అన్వేషించండి

Pakistani Army Violates Ceasefire: పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలు, వరుసగా తొమ్మిదో రోజు LOC వద్ద కాల్పులు, తిప్పికొడుతున్న భారత సైన్యం

పాకిస్తాన్‌ దాడులతో ఎల్‌ఓసీలో వరుసగా తొమ్మిది రోజులు ఉద్రిక్తత. పహల్గాంలోని దాడి తర్వాత ఉద్రిక్తత పెరిగింది.

Kashmir Terror Attack: శ్రీనగర్: పాకిస్తాన్ ఆర్మీ మరోసారి సరిహద్దు వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంట పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపింది. వెంటనే స్పందించిన భారత సైన్యం ఎదురుకాల్పులు జరిపి తిప్పి కొడుతోందని అధికారులు శనివారం తెలిపారు.  

ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తరువాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అయినా పాకిస్తాన్ ఓవైపు భయం నటిస్తూనే మరోవైపు సరిహద్దు, నియంత్రణ రేఖ వద్ద కాల్పులు జరుపుతూ భారత్‌ను కవ్విస్తోంది. ఈ క్రమంలో పహల్గాం దాడి తరువాత పాకిస్తాన్ సైన్యం ఎల్‌వోసీ వద్ద వరుసగా తొమ్మిదవ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

"2025 మే 2 రాత్రి పాకిస్తాన్ సైన్యం జమ్మూ కాశ్మీర్ యూనియన్ భూభాగంలోని కుప్వారా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంబడి ఆకస్మికంగా కాల్పులు జరిపిందని" భారత సైన్యం శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. భారత సైన్యం పాక్ కాల్పులను తిప్పికొడుతోంది. పాక్ కాల్పులకు స్పందించి ఎదురు కాల్పులు జరుపుతోందని పేర్కొంది.

ఎల్‌వోసీ, అంతర్జాతీయ సరిహద్దు వద్ద నివసిస్తున్న ప్రజలు ఏదైనా దాడి జరిగినప్పుడు నివసించడానికి వీలుగా వ్యక్తిగత బంకర్లను ఏర్పాటు చేసుకుంటున్నారని సమాచారం.  ప్రారంభించారు.

మే 1-2 రాత్రి ఎల్‌వోసీ వెంట కాల్పులు

మే 1-2 రాత్రి సైతం పాకిస్తాన్ సైన్యం కుప్వారా, బారముల్లా, పూంచ్, నౌషేరా, అఖ్నూర్ ప్రాంతాలలో ఎల్‌వోసీ వెంట ఉన్న పోస్టుల నుండి ఆకస్మికంగా కాల్పులు జరిపింది. వెంటనే స్పందించిన భారత్ దీటుగా బదులిచ్చింది. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా జిల్లాలలో ఎల్‌వోసీ వెంట వివిధ పోస్టుల వద్ద పాకిస్తాన్ మొదట ఆకస్మికంగా కాల్పులు ప్రారంభించింది. ఆ తర్వాత కాల్పుల విమరణ ఉల్లంఘనలను పూంచ్ ఏరియాలో కొనసాగించింది. తరువాత జమ్ము ప్రాంతంలోని అఖ్నూర్ సెక్టార్‌లోనూ పాక్ ఆర్మీ నిబంధనలు ఉల్లంఘించి కాల్పులకు తెగబడుతోంది. 

అనంతరం పాకిస్తాన్ బలగాలు రాజౌరి జిల్లాలోని సుందర్బానీ, నౌషేరా సెక్టార్‌లో ఎల్‌వోసీ వెంట అనేక పోస్టుల వద్ద చిన్న తుపాకులతో కాల్పులు ప్రారంభించాయి. ఆ తరువాత జమ్ము జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న పార్గవాల్ సెక్టార్‌లో కాల్పులు జరిపి కవ్వింపు చర్యలకు దిగుతోంది. 

పహల్గాంలో ఉగ్రదాడి తరువాత భారతదేశం 1960లో చేసుకున్న సింధూ జల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అట్టారీ, వాఘా సరిహద్దును మూసివేయడం, పాక్ హై కమిషన్ లో దౌత్యవేత్తలను తగ్గించడం, పాక్ పౌరులకు అన్ని రకాల వీసాలను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న కొన్ని గంటలకే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 24 రాత్రి నుంచి కశ్మీర్ లోయ నుంచి.. జమ్ము & కశ్మీర్‌లోని ఎల్‌వోసీ, ఐబీ వెంట పాకిస్తాన్ బలగాలు ప్రతిరోజూ ఆకస్మికంగా కాల్పులు జరుపుతున్నాయని భారత ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు తమ మీద భారత్ సైన్యం విరుచుకు పడుతుందన్న భయంతో పాక్ సైన్యాన్ని అప్రమత్తం చేసింది. 29 జిల్లాల్లో ఎయిర్ సైరన్లు సైతం ఏర్పాటు చేసింది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?
Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?
Orissa Fire Accident: ఒడిశాలోని మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది పేషెంట్లు మృతి, కొందరి పరిస్థితి విషమం
ఒడిశాలోని మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది పేషెంట్లు మృతి, కొందరి పరిస్థితి విషమం
Harish Rana Final Video: భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
FASTag Annual Pass Fees: వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Loose Motions : వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
Embed widget