అన్వేషించండి

PM Modi Exclusive Interview: భారత్‌ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుతాం, NDA 3.0తో రోడ్ మ్యాప్ రెడీ: ప్రధాని మోదీ

PM Modi Exclusive Interview on ABP: భారత్‌ను ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాం, ఇక 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుతామని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు.

PM Modi Lok Sabha Election Results 2024 | న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు 2024 చివరిదైన 7 దశ పోలింగ్ కు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ABP Networkకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు షేర్ చేసుకున్నారు. భారత్‌ను ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుతామని ధీమా వ్యక్తం చేశారు. ఆ దిశగా తాము అడుగులు వేస్తున్నామని, అందుకు తమ వద్ద రోడ్ మ్యాప్ ఉందన్నారు. 

మా హయాంలోనే 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం: ప్రధాని మోదీ 
ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ లక్ష్యాల గురించి మాట్లాడుతూ, ‘11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను ముందు 5వ స్థానానికి తీసుకొచ్చాం. భవిష్యత్తులో భారత ఆర్థిక వ్యవస్థను 3వ స్థానానికి చేర్చుతాం. తాము కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో ఇది జరుగుతుంది. మా హయాంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడంతో పాటు పేదలకు నిత్యావసర సరుకులు అందేలా పలు చర్యలు తీసుకున్నామని’ వివరించారు. ప్రజల ఆకాంక్ష నెరవేర్చడంలో ఆర్థిక వృద్ధికి ప్రాముఖ్యత ఉందన్నారు. దేశం ఆర్థికంగా వృద్ధి చెందితేనే ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. 

సవాళ్లను అధిగమించి, ఫలితాలు సాధిస్తాం 
భవిష్యత్తులో భారత్‌ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉందని ప్రధాని మోదీ చెప్పారు. రెండంకెల స్థానం నుంచి 5వ ఆర్థిక వ్యవస్థగా అవతరించాం కానీ, 3వ స్థానానికి చేరుకోవడం అంత తేలిక కాదన్నారు. అయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనలో గత దశాబ్దకాలం నుంచి కేంద్రం చేపట్టిన కార్యక్రమాలతో నమ్మకం పెరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాక ఎన్డీఏ 3.0లో మరిన్ని విజయాలకు శ్రీకారం చుడతామని పేర్కొన్నారు.

వ్యవస్థలపై మరింత నమ్మకం పెరగడంతో ఏదైనా సాధించవచ్చు అని భావిస్తున్నాం. ఆర్థిక వ్యవస్థల్లో మరో అడుగు ముందుకు వేసేందుకు తమ ప్రభుత్వం మొత్తం పనిచేస్తోందన్నారు. అందుకుగానూ ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన టాస్క్‌లు ఇచ్చాం. కొత్త ప్రభుత్వం ఏర్పడినట్లుగా భావించి నిరంతరాయంగా శ్రమిస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. అంకితభావం, నిబద్ధత ఉంటే కఠినమైన సవాళ్లను ఎదుర్కొని ఆశించిన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: మత ఆధారిత రిజర్వేషన్ అంటే రాజ్యాంగాన్ని అవమానించడమే, ఓబీసీ కోటాతో ఓటు బ్యాంక్ పాలిటిక్స్: ప్రధాని మోదీ

Also Read: గత పదేళ్లలో ఈడీ రూ.2,200 కోట్లు సీజ్, యూపీఏ హయాంలో రూ.34 లక్షలే!: ప్రధాని మోదీ

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget