అన్వేషించండి

మధ్యప్రదేశ్‌లో బీజేపీకి, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కి షాక్? ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో ఆసక్తికర విషయాలు

Madhya Pradesh Elections 2023: మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వానికి షాక్ తప్పేలా లేదని ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్ వెల్లడించింది.

Madhya Pradesh Elections:

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కే మొగ్గు..! 

మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh Election) ప్రస్తుతం BJP అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ పనితీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ABP Cvoter Opinion Poll వెల్లడించింది. ఈసారి ఓటర్లు కాంగ్రెస్‌కి అధికారమిచ్చే అవకాశాలున్నట్టు తెలిపింది. ఈ పోల్‌లో ఎక్కువ మంది ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గారు. ఓట్ల శాతంలోనూ కాంగ్రెస్‌కి కాస్త సానుకూలత పెరిగింది. అయితే...చౌహాన్ సర్కార్‌పై ఓటర్లు ఎందుకంత గుర్రుగా ఉన్నారో స్పష్టంగా వివరించింది ఈ ఒపీనియన్ పోల్. ఏయే అంశాలు ఈ ఎన్నికలపై ప్రభావం చూపించనున్నాయన్నదీ వెల్లడించింది. 

ఏయే అంశాల ఎఫెక్ట్ ఎంత..?

మధ్యప్రదేశ్‌లో నిరుద్యోగం అంశం 31.0% మేర ప్రభావం చూపించనుందని ఈ ఒపీనియన్ పోల్ వెల్లడించింది. విద్యుత్, రహదారులు, నీళ్లు లాంటి మౌలిక వసతులు 2.7% మేర ప్రభావం చూపించనున్నాయి. శాంతి భద్రతలతో పాటు మహిళా భద్రత అంశం 3.8% ప్రభావం చూపుతుందని ఈ పోల్‌లో వెల్లడైంది. అవినీతి ప్రభావం 4.9% మేర ఉండే అవకాశముందని తెలిపింది. ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ 30.5% మేర ఉండనుంది. ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్న వాళ్ల సంఖ్య 55.4%గా ఉంది. అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని మార్చే ఆలోచన లేని వాళ్ల సంఖ్య 6.1%గా తేలింది. ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్న వాళ్ల సంఖ్య 38.4% గా వెల్లడైంది. ప్రభుత్వ పని తీరుపై 39.1% మంది సంతృప్తిగా ఉన్నారు. పరవాలేదనుకున్న వాళ్ల సంఖ్య 22.5% గా ఉండగా...పూర్తిగా అసంతృప్తిగా ఉన్న వాళ్ల సంఖ్య 37.1% మంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పని తీరుపై 41.0% మంది సానుకూలంగా ఉన్నారు. 20.5% మంది పరవాలేదని చెప్పారు. ఏ మాత్రం సంతృప్తిగా లేని వాళ్ల సంఖ్య 38.0%గా ఉంది. 

ఛత్తీస్‌గఢ్‌ సినారియో..

ఛత్తీస్‌గఢ్ ఎన్నికలపై ( Chhattisgarh Elections) నిరుద్యోగ అంశం 27.7%, మౌలిక వసతుల అంశం ప్రభావం 1.5%గా ఉంది. శాంతిభద్రత సమస్యల ప్రభావం 5.6%, అవినీతి ప్రభావం 6.6%, ద్రవ్యోల్బణం ఎఫెక్ట్‌ 36.7%గా ఉంది. ఇతరత్రా సమస్యల ప్రభావం 21.9%గా తేల్చింది ఈ ఒపీనియన్ పోల్. ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న వాళ్ల సంఖ్య 48.5%గా ఉంది. అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రభుత్వం మార్చాలనుకోని వాళ్ల సంఖ్య 6.7%గా ఉంది. ప్రభుత్వానికి సానుకూలంగా 44.8% మంది ఓటు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పనితీరుపై ఛత్తీస్‌గఢ్ ఓటర్లు 45.4%మేర సానుకూలంగా ఉన్నారు. 31.8% మంది పరవాలేదని చెప్పగా...21.5% మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇక రాహుల్ గాంధీకి సానుకూలంగా 29.0% ఓట్లు రాగా...24.7% మంది పరవాలేదని చెప్పారు. రాహుల్‌కి వ్యతిరేకంగా 39.9% మంది ఓటు వేశారు. 

మిజోరంలో ఇలా..

మిజోరంలో నిరుద్యోగం ఎఫెక్ట్ 19.0%, మౌలిక వసతులు 15.7%, శాంతి భద్రతల అంశం 4.1% మేర ఎన్నికలపై ప్రభావం చూపించనున్నాయి. ప్రభుత్వంపై 50% మంది ప్రతికూలంగా ఉన్నారు. సానుకూలంగా ఉన్న వాళ్ల సంఖ్య 34.3%గా ఉన్నట్టు ఈ ఒపీనియన్ పోల్ వెల్లడించింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Embed widget