అన్వేషించండి

Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన - భారత్‌లో ఊహకందని ఆధ్యాత్మిక విషాదాలివే!

Kumbh Mela Stampede: మహా కుంభమేళా తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్నే దిగ్భ్రాంతికి గురి చేసింది. గతంలో ప్రముఖ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉత్సవాల్లో ఈ తరహా విషాదాలు చోటు చేసుకున్నాయి. వాటిని ఓసారి చూస్తే..

Stampede Incident In India Over The Years: ప్రముఖ ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళాలో (Maha Kumbhmela 2025) బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట ఘటన మాటలకందని విషాదాన్ని నింపింది. మౌని అమావాస్యం సందర్భంగా పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు చేసేందుకు భక్తులు తెల్లవారుజామున అధిక సంఖ్యలో తరలిరాగా.. సెక్టార్ 2 వద్ద జరిగిన తొక్కిసలాటలో 20 మంది మృతి చెందారు. దాదాపు 100 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. మన దేశంలో గతంలోనూ ఇలాంటి విషాద ఘటనలు జరిగాయి. ప్రముఖ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉత్సవాలు సమయాల్లో ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ప్రమాదాలు గుర్తు చేస్తూనే ఉన్నాయి. అధికార యంత్రాంగం ఆయా కార్యక్రమాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ఎన్ని పటిష్ట చర్యలు చేపడుతున్నా.. ఎక్కడో ఓ చోట వదంతులు, భక్తుల్లో భయాలు, అత్యుత్సాహాలు ఈ ఘటనలకు కారణమవుతున్నాయి. దేశంలో గతంలో జరిగిన విషాద ఘటనలను ఓసారి పరిశీలిస్తే..

  • దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1954లో తొలి కుంభమేళా జరిగింది. అప్పట్లో ఫిబ్రవరి 3న జరిగిన తొక్కిసలాట ఘటన దేశంలోనే పెను విషాదంగా నిలిచింది. ఈ ఘటనలో 800 మంది ప్రాణాలు కోల్పోగా... 2 వేల మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం సైతం మౌని అమావాస్య రోజే జరగ్గా.. ఓ ఏనుగు అదుపు తప్పి దూసుకురావడంతో ఈ ఘటన జరిగినట్లు అప్పట్లో కథనాలు పేర్కొన్నాయి.
  • 1986.. ఏప్రిల్ 14న హరిద్వార్‌లో కుంభమేళా సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 200 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి యూపీ సీఎం వీర్‌బహదూర్ సింగ్ తనతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్లమెంట్ సభ్యులను తీసుకొని హరిద్వార్‌లో స్నానాలకు రాగా రద్దీని నియంత్రించలేక తొక్కిసలాట చోటు చేసుకుంది.
  • 2003లో కుంభమేళా సందర్భంగా మహారాష్ట్రలోని నాసిక్‌లో గోదావరి నదిలో స్నానాలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఘటనలో 39 మంది మృతి చెందారు.
  • 2013లో అలహాబాద్‌లో జరిగిన కుంభమేళాలో ఫిబ్రవరి 10న ఫుట్ బ్రిడ్జి కూలి తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఊపిరి తీసిన పాద ధూళి - గతేడాది ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో భోలేబాబా సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. పుల్‌రాయ్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాబా పాదాల వద్ద మట్టిని తీసుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరు కాగా.. ఈ దుర్ఘటన జరిగింది.

వదంతులు ప్రాణం తీశాయి

  • మధ్యప్రదేశ్‌లోని రత్నఘడ్ మందిరంలో  2013, అక్టోబర్ 13న నవరాత్రి సందర్భంగా దాదాపు 1,50,000 మంది భక్తులు వచ్చారు. అక్కడ ఓ వంతెన కూలిపోయే స్థితికి వచ్చిందన్న వదంతులు రావడంతో ఒక్కసారిగా జనం పరుగులు తీయడంతో తోపులాట జరిగింది. ఈ దుర్ఘటనలో 115 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • అలాగే, హిమాచల్‌ ప్రదేశ్‌లోని నయనాదేవి ఆలయంలో 2008 ఆగస్టులో తోపులాట జరిగి 145 మంది ప్రాణాలు కోల్పోయారు. కొండ చరియలు విరిగి పడుతున్నాయనే వదంతులే ఈ దుర్ఘటనకు కారణమని గుర్తించారు.

పేలుడు భయంతో..

రాజస్థాన్‌లోని చాముండేశ్వరీ దేవి ఆలయంలో 2008 సెప్టెంబర్ 30న జరిగిన తొక్కిసలాట ఘటనలో 224 మంది ప్రాణాలు కోల్పోగా.. 420 మంది గాయపడ్డారు. బాంబు పేలుడు భయంతోనే ఈ ప్రమాదం జరిగిందని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి.

జారుడు మెట్లతో..

మహారాష్ట్రలోని మంధరదేవి ఆలయానికి 2005 జనవరిలో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయానికి వెళ్లే మెట్లు జారుడుగా ఉండడంతో జనం ఒకరిపై మరొకరి పడి ఘోర విషాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read: Mahakumbh Mela Stampede 2025: మహా కుంభమేళాలో ఘోర విషాదం - 20 మంది మృతి?, 100 మందికి పైగా గాయాలు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్-మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్-మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్!
Priyanka Gandhi Parliament Speech: వారేమైనా తీవ్రవాదులా? - లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీసిన ప్రియాంకా గాంధీ
వారేమైనా తీవ్రవాదులా? - లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీసిన ప్రియాంకా గాంధీ
CM Vijay Office Shifted: ఆరు దశాబ్దాల సాంప్రదాయానికి బ్రేక్ - నూతన భవనంలోకి మారనున్న తమిళనాడు సీఎం విజయ్ ఆఫీస్!
ఆరు దశాబ్దాల సాంప్రదాయానికి బ్రేక్ - నూతన భవనంలోకి మారనున్న తమిళనాడు సీఎం విజయ్ ఆఫీస్!
Bank Holidays in August: ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి
ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget