అన్వేషించండి

Train Accident: చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం

Mirzapur Chunar Railway Station Accident | మిర్జాపూర్లో రైలు ప్రమాదంలో కార్తీక పౌర్ణమి స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులు మృతిచెందారు. ఈ ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Mirzapur Train Accident | ఉత్తరప్రదేశ్ లోని మిర్జాపూర్ జిల్లాలో బుధవారం (నవంబర్ 5) ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. చునార్ రైల్వే స్టేషన్ లో ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని ఆరుగురు ప్రయాణికులు మరణించారు. ఈ విషాద ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. దీనితో పాటు SDRF, NDRF బృందాలను సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాలని, క్షతగాత్రులకు తగిన వైద్యం అందించాలని ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం యోగి ఆకాంక్షించారు.

రైలు నుంచి వైరే వైపు దిగడం వల్లే ప్రమాదం 

రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ దాటుతుండగా, కాలకా-హావడా ఎక్స్‌ప్రెస్ (Netaji Express) పట్టాలపైకి వేగంగా వచ్చిందని సమాచారం. రైలు ఢీకొనడంతో దాదాపు ఆరుగుగురు ప్రయాణికులు చనిపోయారని సమాచారం. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ఎంత భయంకరంగా ఉందంటే, ప్రమాదంలో వారి శరీరాలు ముక్కలయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 

వీరంతా కార్తీక పూర్ణిమ సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వచ్చారు. అయితే చునార్ రైల్వే స్టేషన్లో రైలు దిగిన తరువాత వారు ప్లాట్‌ఫాం ఉన్నవైపు కాకుండా అవతలివైపు దిగారు. తరువాత రైలు పట్టాలు దాటుకుంటూ వెళ్తున్న సమయంలో మరో ట్రాక్ మీదకు వచ్చిన రైలు వారిని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. అనంతరం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు. చునార్ స్టేషన్ పరిసరాల్లో గందరగోళం నెలకొంది.

రైలు ప్రమాదంపై రైల్వే ప్రకటన

రైల్వే ప్రకారం, ఈ రోజు (బుధవారం, నవంబర్ 5) ఉదయం కొందరు చోపన్-చునార్ ప్యాసింజర్ రైలులో మిర్జాపూర్ లోని చునార్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. కాని ప్లాట్ ఫారం వైపు కాకుండా మరోవైపు రైలు దిగారు. అప్పుడే కాలకా-హావడా రైలు లైన్ పైకి వచ్చి ప్రయాణికులను ఢీకొట్టడంతో విషాదం చోటుచేసుకుంది. కార్తీక పూర్ణిమ సందర్భంగా పవిత్ర సన్నాలు ఆచరించేందుకు భక్తులు తరలివస్తున్నారు. దాంతో చునార్ రైల్వే స్టేషన్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. 

చునార్ స్టేషన్ ప్లాట్‌ఫాం నంబర్-4 వద్ద ప్రమాదం
ఈ ప్రయాణికులు చోపన్-చునార్ ప్యాసింజర్ రైలు నుంచి చునార్ రైల్వే స్టేషన్ లో దిగారు. ఈ రైలు  ప్లాట్‌ఫాం నంబర్ నాలుగు వద్ద ఆగింది. ప్రయాణికులు రైల్వే ట్రాక్ దాటి ఒక నంబర్ ప్లాట్‌ఫాం ద్వారా గంగా స్నానానికి వెళ్లాలని భావించారు. అప్పుడే కాలకా-హావడా రైలు ట్రాక్ మీదకు రావడంతో ప్రమాదం జరిగింది. 

మృతుల వివరాలు ఇవే.. 

చునార్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో మరణించిన వారి పేర్లు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదానికి గురైన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. వారిలో-

సవిత (భార్య రాజ్‌కుమార్)

సాధన (కుమార్తె విజయ్ శంకర్)

శివకుమారి (కుమార్తె విజయ్ శంకర్)

అప్పు దేవి (కుమార్తె శ్యామ్ ప్రసాద్)

సుశీల దేవి (భార్య మోతీలాల్) మరణించినట్లు ప్రకటించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth home village: సీఎం రేవంత్ క్లాస్‌మేట్  కొండారెడ్డి పల్లె సర్పంచ్ - ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్తులు
సీఎం రేవంత్ క్లాస్‌మేట్ కొండారెడ్డి పల్లె సర్పంచ్ - ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్తులు
Pawan Kalyan vs Congress: పవన్ కల్యాణ్ క్షమాపణకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ - లేకపోతే ?
పవన్ కల్యాణ్ క్షమాపణకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ - లేకపోతే ?
Telangana News: విద్యుత్ శాఖపై తెలంగాణ మంత్రులకే అవగాహన లేదు..! లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు
విద్యుత్ శాఖపై మంత్రులకే అవగాహన లేదు..! లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు
Peddi Reddy Folk Song Lyrics : యూట్యూబ్ ట్రెండింగ్... నాగదుర్గ 'పెద్దిరెడ్డి' సాంగ్ - 'బుల్లెట్ బండి' లక్ష్మణ్ హార్ట్ టచింగ్ లిరిక్స్
యూట్యూబ్ ట్రెండింగ్... నాగదుర్గ 'పెద్దిరెడ్డి' సాంగ్ - 'బుల్లెట్ బండి' లక్ష్మణ్ హార్ట్ టచింగ్ లిరిక్స్
Advertisement

వీడియోలు

I Bomma Ravi Piracy Sites Issue Explained | మనం చూసే ఒక్క సినిమాతో.. లక్షల కోట్ల నేర సామ్రాజ్యం బతికేస్తోంది | ABP Desam
Ro - Ko at India vs South Africa ODI | రాంచీలో రో - కో జోడి
Rajasthan Royals to be Sold IPL 2026 | అమ్మకాన్ని రాజస్థాన్ రాయల్స్ టీమ్ ?
Ab De Villiers comment on Coach Gambhir | గంభీర్ పై డివిలియర్స్ కామెంట్స్
Lionel Messi India Tour 2025 | భారత్‌కు లియోనెల్ మెస్సీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth home village: సీఎం రేవంత్ క్లాస్‌మేట్  కొండారెడ్డి పల్లె సర్పంచ్ - ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్తులు
సీఎం రేవంత్ క్లాస్‌మేట్ కొండారెడ్డి పల్లె సర్పంచ్ - ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్తులు
Pawan Kalyan vs Congress: పవన్ కల్యాణ్ క్షమాపణకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ - లేకపోతే ?
పవన్ కల్యాణ్ క్షమాపణకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ - లేకపోతే ?
Telangana News: విద్యుత్ శాఖపై తెలంగాణ మంత్రులకే అవగాహన లేదు..! లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు
విద్యుత్ శాఖపై మంత్రులకే అవగాహన లేదు..! లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు
Peddi Reddy Folk Song Lyrics : యూట్యూబ్ ట్రెండింగ్... నాగదుర్గ 'పెద్దిరెడ్డి' సాంగ్ - 'బుల్లెట్ బండి' లక్ష్మణ్ హార్ట్ టచింగ్ లిరిక్స్
యూట్యూబ్ ట్రెండింగ్... నాగదుర్గ 'పెద్దిరెడ్డి' సాంగ్ - 'బుల్లెట్ బండి' లక్ష్మణ్ హార్ట్ టచింగ్ లిరిక్స్
IND vs SA 1st ODI Live Streaming: రాంచీ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే.. మ్యాచ్ లైవ్ ఎక్కడ చూడాలంటే..
రాంచీ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే.. మ్యాచ్ లైవ్ ఎక్కడ చూడాలంటే..
Nuvvu Naaku Nachav Re Release: జనవరిలో నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్... శ్రీ స్రవంతి మూవీస్ సెంటిమెంట్‌ డేట్‌లో!
జనవరిలో నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్... శ్రీ స్రవంతి మూవీస్ సెంటిమెంట్‌ డేట్‌లో!
Krishna Scrub Typhus Fever: కృష్ణా జిల్లాలో  వింత జ్వరాలు!
కృష్ణా జిల్లాలో వింత జ్వరాలు! "స్క్రబ్ టైఫస్ "తో జాగ్రత్త పడకపోతే ప్రాణాంతకం అంటున్న డాక్టర్లు
Hyderabad Cyber Fraud :హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం - మోనికా పేరుతో వైద్యుడిపై వల- రూ. 14 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు
హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం - మోనికా పేరుతో వైద్యుడిపై వల- రూ. 14 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు
Embed widget