అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఈ ధరల పెరుగుదల ఉంది.
Petrol Price Hike May 2026: పది రోజుల్లో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! మీ ప్రాంతంలో రేట్లు ఎంత?
Petrol Price Hike May 2026: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్ళీ పెరిగాయి. 10 రోజుల్లో ఇలా పెరగడం ఇది మూడోసారి. అంతర్జాతీయ ఉద్రిక్తతల వేళ సామాన్యుడిపై ప్రభావం పడుతోంది.

- దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మే 23న పెరిగాయి.
- ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగాయి.
- గత పది రోజుల్లో ఇంధన ధరలు సుమారు రూ.5 పెరిగాయి.
- అంతర్జాతీయ ముడి చమురు ధరలు, ఉద్రిక్తతలు ధరల పెరుగుదలకు కారణం.
Petrol Price Hike May 2026: దేశంలో చమురు ధరల పెంపు కొనసాగుతోంది. మే నెలలో సామాన్యుడిపై మరోసారి భారం పడింది. శనివారం (మే 23, 2026) దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. గత పది రోజుల్లోనే ధరలు పెరగడం ఇది మూడోసారి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు పుల్స్టాప్ పడలేదని ఇలా పెట్రోల్ ధరలు పెంచుతున్నారు.
నేటి తాజా ధరలు ఇవే
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 87 పైసలు, డీజిల్ ధర 91 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 98.64 నుంచి రూ. 99.51కి, డీజిల్ ధర రూ.91.58 నుంచి రూ. 92.49కి చేరింది.
ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు (లీటరుకు):
హైదరాబాద్: పెట్రోల్ రూ. 111.88 (+0.87), డీజిల్ రూ. 99.95 (+0.91).
ముంబై: పెట్రోల్ రూ. 108.49 (+0.87), డీజిల్ రూ. 95.02 (+0.91).
కోల్కతా: పెట్రోల్ రూ. 110.64 (+0.87), డీజిల్ రూ. 97.02 (+0.91).
చెన్నై: పెట్రోల్ రూ. 105.31 (+0.87), డీజిల్ రూ. 96.98 (+0.91).
గురుగ్రామ్: పెట్రోల్ రూ. 100.38 (+0.87), డీజిల్ రూ. 92.92 (+0.91).
నోయిడా: పెట్రోల్ రూ. 98.78 (+0.87), డీజిల్ రూ. 93.12 (+0.91).
గత 10 రోజుల్లో ఏం జరిగింది?
ఈ నెలలో పెట్రోల్ ధరల బాదుడు మే 16న ప్రారంభమైంది. ఆ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా లీటరుకు రూ. 3 వరకు పెంచారు. ఆ తర్వాత మే 19న మెట్రో నగరాల్లో మరో 90 పైసలు పెరిగాయి. తాజా పెరుగుదలతో కలిపి చూస్తే, గత పది రోజుల్లోనే ఇంధన ధరలు దాదాపు రూ.5 మేర పెరిగాయి. కేవలం పెట్రోల్, డీజిల్ ధరలే కాకుండా ఇటీవలి రోజుల్లో సిఎన్జి (CNG), పిఎన్జి (PNG) ధరలు కూడా పలు నగరాల్లో పెరిగాయి.
ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ఇలా ధరలు పెంచుతున్నారు. ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు నిలకడగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. వెస్ట్ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారత్ తన ముడి చమురు అవసరాల కోసం దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ఏ చిన్న మార్పు వచ్చినా, అది మన దేశీయ ధరలపై ప్రభావం చూపుతుంది
సామాన్యుడిపై ప్రభావం
వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు అన్ని రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులు పెరుగుతాయి. దీంతో నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. రవాణా భారం పెరిగితే అది చివరకు సామాన్య వినియోగదారుడిపైనే పడుతుంది, దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. మే నెలలో మూడోసారి జరిగిన ఈ ధరల పెంపు మధ్యతరగతి జీవి బడ్జెట్ను అస్తవ్యస్తం చేస్తోంది.
Frequently Asked Questions
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
మే నెలలో ఇంధన ధరలు ఎంత మేర పెరిగాయి?
మే నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే రెండుసార్లు పెరిగాయి. తాజా పెరుగుదలతో కలిపి గత పది రోజుల్లోనే ఇంధన ధరలు దాదాపు రూ.5 మేర పెరిగాయి.
ప్రధాన నగరాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత?
ఢిల్లీలో పెట్రోల్ రూ.99.51, డీజిల్ రూ.92.49గా ఉంది. హైదరాబాద్లో పెట్రోల్ రూ.111.88, డీజిల్ రూ.99.95గా ఉంది.
పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడిపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?
రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది.
ట్రెండింగ్ వార్తలు





















