PM Modi: విదేశాలపై ఆధారపడటమే అతిపెద్ద శత్రువు - H1B Visa ఫీజు పెంపు సమయంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
H1B Visa Fees Hike | భారత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లో 34,200 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించారు. సముద్ర, పునరుత్పాదక శక్తి, ఆరోగ్య, మౌలిక సదుపాయాలపై దృష్టి భారత్ లక్ష్యం.

PM Modi Unveils Projects in Gujarat | భావ్నగర్: అమెరికా ప్రభుత్వం హెచ్1బీ వీసాల ఫీజు లక్ష డాలర్లు చేసిన సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడటం మన ప్రధాన శత్రువన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు గుజరాత్లోని భావ్నగర్లో జరిగిన “సముద్ర సే సమృద్ధి” కార్యక్రమంలో రూ. 34,200 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు, కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు సముద్ర రంగం, పునరుత్పాదక శక్తి, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, పట్టణ అభివృద్ధికి సంబంధించినవి. ఇది గుజరాత్లో సమగ్ర వృద్ధికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
సముద్ర లక్ష్యాలు: కొత్త ప్రాజెక్టులలో రూ. 7,870 కోట్లు
భారతదేశ సముద్ర అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రూ. 7,870 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను గుజరాత్ లోని భావ్ నగర్లో ప్రారంభించారు. ముఖ్యమైన అభివృద్ధిలో ఇవి ఉన్నాయి:
- ఇందిరా డాక్లో ముంబై (Mumbai) అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్
- కోల్కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్లో కొత్త కంటైనర్ టెర్మినల్ దాని అనుబంధ సౌకర్యాలు
- పారాదీప్ పోర్ట్లో కంటైనర్ బెర్త్, కార్గో నిర్వహణ అప్గ్రేడ్లు
- తూనా టెక్రా మల్టీ-కార్గో టెర్మినల్, కమరాజర్ పోర్ట్, ఎన్నూర్లో మెరుగైన అగ్నిమాపక సౌకర్యాలు
- చెన్నై పోర్ట్, కార్ నికోబార్ ద్వీపంలో సముద్ర గోడలు, రెవెట్మెంట్లతో సహా తీరప్రాంత రక్షణ చర్యలు
- దీన్దయాళ్ పోర్ట్, కాండ్లా ఓడరేవులో బహుళ-ప్రయోజన కార్గో బెర్త్, గ్రీన్ బయో-మెథనాల్ ప్లాంట్
- పాట్నాతో పాటు వారణాసిలలో ఓడ మరమ్మత్తు సౌకర్యాలు కల్పించడం
ఈ ప్రాజెక్టులు భారత సముద్ర మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, వాణిజ్య సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తాయి. ప్రాంతీయ ఆర్థిక వృద్ధిని పెంచడం లక్ష్యంగా కేంద్రం వీటికి శ్రీకారం చుట్టింది.
రూ. 26,354 కోట్లతో గుజరాత్లో స్థిరమైన అభివృద్ధి
ప్రధాని మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్ లో సమగ్ర, స్థిరమైన అభివృద్ధికి సంబంధించి చర్యలు చేపట్టారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి రూ. 26,354 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను చేపట్టాయి. కొన్నింటికి శంకుస్థాపనలు చేయగా, కొన్ని ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేశారు. వాటిలో కొన్ని
- చారా పోర్ట్లో హెచ్పిఎల్ఎన్జి రీగ్యాసిఫికేషన్ టెర్మినల్
- గుజరాత్ ఐఓసిఎల్ రిఫైనరీలో యాక్రిలిక్స్ & ఆక్సో ఆల్కహాల్ ప్రాజెక్ట్
- రైతుల కోసం పిఎం-కుసుమ్ 475 మెగావాట్ల కాంపోనెంట్ సి సోలార్ ఫీడర్
- 600 మెగావాట్ల గ్రీన్ షూ ఇనిషియేటివ్
- 45 మెగావాట్ల బడేలి సోలార్ పివి ప్రాజెక్ట్, ధోర్డో గ్రామాన్ని పూర్తిగా సౌరశక్తిగా మార్చడం
ప్రధాన మంత్రి ఎల్ఎన్జి మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులు, తీరప్రాంత రక్షణ, రహదారులు, ఆరోగ్య సంరక్షణ, పట్టణ రవాణా విస్తరణలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ముఖ్యమైన కార్యక్రమాలలో భావ్నగర్లోని సర్ టి. జనరల్ హాస్పిటల్, జామ్నగర్లోని గురు గోవింద్ సింగ్ గవర్నమెంట్ హాస్పిటల్, 70 కిలోమీటర్ల జాతీయ రహదారులను నాలుగు లేన్లుగా మార్చడం వంటివి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సత్కరించారు. అలాగే “సముద్ర సే సమృద్ధి” కోసం నిర్వహించిన ఒక ఎగ్జిబిషన్ను సందర్శించడంతో పాటు భావ్నగర్లో రోడ్షో నిర్వహించారు.
ప్రధాని మోదీ దృష్టి ఆత్మనిర్భర్ భారత్
భావ్నగర్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ భారతదేశం ఆత్మనిర్భర్ అంశాన్ని ప్రస్తావించారు. “భారతదేశం ఆత్మనిర్భర్గా మారాలి. ప్రపంచ వేదికపై భారత్ మరింత బలంగా నిలబడాలి. దేశానికి సామర్థ్యం కొరత లేదు, అయినప్పటికీ స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తరువాత, గత ప్రభుత్వ విధానాలు భారతదేశం నిజమైన సామర్థ్యాన్ని అణచివేశాయి. చాలా కాలం పాటు, లైసెన్స్-కోటా వ్యవస్థ భారతదేశాన్ని ప్రపంచ మార్కెట్ల నుంచి వేరు చేసింది. దిగుమతులపై అధిక ఆధారపడటం దేశ వృద్ధికి ఆటంకం కలిగించింది. అవినీతి, అసమర్థ పాలన మన యువతకు అవకాశాలను మరింత బలహీనపరిచాయి.”
#WATCH | Gujarat | Addressing a public rally in Bhavnagar, PM Modi says, "...Bharat mein Samarthya ki koi kami nahi hain lekin Azadi ke baad, Congress ne Bharat ke har ek samarthya ko nazar-andaaz kiya..."
— ANI (@ANI) September 20, 2025
"India must become Atmanirbhar and stand strong before the world. India… pic.twitter.com/YHkpO2NFfK
విదేశాలపై ఆధారపడటమే అతిపెద్ద శత్రువు..
అమెరికా హెచ్1బీ వీసాల ఫీజుల పెంపు సమయంలో స్వయం సమృద్ధి భారతదేశానికి అతిపెద్ద అవసరమని ప్రధాని మోదీ హైలైట్ చేశారు. విదేశాలపై ఆధారపడటాన్ని దేశానికి అతిపెద్ద శత్రువుగా అభివర్ణించారు. “ప్రపంచంలో భారతదేశానికి పెద్ద శత్రువు లేదు. ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే మనకు అసలుసిసలైన సవాలు. 1.4 బిలియన్ల పౌరుల శ్రేయస్సు కోసం, భారత్ స్వయం సమృద్ధిని సాధించాలి. ఆత్మనిర్భర్త ద్వారా మాత్రమే మనం మన భవిష్యత్తును కాపాడుకుంటూ నిజమైన జాతీయ గౌరవాన్ని సాధించగలం.” స్వయం సమృద్ధిని కేవలం ఆర్థిక వ్యూహంగానే కాకుండా దేశ భవిష్యత్తు వృద్ధి, భద్రత, ప్రపంచంలో మూలస్తంభంగా మారేలా చూడాలని’ దేశ పౌరులకు ప్రధాని మోదీ సూచించారు.
#WATCH | Gujarat | Addressing a public rally in Bhavnagar, PM Modi says, "Duniya mein koi hamara bada dushman nahi hai. Agar hamara koi dushman hai toh woh hai dusre deshon par hamari nirbharta..."
— ANI (@ANI) September 20, 2025
"Today, India is moving forward with the spirit of 'Vishwabandhu'. We have no… pic.twitter.com/f6zNRbN9Rc






















