అన్వేషించండి

Manipur News: ఎస్పీ ఆఫీస్‌పై మూడు వందల మంది ఎటాక్, ముగ్గురు మృతి

Mob Attack On SP Office: మణిపూర్‌లో ఉద్రిక్తత కొనసాగుతోంది. చురాచంద్‌పూర్‌ ఎస్పీ కార్యాలయంపై గురువారం రాత్రి సుమారు 300 నుంచి 400 మంది గుంపు దాడికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.

Attack On SP Office In Manipur: మణిపూర్‌లో ఉద్రిక్తత కొనసాగుతోంది. చురాచంద్‌పూర్‌ ఎస్పీ కార్యాలయంపై గురువారం రాత్రి సుమారు 300 నుంచి 400 మంది గుంపు దాడికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. అల్లరి మూకలు రాళ్లు రువ్వుతూ హింసాత్మక చర్యలకు దిగినట్లు ఎస్పీ కార్యాలయం వెల్లడించింది. వారిని అడ్డుకోవడం, పరిస్థితిని నియంత్రించడం కోసం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, భద్రతా బలగాలు టియర్ గ్యాస్ షెల్‌లను ఉపయోగించాయని మణిపూర్ పోలీసులు తెలిపారు.
 
"ఈ రోజు సుమారుగా 300 నుంచి 400 మంది ఎస్పీ కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు. రాళ్లు రువ్వారు. పరిస్థితిని నియంత్రించడానికి రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌, సెక్యూరిటీ ఫోర్స్ టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు’ అని మణిపూర్ పోలీసులు సోషట్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ముగ్గురు మృతి
చురాచంద్‌పూర్ ఎస్పీ కార్యాలయంపై గురువారం జరిగిన దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో 30 మందికి పైగా గాయపడ్డారు. మూకుమ్మడి దాడిలో ఒకరు మరణించారని, 30 మందికి పైగా గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే తరువాత మృతుల సంఖ్య మూడుకు చేరినట్లు తెలిసింది. అలాగే సాయుధ వ్యక్తులతో కనిపించినందుకు హెడ్ కానిస్టేబుల్‌ సియామ్‌లాల్‌పాల్‌ను సస్పెండ్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

ఆందోళన కారులతో పోలీస్ కానిస్టేబుల్ కూర్చొని ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చురచంద్‌పూర్ ఎస్పీ శివానంద్ సర్వే హెడ్ కానిస్టేబుల్ సియామ్‌లాల్‌పాల్‌ను సస్పెండ్ చేశారు. తదుపరి నోటీసు వచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బాధ్యతా యుతమైన పోలీస్ ఉద్యోగంలో ఉంటూ సాయుధులతో కలిసి కూర్చొని ఉండడం క్రమశిక్షణారాహిత్య చర్యగా పేర్కొన్నారు. అలాగే సియామ్‌లాల్‌పాల్‌ ముందస్తు అనుమతి లేకుండా స్టేషన్‌ను విడిచిపెట్టవద్దని అధికారులు సూచించారు. అతని జీతం, అలవెన్సులు నిబంధనల ప్రకారం అందుతాయని పేర్కొన్నారు. 

ఇంటర్నెట్ సేవలను నిలిపేసిన ప్రభుత్వం
ఉద్రిక్తతల నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి 1:40 నుంచే సెక్షన్ 144 విధించింది. అంతే కాకుండా చురచంద్‌పూర్ జిల్లాలో 5 రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రజలను రెచ్చగొట్టే చిత్రాలు, పోస్ట్‌లు, వీడియో సందేశాలు కోసం సోషల్ మీడియాను ఆందోళన కారులు విస్తృతంగా ఉపయోగించవచ్చనే ఆందోళన నేపత్యంలో ఇంటర్నెట్ నిలిపి వేస్తున్నట్లు పేర్కొంది. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం అయ్యే రెచ్చగొట్టే, తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవడం కోసం, ప్రాణ, పబ్లిక్, ప్రైవేట్ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా కాపాడేందుకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు ప్రభుత్వం తెలిపింది.  

టాప్ హెడ్ లైన్స్

Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Breaking News: తెలంగాణలో పవన్ సభను అడ్డుకోవడం సరికాదు: ఏపీ సీఎం చంద్రబాబు
తెలంగాణలో పవన్ సభను అడ్డుకోవడం సరికాదు: ఏపీ సీఎం చంద్రబాబు
Texas Resident Rips Indian Flag: డాలస్‌లో రెచ్చిపోతున్న పనీపాటా లేని అమెరికన్ యువత - భారత జెండాలు చించి జాత్యాహంకారం -సోషల్ మీడియా వైరల్ కోసమే !
డాలస్‌లో రెచ్చిపోతున్న పనీపాటా లేని అమెరికన్ యువత - భారత జెండాలు చించి జాత్యాహంకారం -సోషల్ మీడియా వైరల్ కోసమే !

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget