అన్వేషించండి

Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన - భారత్‌లో ఊహకందని ఆధ్యాత్మిక విషాదాలివే!

Kumbh Mela Stampede: మహా కుంభమేళా తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్నే దిగ్భ్రాంతికి గురి చేసింది. గతంలో ప్రముఖ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉత్సవాల్లో ఈ తరహా విషాదాలు చోటు చేసుకున్నాయి. వాటిని ఓసారి చూస్తే..

Stampede Incident In India Over The Years: ప్రముఖ ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళాలో (Maha Kumbhmela 2025) బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట ఘటన మాటలకందని విషాదాన్ని నింపింది. మౌని అమావాస్యం సందర్భంగా పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు చేసేందుకు భక్తులు తెల్లవారుజామున అధిక సంఖ్యలో తరలిరాగా.. సెక్టార్ 2 వద్ద జరిగిన తొక్కిసలాటలో 20 మంది మృతి చెందారు. దాదాపు 100 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. మన దేశంలో గతంలోనూ ఇలాంటి విషాద ఘటనలు జరిగాయి. ప్రముఖ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉత్సవాలు సమయాల్లో ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ప్రమాదాలు గుర్తు చేస్తూనే ఉన్నాయి. అధికార యంత్రాంగం ఆయా కార్యక్రమాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ఎన్ని పటిష్ట చర్యలు చేపడుతున్నా.. ఎక్కడో ఓ చోట వదంతులు, భక్తుల్లో భయాలు, అత్యుత్సాహాలు ఈ ఘటనలకు కారణమవుతున్నాయి. దేశంలో గతంలో జరిగిన విషాద ఘటనలను ఓసారి పరిశీలిస్తే..

  • దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1954లో తొలి కుంభమేళా జరిగింది. అప్పట్లో ఫిబ్రవరి 3న జరిగిన తొక్కిసలాట ఘటన దేశంలోనే పెను విషాదంగా నిలిచింది. ఈ ఘటనలో 800 మంది ప్రాణాలు కోల్పోగా... 2 వేల మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం సైతం మౌని అమావాస్య రోజే జరగ్గా.. ఓ ఏనుగు అదుపు తప్పి దూసుకురావడంతో ఈ ఘటన జరిగినట్లు అప్పట్లో కథనాలు పేర్కొన్నాయి.
  • 1986.. ఏప్రిల్ 14న హరిద్వార్‌లో కుంభమేళా సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 200 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి యూపీ సీఎం వీర్‌బహదూర్ సింగ్ తనతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్లమెంట్ సభ్యులను తీసుకొని హరిద్వార్‌లో స్నానాలకు రాగా రద్దీని నియంత్రించలేక తొక్కిసలాట చోటు చేసుకుంది.
  • 2003లో కుంభమేళా సందర్భంగా మహారాష్ట్రలోని నాసిక్‌లో గోదావరి నదిలో స్నానాలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఘటనలో 39 మంది మృతి చెందారు.
  • 2013లో అలహాబాద్‌లో జరిగిన కుంభమేళాలో ఫిబ్రవరి 10న ఫుట్ బ్రిడ్జి కూలి తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఊపిరి తీసిన పాద ధూళి - గతేడాది ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో భోలేబాబా సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. పుల్‌రాయ్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాబా పాదాల వద్ద మట్టిని తీసుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరు కాగా.. ఈ దుర్ఘటన జరిగింది.

వదంతులు ప్రాణం తీశాయి

  • మధ్యప్రదేశ్‌లోని రత్నఘడ్ మందిరంలో  2013, అక్టోబర్ 13న నవరాత్రి సందర్భంగా దాదాపు 1,50,000 మంది భక్తులు వచ్చారు. అక్కడ ఓ వంతెన కూలిపోయే స్థితికి వచ్చిందన్న వదంతులు రావడంతో ఒక్కసారిగా జనం పరుగులు తీయడంతో తోపులాట జరిగింది. ఈ దుర్ఘటనలో 115 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • అలాగే, హిమాచల్‌ ప్రదేశ్‌లోని నయనాదేవి ఆలయంలో 2008 ఆగస్టులో తోపులాట జరిగి 145 మంది ప్రాణాలు కోల్పోయారు. కొండ చరియలు విరిగి పడుతున్నాయనే వదంతులే ఈ దుర్ఘటనకు కారణమని గుర్తించారు.

పేలుడు భయంతో..

రాజస్థాన్‌లోని చాముండేశ్వరీ దేవి ఆలయంలో 2008 సెప్టెంబర్ 30న జరిగిన తొక్కిసలాట ఘటనలో 224 మంది ప్రాణాలు కోల్పోగా.. 420 మంది గాయపడ్డారు. బాంబు పేలుడు భయంతోనే ఈ ప్రమాదం జరిగిందని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి.

జారుడు మెట్లతో..

మహారాష్ట్రలోని మంధరదేవి ఆలయానికి 2005 జనవరిలో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయానికి వెళ్లే మెట్లు జారుడుగా ఉండడంతో జనం ఒకరిపై మరొకరి పడి ఘోర విషాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read: Mahakumbh Mela Stampede 2025: మహా కుంభమేళాలో ఘోర విషాదం - 20 మంది మృతి?, 100 మందికి పైగా గాయాలు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget