Narasaraopet Crime News: నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం- ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్ బ్లేడు వదిలేసిన వైద్యులు
Narasaraopet Crime News: నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్ బ్లేడు వదిలేశారు వైద్యులు.

Narasaraopet Crime News: పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. చిన్న ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన నరసరావుపేట బాలయ్య నగర్ కు చెందిన రమాదేవి పొట్టలో సర్జికల్ బ్లేడ్ను వైద్యులు వదిలేశారు. తీవ్రంగా పొట్టలో నొప్పి రావడంతో స్కానింగ్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
రమాదేవికి ఆపరేషన్ చేసిన డాక్టర్ నారాయణ స్వామి,ఆయన సిబ్బంది వల్ల తప్పిదం జరిగింది. ఆపరేషన్ తర్వాత తీవ్ర నొప్పి రావడంతో బాధితురాలు సిబ్బందికి చెప్పారు. నొప్పి సహజం అని బాధితురాలికి చెప్పిన ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. నొప్పి తట్టుకోలేక ఈరోజు స్కానింగ్ చేయగా స్కానింగ్లో తోడ సర్జికల్ బ్లేడు ఉన్నట్లు గుర్తించారు.
సర్జికల్ బ్లేడుని చూసి ఒక్కసారిగా కంగుతిన్న బాధిత మహిళ బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ సమయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని డాక్టర్ పై బంధువుల ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆసుపత్రిలో బాధితురాలు బంధువులు ఆందోళనకి దిగారు. చిన్న ఆపరేషన్ చేయడానికి 25000 తీసుకున్నారని బాధితురాలు రమాదేవి ఆరోపించారు.






















