అన్వేషించండి

Manipur News: ఎస్పీ ఆఫీస్‌పై మూడు వందల మంది ఎటాక్, ముగ్గురు మృతి

Mob Attack On SP Office: మణిపూర్‌లో ఉద్రిక్తత కొనసాగుతోంది. చురాచంద్‌పూర్‌ ఎస్పీ కార్యాలయంపై గురువారం రాత్రి సుమారు 300 నుంచి 400 మంది గుంపు దాడికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.

Attack On SP Office In Manipur: మణిపూర్‌లో ఉద్రిక్తత కొనసాగుతోంది. చురాచంద్‌పూర్‌ ఎస్పీ కార్యాలయంపై గురువారం రాత్రి సుమారు 300 నుంచి 400 మంది గుంపు దాడికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. అల్లరి మూకలు రాళ్లు రువ్వుతూ హింసాత్మక చర్యలకు దిగినట్లు ఎస్పీ కార్యాలయం వెల్లడించింది. వారిని అడ్డుకోవడం, పరిస్థితిని నియంత్రించడం కోసం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, భద్రతా బలగాలు టియర్ గ్యాస్ షెల్‌లను ఉపయోగించాయని మణిపూర్ పోలీసులు తెలిపారు.
 
"ఈ రోజు సుమారుగా 300 నుంచి 400 మంది ఎస్పీ కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు. రాళ్లు రువ్వారు. పరిస్థితిని నియంత్రించడానికి రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌, సెక్యూరిటీ ఫోర్స్ టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు’ అని మణిపూర్ పోలీసులు సోషట్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ముగ్గురు మృతి
చురాచంద్‌పూర్ ఎస్పీ కార్యాలయంపై గురువారం జరిగిన దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో 30 మందికి పైగా గాయపడ్డారు. మూకుమ్మడి దాడిలో ఒకరు మరణించారని, 30 మందికి పైగా గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే తరువాత మృతుల సంఖ్య మూడుకు చేరినట్లు తెలిసింది. అలాగే సాయుధ వ్యక్తులతో కనిపించినందుకు హెడ్ కానిస్టేబుల్‌ సియామ్‌లాల్‌పాల్‌ను సస్పెండ్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

ఆందోళన కారులతో పోలీస్ కానిస్టేబుల్ కూర్చొని ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చురచంద్‌పూర్ ఎస్పీ శివానంద్ సర్వే హెడ్ కానిస్టేబుల్ సియామ్‌లాల్‌పాల్‌ను సస్పెండ్ చేశారు. తదుపరి నోటీసు వచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బాధ్యతా యుతమైన పోలీస్ ఉద్యోగంలో ఉంటూ సాయుధులతో కలిసి కూర్చొని ఉండడం క్రమశిక్షణారాహిత్య చర్యగా పేర్కొన్నారు. అలాగే సియామ్‌లాల్‌పాల్‌ ముందస్తు అనుమతి లేకుండా స్టేషన్‌ను విడిచిపెట్టవద్దని అధికారులు సూచించారు. అతని జీతం, అలవెన్సులు నిబంధనల ప్రకారం అందుతాయని పేర్కొన్నారు. 

ఇంటర్నెట్ సేవలను నిలిపేసిన ప్రభుత్వం
ఉద్రిక్తతల నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి 1:40 నుంచే సెక్షన్ 144 విధించింది. అంతే కాకుండా చురచంద్‌పూర్ జిల్లాలో 5 రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రజలను రెచ్చగొట్టే చిత్రాలు, పోస్ట్‌లు, వీడియో సందేశాలు కోసం సోషల్ మీడియాను ఆందోళన కారులు విస్తృతంగా ఉపయోగించవచ్చనే ఆందోళన నేపత్యంలో ఇంటర్నెట్ నిలిపి వేస్తున్నట్లు పేర్కొంది. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం అయ్యే రెచ్చగొట్టే, తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవడం కోసం, ప్రాణ, పబ్లిక్, ప్రైవేట్ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా కాపాడేందుకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు ప్రభుత్వం తెలిపింది.  

టాప్ హెడ్ లైన్స్

NEET Paper Leak:పరీక్ష పత్రాల లీకేజీకి పదేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా! ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం !
పరీక్ష పత్రాల లీకేజీకి పదేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా! ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం !
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
NEET Paper Leak Talks: NEET వివాదంపై కేంద్రంతో సీజేపీ చర్చలు - రెండు డిమాండ్లకు ఓకే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే చిక్కుముడి !
NEET వివాదంపై కేంద్రంతో సీజేపీ చర్చలు - రెండు డిమాండ్లకు ఓకే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే చిక్కుముడి !
Paper Leak New Bill: పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !
పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget