అన్వేషించండి

Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం కేసులో కీలక పరిణామం, ఛార్జిషీటు దాఖలు చేసిన NIA

ముంబయిలో పేలుళ్లు సహా ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాల కోసం దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ కంపెనీ, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిందనే ఆరోపణల కేసులో ఈ ఛార్జిషీటును NIA దాఖలు చేసింది.

గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీంతో పాటు అతని అత్యంత సన్నిహితులైన చోటా షకీల్ సహా ముగ్గురిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఛార్జిషీటును ఫైల్ చేసింది. ముంబయిలో పేలుళ్లు సహా ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాల కోసం దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ కంపెనీ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిందనే ఆరోపణల కేసులో ఈ ఛార్జిషీటును ముంబయి కోర్టులో దాఖలు చేసినట్లుగా ఎన్ఐఏ శనివారం (నవంబరు 5) ఓ ప్రకటనలో వెల్లడించింది. 

ఐక్యరాజ్యసమితి ప్రకటించిన గ్లోబల్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం, షకీల్‌తో పాటు (ఇద్దరూ పాకిస్థాన్‌లో దాక్కున్నారు) ఇటీవల ఎన్‌ఐఏ అరెస్టు చేసిన మరో ముగ్గురు వారి అనుచరులు ఆరిఫ్ అబూబకర్ షేక్ అలియాస్ ఆరిఫ్ భాయిజాన్, షబ్బీర్ అబూబకర్ షేక్, మహ్మద్ సలీం ఖురేషీ అలియాస్ సలీం ఫ్రూట్ అని ఛార్జిషీటులో పేర్కొన్నారు.

“డి-కంపెనీ, ఉగ్రవాద ముఠా, క్రైమ్ సిండికేట్‌లో పని చేసిన నిందితులు వివిధ రకాల చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా ఆ గ్రూపు యొక్క నేర కార్యకలాపాలను మరింత పెంచడానికి కుట్ర పన్నారని విచారణలో ధ్రువీకరించారు. ఆ కుట్రలో భాగంగా దావూద్ ఇబ్రహీం ప్రయోజనం కోసం బెదిరించి, కొంత మంది బాధితులకు ప్రాణభయం చూపించి లేదా బాధపెట్టి భారీ మొత్తంలో డబ్బు సేకరించారు. ఇంకా దోపిడీలు కూడా చేశారు. వీరు భారతదేశ భద్రతకు ముప్పు కలిగించే ఉద్దేశంతో పాటు సాధారణ ప్రజలల్లో భయోత్పాతాన్ని సృష్టించే ఉద్దేశంతో వారు అనేక నేరాలకు పాల్పడ్డారు.”అని NIA ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

డీ కంపెనీపై ఎఫ్ఐఆర్

ఈ ఏడాది ముంబయిలో డీ కంపెనీపై ఎన్‌ఐఎ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత దావూద్ అనుచరులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు చేయగా, అతడి ముఠాకు సంబంధించిన పలు కీలక ఆధారాలు లభ్యం అయ్యాయి. ఈ ఛార్జిషీట్‌ను తాజాగా ముంబయి కోర్టులో దాఖలు చేశారు.

దేశంలో యాక్టివ్‌గానే దావూద్ నెట్‌వర్క్!

దావూద్ ఇబ్రహీంకు పాకిస్థాన్ సహా పలు దేశాల్లో రహస్య స్థావరాలు ఉన్నాయి. భారత్‌లో అనేక ఉగ్రవాద ఘటనలకు పాల్పడ్డాడు. అతనిపై అనేక కేసులు నమోదయ్యాయి. కానీ అతను పరారీలో ఉంటూ పాకిస్థాన్ లో తలదాచుకున్నాడు. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ దేశంలో చురుగ్గా ఉన్నట్లు ఆధారాలు లభించాయని, దీనికి సంబంధించిన కుట్రలను నిఘా సంస్థలు నిరంతరం భగ్నం చేస్తూనే ఉన్నాయి.

దావూద్‌పై భారీ పారితోషికం

భారతదేశంలో 1993 ముంబయి వరుస పేలుళ్లతో సహా అనేక ఉగ్రవాద కార్యకలాపాలు, పేలుళ్లతో దేశాన్నే గడగడలాడించిన దావూద్ ఇబ్రహీంపై 2003లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఓ భారీ పారితోషికాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా దావుద్ ఇబ్రహీం తలపై $ 25 మిలియన్ల బహుమతి ఉంది. అతను లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్, జైష్ చీఫ్ మౌలానా మసూద్ అజర్, హిజ్బుల్ ముజాహిదీన్ బాస్ సయ్యద్ సలావుద్దీన్, జైష్ నంబర్ 2 అబ్దుల్ రవూఫ్ అస్గర్‌లతో పాటు భారతదేశం యొక్క మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లేదా టెర్రరిస్టులలో ఒకడిగా ఉన్నాడు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Modi Kurnool Tour: కర్నూలు చేరుకున్న ప్రధానమంత్రి మోదీ- స్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం, డీసీఎం
కర్నూలు చేరుకున్న ప్రధానమంత్రి మోదీ- స్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం, డీసీఎం
Konda Surekha vs Revanth Reddy: గన్ ఇచ్చింది రేవంత్ రెడ్డే! పోలీసులు ఏం చేయలేరు! వివాదాన్ని మరింత రాజేసిన మంత్రి కుమార్తె సుస్మిత 
గన్ ఇచ్చింది రేవంత్ రెడ్డే! పోలీసులు ఏం చేయలేరు! వివాదాన్ని మరింత రాజేసిన మంత్రి కుమార్తె సుస్మిత 
Konda Surekha OSD : 'క్లారిటీ తీసుకునేందుకు వెళ్లాం' కొండా సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌ ఎపిసోడ్‌పై పోలీసులు కీలక ప్రకటన 
'క్లారిటీ తీసుకునేందుకు వెళ్లాం' కొండా సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌ ఎపిసోడ్‌పై పోలీసులు కీలక ప్రకటన 
Konda Murali Reaction :
"రేవంత్‌తో విభేేదాలు లేవు, సుస్మిత ఏ పార్టీలోనూ లేరు" అర్ధరాత్రి హైడ్రామాపై స్పందించిన కొండా మురళి
Advertisement

వీడియోలు

WWC 2025 | టీమ్ ఇండియా సెమీస్ చేరాలంటే గెలవాల్సింది ఎన్ని మ్యాచులు?
BCCI Rohit Sharma Virat Kohli | రోహిత్ శర్మ, విరాట్ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్
Rohit Sharma and Virat Kohli | ఆస్ట్రేలియా సిరీస్‌లో కోహ్లీ 3 సెంచరీలు బాదేస్తాడన్న హర్బజన్ సింగ్
KL Rahul Injury |  విండీస్ రెండో టెస్ట్‌లో గాయపడిన కేఎల్ రాహుల్‌
Bodyline Bowling History | క్రికెట్ కారణంగా ఆసీస్, ఇంగ్లండ్‌లు శత్రువులుగా ఎలా మారాయి? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi Kurnool Tour: కర్నూలు చేరుకున్న ప్రధానమంత్రి మోదీ- స్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం, డీసీఎం
కర్నూలు చేరుకున్న ప్రధానమంత్రి మోదీ- స్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం, డీసీఎం
Konda Surekha vs Revanth Reddy: గన్ ఇచ్చింది రేవంత్ రెడ్డే! పోలీసులు ఏం చేయలేరు! వివాదాన్ని మరింత రాజేసిన మంత్రి కుమార్తె సుస్మిత 
గన్ ఇచ్చింది రేవంత్ రెడ్డే! పోలీసులు ఏం చేయలేరు! వివాదాన్ని మరింత రాజేసిన మంత్రి కుమార్తె సుస్మిత 
Konda Surekha OSD : 'క్లారిటీ తీసుకునేందుకు వెళ్లాం' కొండా సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌ ఎపిసోడ్‌పై పోలీసులు కీలక ప్రకటన 
'క్లారిటీ తీసుకునేందుకు వెళ్లాం' కొండా సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌ ఎపిసోడ్‌పై పోలీసులు కీలక ప్రకటన 
Konda Murali Reaction :
"రేవంత్‌తో విభేేదాలు లేవు, సుస్మిత ఏ పార్టీలోనూ లేరు" అర్ధరాత్రి హైడ్రామాపై స్పందించిన కొండా మురళి
Konda Surekha Vs Revanth Reddy: బీసీలపై సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు! మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన ఆరోపణలు!
బీసీలపై సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు! మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన ఆరోపణలు!
Raymond Group: అనంతపురంలో  ఏరోస్పేస్, ఆటో యూనిట్లకు రూ.1,000 కోట్ల పెట్టుబడి - రేమండ్ గ్రూప్ కీలక ప్రకటన
అనంతపురంలో ఏరోస్పేస్, ఆటో యూనిట్లకు రూ.1,000 కోట్ల పెట్టుబడి - రేమండ్ గ్రూప్ కీలక ప్రకటన
AP Liquor Issue: ఏపీలో ప్రతి మద్యం సీసా స్కాన్ చేసే అమ్మాలి - నకిలీ  లిక్కర్‌కు ఇక అడ్డుకట్ట !
ఏపీలో ప్రతి మద్యం సీసా స్కాన్ చేసే అమ్మాలి - నకిలీ లిక్కర్‌కు ఇక అడ్డుకట్ట !
Rural Vehicle Sales India: రైతులతో కిటకిటలాడిన షోరూమ్‌లు - పెరిగిన ఆదాయాలు, తగ్గిన GST రేట్లతో సేల్స్‌ ఊపు
షోరూమ్‌లను ముంచెత్తిన రూరల్‌ ఇండియా - బయ్యర్లలో ఎక్కువ మంది గ్రామీణులే
Embed widget