అన్వేషించండి

PM Modi Exclusive Interview: మత ఆధారిత రిజర్వేషన్ అంటే రాజ్యాంగాన్ని అవమానించడమే, ఓబీసీ కోటాతో ఓటు బ్యాంక్ పాలిటిక్స్: ప్రధాని మోదీ

PM Modi About Religion Based Reservation | మత ఆధారిత రిజర్వేషన్లు కల్పించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించినట్లేనని, కొన్ని రాష్ట్రాల్లో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు.

PM Narendra Modi Exclusive: న్యూఢిల్లీ: మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు 2024 ముగుస్తాయన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ABP నెట్‌వర్క్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు. కేంద్రంలో తాము హ్యాట్రిక్ కొడతామని ధీమా వ్యక్తం చేశారు. రిజర్వేషన్‌ అంశంతో పాటు బెంగాల్‌లో అవినీతి, ఆ రాష్ట్రంపై రెమాల్ తుఫాను ప్రభావం సహా పలు అంశాలపై మోదీ మాట్లాడారు. మత ఆధారిత రిజర్వేషన్లు కొనసాగించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమే అని వ్యాఖ్యానించారు. తాము ముస్లింలను వ్యతిరేకించడం లేదని, అయితే రాజ్యాంద విరుద్ధమైన మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. 

పశ్చిమ బెంగాల్‌లో రిజర్వేషన్ల అంశంపై వివాదం కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో ఓబీసీ రిజర్వేషన్లపై, న్యాయవ్యస్థపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఇటీవల మోదీ తీవ్రంగా ఖండించారు. 2010 నుంచి మంజూరు అయిన OBC రిజర్వేషన్ల హోదాను కలకత్తా హైకోర్టు గత వారం కొట్టివేసింది. ఆ రిజర్వేషన్లు చట్టవిరుద్ధమని పేర్కొంటూ లక్షల మంది రిజర్వేషన్ సంబంధిత పత్రాలను రద్దు చేస్తూ తీర్పు చెప్పడం తెలిసిందే. కానీ హైకోర్టు తీర్పును మమతా బెనర్జీ వ్యతిరేకించారు. 

ఈ ఇంటర్వ్యూలో మమతా బెనర్జీ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు. ‘కోర్టు తీర్పును మమతా బెనర్జీ వ్యతిరేకించడం న్యాయవ్యవస్థను అవమానించడమే. మత ఆధారిత రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించమే. మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించకూడదని పార్లమెంట్ లో ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు చెందిన పేదలకు(EWS) రిజర్వేషన్‌ను కల్పించాం. అవి మత ఆధారిత రిజర్వేషన్లు కాదు. ఇప్పటికే దేశాన్ని మత ప్రాతిపదికన విభజించాం. ఇప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం రిజర్వేషన్లను అడ్డు పెట్టుకోకూడదు. బెంగాల్‌లో ఓట్ల కోసం 77 సామాజిక వర్గాలను ఓబీసీగా మార్చారు. కర్ణాటకలోనూ ఇలాగే చేశారని’ ప్రధాని మోదీ మత ప్రాతిపదికన రిజర్వేషన్లను వ్యతిరేకించారు. 

 

జిహాద్ కోసం ఓబీసీల హక్కులను టీఎంసీ కాలరాస్తోంది: ప్రధాని మోదీ 
ఇటీవల బరాసత్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా.. సీఎం మమతా పేరును ప్రస్తావించకుండా హైకోర్టు న్యాయమూర్తులను ప్రశ్నించడాన్ని ప్రధాని మోదీ తప్పుపట్టారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) ఓబీసీలకు చేసిన అన్యాయాన్ని కోర్టులు బట్టబయలు చేస్తే, అక్కడ అధికార పార్టీ ఇది జీర్నించుకోలేకపోతోందని సెటైర్లు వేశారు. జిహాదీలకు మద్దతుగా నిలిచిన టీఎంసీ ఓబీసీ యువత హక్కుల్ని కాలరాసిందని ఆరోపించారు. హైకోర్టు ఓబీసీ సర్టిఫికేట్లు రద్దు చేయడాన్ని టీఎంసీ నేతలు ప్రశ్నిస్తున్నారంటే.. వారికి న్యాయవ్యవస్థపై, రాజ్యాంగంపైగానీ ఏమాత్రం గౌరవం లేదన్నారు. 
న్యాయవస్థనే తప్పుపడుతూ, కోర్టుల తీర్పులను వ్యతిరేకించడాన్ని అంతా ఖండించాలన్నారు ప్రధాని మోదీ. పరిస్థితి ఇలాగే కొనసాగితే, టీఎంసీ నేతలు జడ్జీలపై తమ గూండాలతో దాడి చేయిస్తారా అని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లో న్యాయమూర్తులపై టీఎంసీ ఒత్తిడి పెంచుతోందని, వారి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారని మోదీ పేర్కొన్నారు.

Also Read: గత పదేళ్లలో ఈడీ రూ.2,200 కోట్లు సీజ్, యూపీఏ హయాంలో రూ.34 లక్షలే!: ప్రధాని మోదీ

Also Read: PM Modi Exclusive Interview: భారత్‌ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుతాం, NDA 3.0తో రోడ్ మ్యాప్ రెడీ: ప్రధాని మోదీ

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
యమహా R2 నుంచి ఎలక్ట్రిక్‌ ఏరోక్స్‌ వరకు - 2026లో లాంచ్‌ కానున్న యమహా బైక్స్‌, స్కూటర్లు ఇవే
2026లో య'మహా' ప్లాన్‌ - రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, కొత్త R2 స్పోర్ట్‌ బైక్‌ రెడీ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget