఎండలు!
ఏపీలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.. మరోవైపు నిప్పులు చెరిగే ఎండలు!
IPL 2026 SRH VS LSG Result Update: పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన ల‌క్నో.. బ్యాటింగ్ వైఫల్యంతో స‌న్ రైజ‌ర్స్ కు ప‌రాజ‌యం
పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన ల‌క్నో.. బ్యాటింగ్ వైఫల్యంతో స‌న్ రైజ‌ర్స్ కు ప‌రాజ‌యం
MAVIGUN : జగన్ MAVIGUN ట్రెండ్ - టైటిల్ రిజిస్టర్ చేయించిన ప్రొడ్యూసర్!... ఏ జానర్‌లో మూవీ తీస్తారో?
జగన్ MAVIGUN ట్రెండ్ - టైటిల్ రిజిస్టర్ చేయించిన ప్రొడ్యూసర్!... ఏ జానర్‌లో మూవీ తీస్తారో?
Khanapur Municipal Chairman: కాంగ్రెస్‌కు నిరాశే.. ఖానాపూర్ మున్సిపాలిటీ దక్కించుకున్న బీజేపీ, వైస్ చైర్మన్‌గా బీఆర్ఎస్
కాంగ్రెస్‌కు నిరాశే.. ఖానాపూర్ మున్సిపాలిటీ దక్కించుకున్న బీజేపీ, వైస్ చైర్మన్‌గా బీఆర్ఎస్
RTC Bus Catches Fire: హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సులో మంటలు.. కడప జిల్లాలో ప్రమాదం
హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సులో మంటలు.. కడప జిల్లాలో ప్రమాదం
Vignesh Shivan : హీరోగా సినిమా ఓకే చేసిన అనిరుధ్ - లాస్ట్ మూమెంట్‌లో యాక్టింగ్ ఎందుకు మానేశాడంటే?
హీరోగా సినిమా ఓకే చేసిన అనిరుధ్ - లాస్ట్ మూమెంట్‌లో యాక్టింగ్ ఎందుకు మానేశాడంటే?
ఎస్‌యూవీల‌కు గండి కొట్టిన‌ మారుతి డిజైర్.. మార్చి 2026 సేల్స్‌లో నంబర్ వన్ కారుగా రికార్డు!
ఎస్‌యూవీల‌కు గండి కొట్టిన‌ మారుతి డిజైర్.. మార్చి 2026 సేల్స్‌లో నంబర్ వన్ కారుగా రికార్డు!
Embed widget