అన్వేషించండి

Train Accident: చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం

Mirzapur Chunar Railway Station Accident | మిర్జాపూర్లో రైలు ప్రమాదంలో కార్తీక పౌర్ణమి స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులు మృతిచెందారు. ఈ ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Mirzapur Train Accident | ఉత్తరప్రదేశ్ లోని మిర్జాపూర్ జిల్లాలో బుధవారం (నవంబర్ 5) ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. చునార్ రైల్వే స్టేషన్ లో ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని ఆరుగురు ప్రయాణికులు మరణించారు. ఈ విషాద ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. దీనితో పాటు SDRF, NDRF బృందాలను సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాలని, క్షతగాత్రులకు తగిన వైద్యం అందించాలని ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం యోగి ఆకాంక్షించారు.

రైలు నుంచి వైరే వైపు దిగడం వల్లే ప్రమాదం 

రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ దాటుతుండగా, కాలకా-హావడా ఎక్స్‌ప్రెస్ (Netaji Express) పట్టాలపైకి వేగంగా వచ్చిందని సమాచారం. రైలు ఢీకొనడంతో దాదాపు ఆరుగుగురు ప్రయాణికులు చనిపోయారని సమాచారం. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ఎంత భయంకరంగా ఉందంటే, ప్రమాదంలో వారి శరీరాలు ముక్కలయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 

వీరంతా కార్తీక పూర్ణిమ సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వచ్చారు. అయితే చునార్ రైల్వే స్టేషన్లో రైలు దిగిన తరువాత వారు ప్లాట్‌ఫాం ఉన్నవైపు కాకుండా అవతలివైపు దిగారు. తరువాత రైలు పట్టాలు దాటుకుంటూ వెళ్తున్న సమయంలో మరో ట్రాక్ మీదకు వచ్చిన రైలు వారిని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. అనంతరం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు. చునార్ స్టేషన్ పరిసరాల్లో గందరగోళం నెలకొంది.

రైలు ప్రమాదంపై రైల్వే ప్రకటన

రైల్వే ప్రకారం, ఈ రోజు (బుధవారం, నవంబర్ 5) ఉదయం కొందరు చోపన్-చునార్ ప్యాసింజర్ రైలులో మిర్జాపూర్ లోని చునార్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. కాని ప్లాట్ ఫారం వైపు కాకుండా మరోవైపు రైలు దిగారు. అప్పుడే కాలకా-హావడా రైలు లైన్ పైకి వచ్చి ప్రయాణికులను ఢీకొట్టడంతో విషాదం చోటుచేసుకుంది. కార్తీక పూర్ణిమ సందర్భంగా పవిత్ర సన్నాలు ఆచరించేందుకు భక్తులు తరలివస్తున్నారు. దాంతో చునార్ రైల్వే స్టేషన్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. 

చునార్ స్టేషన్ ప్లాట్‌ఫాం నంబర్-4 వద్ద ప్రమాదం
ఈ ప్రయాణికులు చోపన్-చునార్ ప్యాసింజర్ రైలు నుంచి చునార్ రైల్వే స్టేషన్ లో దిగారు. ఈ రైలు  ప్లాట్‌ఫాం నంబర్ నాలుగు వద్ద ఆగింది. ప్రయాణికులు రైల్వే ట్రాక్ దాటి ఒక నంబర్ ప్లాట్‌ఫాం ద్వారా గంగా స్నానానికి వెళ్లాలని భావించారు. అప్పుడే కాలకా-హావడా రైలు ట్రాక్ మీదకు రావడంతో ప్రమాదం జరిగింది. 

మృతుల వివరాలు ఇవే.. 

చునార్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో మరణించిన వారి పేర్లు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదానికి గురైన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. వారిలో-

సవిత (భార్య రాజ్‌కుమార్)

సాధన (కుమార్తె విజయ్ శంకర్)

శివకుమారి (కుమార్తె విజయ్ శంకర్)

అప్పు దేవి (కుమార్తె శ్యామ్ ప్రసాద్)

సుశీల దేవి (భార్య మోతీలాల్) మరణించినట్లు ప్రకటించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Lalit Modi Interview:
"నేను, మోదీ చాలా క్లోజ్‌, త్వరలోనే భారత్‌ వస్తాను" లలిత్ మోడీ కీలక స్టేట్మెంట్
Arunachalam Giri Pradakshina Gang Rape Case: అరుణాచలం వెళ్లడానికి ఆలోచించాల్సిందే - భక్తులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న నేర ముఠాలు !
అరుణాచలం వెళ్లడానికి ఆలోచించాల్సిందే - భక్తులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న నేర ముఠాలు !
Lalit Modi On Dawood Ibrahim:
"ఆ ఫోన్ కాల్‌తో ప్యాంట్‌ తడిసిపోయింది, అందుకే క్రికెట్‌ను వదిలేశా" దావూద్ ఇబ్రహీం బెదిరింపులపై లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Nani: విజయవాడలో కేశినేని నాని పొలిటికల్ బాంబ్ - ఎంపీ చిన్నిపై రూ.27 కోట్ల బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
విజయవాడలో కేశినేని వర్సెస్ కేశినేని - ఎంపీ చిన్నిపై నాని బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Dhee Show Pandu Accident : పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
Rajesh Exports SEBI Interim Order 2026: దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
Foods to Reduce Gas : గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Embed widget