అన్వేషించండి

Kovvuru Railway Station : కొవ్వూరు ప్రజలకు శుభవార్త; మంగళవారం నుంచి ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్!

Kovvuru Railway Station :కొవ్వూరు ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. మంగళవారం నుంచి ఆ రెండు ఎక్స్ ప్రెస్‌లు ఆగనున్నాయి.

Kovvuru Railway Station :కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో మరో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ ఇచ్చింది రైల్వే శాఖ. గోదావరి జిల్లాల మీదుగా ప్రయాణించే ముఖ్యమైన రైళ్లు తిరుమల ఎక్స్ ప్రెస్, మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లకు 23.12.2025 అంటే మంగళవారం నుండి కొవ్వూరులో హాల్ట్ ఇచ్చారు.

తిరుమల ఎక్స్ ప్రెస్ -18521/18522

ట్రైన్ నెంబర్ 18521 తిరుమల ఎక్స్ ప్రెస్ గోదావరి జిల్లాల నుంచి  తిరుమల పుణ్యక్షేత్రం వెళ్లాలనుకునే వారికి చాలా అందుబాటులో ఉండే రైలు. విశాఖపట్నం నుంచి తిరుపతి వరకూ ప్రయాణించే ఈ రైలును ప్రస్తుతం కడప వరకూ పొడిగించారు. కోవిడ్‌కు ముందు ఈ ట్రైన్ కొవ్వూరులో ఆగేది. ఆ తర్వాత హాల్ట్ తీసేయడంతో ప్రయాణికులు ఇబ్బంది పడసాగారు. ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా మంగళవారం నుంచి ఈ రైలుకు కొవ్వూరులో హాల్ట్ కల్పించారు. ప్రతీ రోజు విశాఖ-కడప వెళ్లే 18521 తిరుమల ఎక్స్ ప్రెస్ సాయంత్రం 05:23 కి కొవ్వూరులో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో కడప నుంచి విశాఖ వెళ్లే 18522 తిరుమల ఎక్స్ ప్రెస్ తెల్లవారుఝాము 05:04 కి కొవ్వూరు చేరుకుంటుంది.

మచిలీపట్నం -వైజాగ్ ఎక్స్ ప్రెస్ -17219/17220

కొవ్వూరు ప్రజలు డిమాండ్ చేస్తున్న మరో ముఖ్యమైన రైలు మచిలీట్నం-వైజాగ్ మధ్య నడిచే ఎక్స్ ప్రెస్. దానికి కూడా కొవ్వూరులో మంగళవారం నుంచి హాల్టింగ్ సౌకర్యం కల్పించారు అధికారులు. మచిలీ పట్నం నుంచి వైజాగ్ వెళ్లే 17219 ఎక్స్ ప్రెస్ అర్ధరాత్రి 1:13కి చేరుకోగా వైజాగ్ నుంచి మచిలీపట్నం వెళ్లే 17220 ఎక్స్ ప్రెస్ మధ్య రాత్రి 01:23 కి కొవ్వూరులో ఆగుతుంది.

కోవిడ్‌కు ముందు 36 రైళ్లు ఆగే కొవ్వూరు రైల్వే స్టేషన్ 

కోవిడ్ కు ముందు కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో 36 రైళ్లు ఆగేవి. కోవిడ్ సమయంలో వాటిని రద్దు చేసి కేవలం కొన్ని  ప్యాసింజర్ మెము రైళ్ళకే ఇక్కడ హాల్టింగ్ ఇచ్చారు. అయితే గోదావరి పుష్కరాలు దగ్గరకు వస్తున్న దృష్ట్యా కొవ్వూరు స్టేషన్ లో ఎక్కువ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని రాజమండ్రి ఎంపీ పురంధ్రీశ్వరి కోరడం తో దక్షిణ మధ్య రైల్వే GM శ్రీ వాత్సవ ఈ రెండు రైళ్లకు కొవ్వూరులో ఆగే సౌకర్యం కల్పించారు. దీనితో సంతోషించిన కొవ్వూరు ప్రజలు భవిష్యత్ లో మరిన్ని రైళ్లకు కూడాతమ ఊళ్ళో హాల్టింగ్ కల్పిస్తారని ఆశిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

NH 365 BB Development: తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
Breaking News: ఐపీఎస్ PSR ఆంజనేయులు సస్పెన్షన్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఐపీఎస్ PSR ఆంజనేయులు సస్పెన్షన్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
AE Nookaraju Grandson: సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
Polavaram Left Canal: గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NH 365 BB Development: తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
AE Nookaraju Grandson: సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
Polavaram Left Canal: గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
Junior Doctors Strike: సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్
సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్
Pant Injury Update: పంత్ గాయంపై అప్డేట్.. మూడో రోజు ఆట‌లో బ‌రిలోకి దిగ‌ని రిష‌భ్.. డబ్ల్యూటీసీ రేసుపై ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు
పంత్ గాయంపై అప్డేట్.. మూడో రోజు ఆట‌లో బ‌రిలోకి దిగ‌ని రిష‌భ్.. డబ్ల్యూటీసీ రేసుపై ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు
YS Jagan:
"స్థానిక సంస్థలన్నీ మనవే! ఏకగ్రీవాలు కానివ్వొద్దు, ఎలక్షన్స్‌ను లైట్ తీసుకొవద్దు" వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
Rules for Foreign Travel Clearances: విదేశాలకు వెళ్లాలంటే ఏ రాజకీయ నేతలు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి
విదేశాలకు వెళ్లాలంటే ఏ రాజకీయ నేతలు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి
Embed widget