అన్వేషించండి

NEET SUPREME COURT:నీట్-యూజీ విధానంలో భారీ మార్పులు!మెయిన్, అడ్వాన్స్‌డ్ మోడల్‌లో చేయనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన కేంద్రం!

NEET SUPREME COURT:నీట్-యూజీ పరీక్షా విధానంలో భారీ మార్పులు రానున్నాయి. జేఈఈ తరహాలో, ఆన్‌లైన్ పరీక్షతోపాటు రెండు దశల్లో నిర్వహించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నీట్ పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా మార్చాలని కేంద్రం పరిశీలన.
  • జేఈఈ వలె నీట్ రెండు దశల పరీక్షగా మారే అవకాశం ఉంది.
  • నందన్ నీలేకని కమిటీ నివేదికపై తుది నిర్ణయం ఆధారపడి ఉంటుంది.
  • ప్రశ్నపత్రాల లీకులను అడ్డుకోవడానికి కొత్త భద్రతా చర్యలు అమలు.

NEET SUPREME COURT:జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష అయిన నీట్-యూజీ (NEET-UG) విధానంలో కీలక మార్పులకు సన్నాహాలు జరుగుతున్నాయి. సుమారు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే ఈ పరీక్షను, ప్రస్తుతం ఉన్న పెన్-అండ్-పేపర్ విధానం నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్షగా మార్చే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అదేవిధంగా, జేఈఈ (JEE) లాగానే, నీట్-యూజీని కూడా మెయిన్, అడ్వాన్స్‌డ్ అనే రెండు దశల్లో నిర్వహించాలని పరిశీలిస్తున్నారు.

ఈ ఏడాది నీట్ పరీక్ష పేపర్ లీక్ అనంతరం దాఖలైన పిటిషన్లపై స్పందిస్తూ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే ఎనిమిది ప్రధాన పరీక్షల్లో ఏడు ఇప్పటికే ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది. నీట్-యూజీని సీబీటీ విధానానికి మార్చే అవకాశంపై కూడా చర్చిస్తున్నారు.

తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు – ప్రభుత్వం

జేఈఈ తరహాలో రెండు అంచెల పరీక్షా విధానాన్ని అమలు చేయడం వల్ల పరీక్ష భద్రత పటిష్టమవడమే కాకుండా, విద్యార్థుల సామర్థ్యాలను మరింత మెరుగ్గా అంచనా వేయడానికి కూడా వీలవుతుందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. నీట్ పరీక్షలో చర్చిస్తున్న మార్పులను ఖరారు చేసే ముందు ఈ టాస్క్ ఫోర్స్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుంటారు. టాస్క్ ఫోర్స్ నివేదిక అందిన తర్వాతే కొత్త పరీక్షా విధానంపై నిర్ణయం తీసుకుంటారు.

ఈ నిర్ణయం ఒకేసారి అమలు చేయబోం– కేంద్రం

ఆగస్టు 6, శుక్రవారం నాటి విచారణకు ముందు దాఖలు చేసిన ఈ అఫిడవిట్‌లో, పరీక్షా విధానంలో ఎలాంటి పెద్ద మార్పులు హఠాత్తుగా అమలు  చేయబోమని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. విద్యార్థులకు కొత్త విధానం గురించి చాలా ముందుగానే తెలియజేస్తారు, తద్వారా వారు కొత్త విధానానికి సిద్ధం కావడానికి తగినంత సమయం ఉంటుంది.

ఈ అఫిడవిట్‌లో పరీక్షకు సంబంధించిన భద్రతా చర్యల వివరాలు కూడా ఉన్నాయి. ప్రశ్నపత్రాల లీకేజీలు. ఇతర అవకతవకలను నివారించడానికి కొత్త చట్టంతోపాటు అనేక సాంకేతిక, పరిపాలనా చర్యలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. వీటిలో ప్రశ్నపత్రాల బయోమెట్రిక్ ధృవీకరణ, జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసే వన్-టైమ్ లాక్ ట్రంకులు,  ఎన్‌క్రిప్టెడ్ డిజిటల్ ప్రశ్నల బ్యాంకులు ఉన్నాయి.

నీట్-యూజీ కొత్త పరీక్షా విధానాన్ని ఖరారు చేసే ముందు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ,  జాతీయ వైద్య కమిషన్‌తో సహా సంబంధిత వర్గాలన్నింటితో విస్తృత సంప్రదింపులు జరుపుతామని ప్రభుత్వం కూడా తెలిపింది.

Frequently Asked Questions

నీట్-యూజీ పరీక్ష విధానంలో ఎలాంటి మార్పులు పరిశీలిస్తున్నారు?

ప్రస్తుతం పెన్-అండ్-పేపర్ విధానంలో ఉన్న నీట్-యూజీని కంప్యూటర్ ఆధారిత పరీక్షగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. జేఈఈ తరహాలో మెయిన్, అడ్వాన్స్డ్ అనే రెండు దశల్లో నిర్వహించే ఆలోచన కూడా ఉంది.

నీట్-యూజీ పరీక్ష విధానంలో మార్పులను ఎందుకు పరిశీలిస్తున్నారు?

ఈ ఏడాది నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిన నేపథ్యంలో, పరీక్ష భద్రతను పటిష్టం చేయడానికి, విద్యార్థుల సామర్థ్యాలను మెరుగ్గా అంచనా వేయడానికి ఈ మార్పులను పరిశీలిస్తున్నారు.

కొత్త నీట్-యూజీ పరీక్ష విధానంపై తుది నిర్ణయం తీసుకున్నారా?

ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. నందన్ నీలేకని నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ సిఫార్సులు, సంబంధిత వర్గాలతో సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకుంటారు.

కొత్త నీట్-యూజీ పరీక్ష విధానాన్ని ఎలా అమలు చేస్తారు?

కేంద్రం హఠాత్తుగా ఎలాంటి పెద్ద మార్పులు అమలు చేయబోమని సుప్రీంకోర్టుకు తెలిపింది. విద్యార్థులకు ముందుగానే తెలియజేసి, కొత్త విధానానికి సిద్ధం కావడానికి తగినంత సమయం ఇస్తారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

NEET SUPREME COURT:నీట్-యూజీ విధానంలో భారీ మార్పులు!మెయిన్, అడ్వాన్స్‌డ్ మోడల్‌లో చేయనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన కేంద్రం!
నీట్-యూజీ విధానంలో భారీ మార్పులు!మెయిన్, అడ్వాన్స్‌డ్ మోడల్‌లో చేయనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన కేంద్రం!
Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
Embed widget