అన్వేషించండి

PM Modi On Corruption: గత పదేళ్లలో ఈడీ రూ.2,200 కోట్లు సీజ్, యూపీఏ హయాంలో రూ.34 లక్షలే!: ప్రధాని మోదీ

PM Narendra Modi Exclusive Interview on ABP News| గత పదేళ్లలో తమ హయాంలో అవినీతిపై ఉక్కుపాదం మోపగా.. ఈడీ 2014 నుంచి 2024 వరకు రూ.2,200 కోట్ల నగదు సీజ్ చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపాారు.

PM Modi Exclusive Interview on ABP News | న్యూఢిల్లీ: ఇప్పటివరకూ 6 దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. చివరిదైన 7వ ఫేజ్ పోలింగ్‌కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ABP నెట్‌వర్క్‌ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు విషయాలపై స్పందించారు. ఈ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించి కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పోల్ మేనేజ్‌మెంట్, ఎన్నికల వ్యూహాలు, ప్రతిపక్షాలతో పాటు పలు విషయాలపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏబీపీ ఆనందకు చెందిన సుమన్ డే, ఏబీపీ న్యూస్ ప్రతినిధులు రోహిత్ సవాల్, రోమన్ ఐసర్ ఖాన్‌లతో జరిగిన ఇంటర్వ్యూలో బెంగాల్‌లో రూ.3000 కోట్లు అవినీతి జరిగిందని, ఆ సొమ్మును రికవరీ చేస్తామన్న మాటకు కట్టుబుడి ఉన్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. యూపీఏ హయాంలో ఈడీ కేవలం రూ. 34 లక్షలు సీజ్ చేస్తే, ఎన్డీఏ పాలనలో రూ.2,200 కోట్ల అవినీతి సొమ్మును రికవర్ చేసినట్లు వెల్లడించారు.

తమ ప్రభుత్వ అవినీతిని అరికట్టేందుకు ఎన్నో చర్యలు తీసుకుందన్నారు. ఏ రాజకీయ పార్టీతోనే, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా అన్ని అవినీతి చేపలు గాలానికి చిక్కుతాయని చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) లాంటి దర్యాప్తు సంస్థల ప్రయత్నాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బడా నేతలను సైతం దర్యాప్తు సంస్థలు వదిలిపెట్టడం లేదని ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. 

అవినీతిపరుల భరతం పట్టామన్న ప్రధాని మోదీ 
తమ హయాంలో అవినీతి అనేది లేకుండా చేశామన్న మోదీ.. 2004 నుంచి 2014 వరకు ఈడీ కేవలం రూ.34 లక్షలు సీజ్ చేస్తే.. ఎన్డీఏ హయాంలో 2014 నుంచి 2024 వరకు రూ.2,200 కోట్లు సీజ్ చేసినట్లు తెలిపారు. నల్లధనంపై తాము ఉక్కుపాదం మోపడం ద్వారా కరెన్సీ నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటకు కనిపించాయన్న నిజాన్ని ఎవరూ కాదనలేరని వ్యాఖ్యానించారు. పారదర్శకత, జవాబుదారీతనం, న్యాయం పట్ల నిబద్ధత ఉంటే సుపరిపాలన సాధ్యమని అభిప్రాయపడ్డారు. పెద్ద పెద్ద నేతలు జైలుకు వెళ్లారని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని నిరూపించామన్నారు. 

రికవరీ చేసిన సొత్తు ప్రజలకు చెల్లిస్తాం.. 
కొందరు పెద్దలు అక్రమంగా దోచుకున్న సొమ్మును తిరిగి ప్రజలకు అందించాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమని మోదీ తెలిపారు. ప్రభుత్వాన్ని నడిపేందుకు తమ ఖజానాలో డబ్బులేదు, కానీ కొందరు దోచుకునేందుకు ప్రయత్నాలు ఆపడం లేదని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కొందరు పెద్దలు దోచుకున్న సొమ్మును రికవరీ చేసి, తిరిగి ప్రజలకు పంచడం సాధ్యమే. బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అవినీతిని ఎత్తిచూపారు. బిహార్‌లో ఉద్యోగాల కోసం ముందుగానే భూమి ఇస్తుండగా, బెంగాల్‌లో జాబ్స్ తెచ్చుకోవడానికి ఓ రేటు ఉందని ప్రధాని మోదీ ఆరోపించారు. దానివల్ల అర్హులైన వారు నిరుద్యోగులుగా రోడ్డున పడితే, అనర్హులు, టీచర్, ఇతర అధికారులుగా మారి దోచుకుంటున్నారని ఆరోపించారు.
Also Read: PM Modi Exclusive Interview: భారత్‌ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుతాం, NDA 3.0తో రోడ్ మ్యాప్ రెడీ: ప్రధాని మోదీ

ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులపై ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఓ ప్రభుత్వం రూ. 3,000 కోట్లను జప్తు చేయగా, రూ. 1.25 లక్షల కోట్ల విలువైన ఆస్తులను సైతం సీజ్ చేసింది. కేరళలో, ఎల్‌డిఎఫ్ సభ్యులు నడుపుతున్న సహకార బ్యాంకులో పెద్ద స్కామ్ జరిగింది. మధ్యతరగతి వాళ్లు కూడబెట్టిన డబ్బు కొందరి పరం కాకుండా ఉండాలని, నిందితుడి ఆస్తిని అటాచ్‌ చేయాలని ఆదేశించినట్లు గుర్తుచేసుకున్నారు. రికవరీ చేసిన సొమ్ములో రూ.1700 కోట్లు ప్రజలకు తిరిగి ఇచ్చేశాం, వారి డబ్బు వాళ్లకే చేరాలన్నారు. 

Also Read: మత ఆధారిత రిజర్వేషన్ అంటే రాజ్యాంగాన్ని అవమానించడమే, ఓబీసీ కోటాతో ఓటు బ్యాంక్ పాలిటిక్స్: ప్రధాని మోదీ

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget