అన్వేషించండి

PM Modi Exclusive Interview: మత ఆధారిత రిజర్వేషన్ అంటే రాజ్యాంగాన్ని అవమానించడమే, ఓబీసీ కోటాతో ఓటు బ్యాంక్ పాలిటిక్స్: ప్రధాని మోదీ

PM Modi About Religion Based Reservation | మత ఆధారిత రిజర్వేషన్లు కల్పించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించినట్లేనని, కొన్ని రాష్ట్రాల్లో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు.

PM Narendra Modi Exclusive: న్యూఢిల్లీ: మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు 2024 ముగుస్తాయన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ABP నెట్‌వర్క్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు. కేంద్రంలో తాము హ్యాట్రిక్ కొడతామని ధీమా వ్యక్తం చేశారు. రిజర్వేషన్‌ అంశంతో పాటు బెంగాల్‌లో అవినీతి, ఆ రాష్ట్రంపై రెమాల్ తుఫాను ప్రభావం సహా పలు అంశాలపై మోదీ మాట్లాడారు. మత ఆధారిత రిజర్వేషన్లు కొనసాగించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమే అని వ్యాఖ్యానించారు. తాము ముస్లింలను వ్యతిరేకించడం లేదని, అయితే రాజ్యాంద విరుద్ధమైన మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. 

పశ్చిమ బెంగాల్‌లో రిజర్వేషన్ల అంశంపై వివాదం కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో ఓబీసీ రిజర్వేషన్లపై, న్యాయవ్యస్థపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఇటీవల మోదీ తీవ్రంగా ఖండించారు. 2010 నుంచి మంజూరు అయిన OBC రిజర్వేషన్ల హోదాను కలకత్తా హైకోర్టు గత వారం కొట్టివేసింది. ఆ రిజర్వేషన్లు చట్టవిరుద్ధమని పేర్కొంటూ లక్షల మంది రిజర్వేషన్ సంబంధిత పత్రాలను రద్దు చేస్తూ తీర్పు చెప్పడం తెలిసిందే. కానీ హైకోర్టు తీర్పును మమతా బెనర్జీ వ్యతిరేకించారు. 

ఈ ఇంటర్వ్యూలో మమతా బెనర్జీ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు. ‘కోర్టు తీర్పును మమతా బెనర్జీ వ్యతిరేకించడం న్యాయవ్యవస్థను అవమానించడమే. మత ఆధారిత రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించమే. మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించకూడదని పార్లమెంట్ లో ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు చెందిన పేదలకు(EWS) రిజర్వేషన్‌ను కల్పించాం. అవి మత ఆధారిత రిజర్వేషన్లు కాదు. ఇప్పటికే దేశాన్ని మత ప్రాతిపదికన విభజించాం. ఇప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం రిజర్వేషన్లను అడ్డు పెట్టుకోకూడదు. బెంగాల్‌లో ఓట్ల కోసం 77 సామాజిక వర్గాలను ఓబీసీగా మార్చారు. కర్ణాటకలోనూ ఇలాగే చేశారని’ ప్రధాని మోదీ మత ప్రాతిపదికన రిజర్వేషన్లను వ్యతిరేకించారు. 

 

జిహాద్ కోసం ఓబీసీల హక్కులను టీఎంసీ కాలరాస్తోంది: ప్రధాని మోదీ 
ఇటీవల బరాసత్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా.. సీఎం మమతా పేరును ప్రస్తావించకుండా హైకోర్టు న్యాయమూర్తులను ప్రశ్నించడాన్ని ప్రధాని మోదీ తప్పుపట్టారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) ఓబీసీలకు చేసిన అన్యాయాన్ని కోర్టులు బట్టబయలు చేస్తే, అక్కడ అధికార పార్టీ ఇది జీర్నించుకోలేకపోతోందని సెటైర్లు వేశారు. జిహాదీలకు మద్దతుగా నిలిచిన టీఎంసీ ఓబీసీ యువత హక్కుల్ని కాలరాసిందని ఆరోపించారు. హైకోర్టు ఓబీసీ సర్టిఫికేట్లు రద్దు చేయడాన్ని టీఎంసీ నేతలు ప్రశ్నిస్తున్నారంటే.. వారికి న్యాయవ్యవస్థపై, రాజ్యాంగంపైగానీ ఏమాత్రం గౌరవం లేదన్నారు. 
న్యాయవస్థనే తప్పుపడుతూ, కోర్టుల తీర్పులను వ్యతిరేకించడాన్ని అంతా ఖండించాలన్నారు ప్రధాని మోదీ. పరిస్థితి ఇలాగే కొనసాగితే, టీఎంసీ నేతలు జడ్జీలపై తమ గూండాలతో దాడి చేయిస్తారా అని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లో న్యాయమూర్తులపై టీఎంసీ ఒత్తిడి పెంచుతోందని, వారి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారని మోదీ పేర్కొన్నారు.

Also Read: గత పదేళ్లలో ఈడీ రూ.2,200 కోట్లు సీజ్, యూపీఏ హయాంలో రూ.34 లక్షలే!: ప్రధాని మోదీ

Also Read: PM Modi Exclusive Interview: భారత్‌ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుతాం, NDA 3.0తో రోడ్ మ్యాప్ రెడీ: ప్రధాని మోదీ

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget