అన్వేషించండి

LPG Supply Crunch India: దేశంలో గ్యాస్‌ సంక్షోభం ఉందా? గృహాలు, ఆసుపత్రులు, అత్యవసర సేవలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్యానెల్‌ ఏర్పాటు చేశారా? 

LPG Supply Crunch India: ప్రభుత్వ రంగ చమురు కంపెనీల నుంచి తాజా సమాచారం గృహాలకు,  కీలకమైన సేవలకు అంతరాయం లేకుండా సరఫరాను నిర్ధారించడానికి తీసుకుంటున్న కార్యాచరణ చర్యలను వివరిస్తుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • గృహాలకు ఎల్‌పీజీకి మొదటి ప్రాధాన్యత, ఉత్పత్తి పది శాతం పెంచారు.
  • బ్లాక్‌ మార్కెట్‌ అరికట్టడానికి 25 రోజుల గ్యాప్‌తోనే రెండో సిలిండర్.
  • ఆసుపత్రులు, విద్యాసంస్థలకు సరఫరాలో ప్రాధాన్యత కొనసాగుతుంది.
  • వాణిజ్య వినియోగదారులకు ప్రత్యేక కమిటీ ద్వారా గ్యాస్‌ కేటాయింపులు.

LPG Supply Crunch India: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణంతో భారత్‌ వంట గ్యాస్‌ సరఫరాలపై ప్రభావం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దేశంలోని మూడు పెద్ద ప్రభుత్వం చమురు కంపెనీలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం కొన్ని కొత్త రూల్స్‌న ప్రకటించాయి. ఈ నిర్ణయాల వల్ల ఎవరికి లాభం? ఎవరికి ఇబ్బంది? అనే విషయాలను చాలా సింపుల్‌్గా తెలుసుకుందాం. 

ఇళ్లకే మొదటి ప్రాధాన్యత 

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్‌లో అనిశ్చితి నెలకొంది. దీని వల్ల ఎల్‌పీజీ సరఫరాలో అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం ఒక స్పష్టమైన ఆదేశం జారీ చేసింది. సిలిండర్ల సరఫరాలో సామాన్య గృహ వినియోగదారులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. గృహాలకు నిరంతరాయంగా గ్యాస్ అందేలా చూడటం ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. ఇందు కోసం చమురు కంపెనీలు తమ ఉత్పత్తిని పది శాతం పెంచేందుకు అంగీకరించాయి. ఇప్పటి వరకు ఉన్న అదనపు గ్యాస్ కూడా గృహ అవసరాలకే మళ్లించాయి. 

గ్యాస్ బుకింగ్‌‌లో 25 రోజుల కొత్త రూల్

వంట గ్యాస్ సిలిండర్‌లను బ్లాక్ మార్కెట్‌ చేయడం లేదా అవసరం లేకపోయినా నిల్వ ఉంచడం వంటి పనులను అరికట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత రెండో సిలిండర్‌ బుక్ చేయడానికి మధ్యలో కచ్చితంగా 25 రోజులు గ్యాప్ ఉండాలి. ఈ రూల్ వల్ల గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగం తగ్గుతుందని అందరికీ సమానంగా పంపిణీ జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 

ఆసుపత్రులు, విద్యాసంస్థలకు ఊరట

గృహ వినియోగదారుల తర్వాత సమాజానికి అత్యంత అవసరమైన రంగాలకు గ్యాస్ సరఫరా ఆగిపోకుండా కంపెనీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ సరఫరా కొనసాగుతుంది. ఆరోగ్య సేవలు, విద్య కార్యక్రమాలు ఆగిపోకూడదని ఉద్దేంతో దిగుమతి చేసుకున్న ఎల్‌పీజీని కూడా వీరికి మళ్లించాలని నిర్ణయించారు. 

హోటళ్లు, రెస్టారెంట్లకు కష్టాలు తప్పవా?

ఇళ్లు, ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వాణిజ్య వినియోగదారులు అంటే హోటళ్లు రెస్టారెంట్‌లు, చిన్న పరిశ్రమలకు గ్యాస్ సరఫరాలో కొంత ఇబ్బంది తప్పదు. వాణిజ్య అవసరాల కోసం దిగుమతి చేసుకున్న గ్యాస్‌పైనే ఎక్కువగా ఆధారపడతాం. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లో ధరలు, సరఫరాలో హెచ్చుతగ్గుల వల్ల వీరికి సరిపడా గ్యాస్  అందకపోవచ్చు. పరిస్థితి సాధారణం స్థితికి వచ్చే వరకు ఈ రంగాలు కొంత సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. 

వాణిజ్య వినియోగదారుల కోసం ప్రత్యేక కమిటీ 

వాణిజ్య రంగాల నుంచి వచ్చే గ్యాస్‌ అభ్యర్థనలను పరిశీలించడానికి ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఇండియన్ ఆయిల్ నుంచి కె. శైలేంద్ర, భారత్ పెట్రోలియం నుంచి టీవీ పాండియన్‌, హిందూస్థాన్ పెట్రోలియం నుంచి ధ్రువ్‌ కపిల్ సభ్యులుగా ఉన్నారు. వీరు గ్యాస్ ఆవశ్యకతను బట్టి అందుబాటులో ఉన్న నిల్వలను చూసి ఎవరికి ఎంత సరఫరా చేయాలో నిర్ణయిస్తారు. 

“ఇతర దేశీయేతర రంగాలకు LPG సరఫరా కోసం, ప్రాతినిధ్యాలను సమీక్షించడానికి మరియు LPG సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వడానికి చమురు మార్కెటింగ్ కంపెనీల ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీని ఏర్పాటు చేశారు” అని కంపెనీలు తెలిపాయి.

వాణిజ్య సంస్థలు తమ అభ్యర్థనలను ఈ మెయిల్స్‌ ద్వారా పంపవచ్చు. 

ఇండియన్ ఆయిల్ indanecareho@indianoil.in

భారత్ పెట్రోలియం edlpg@bharatpetroleum.in

హిందూస్థాన్ పెట్రోలియం Ipg.sbu.head@hpcl.in 

దిగుమతులు, ఉత్పత్తిపై ఆధారపడి ఉంటుందని కాబట్టి కమిటీ ప్రతి ఫిర్యాదును లేదా, అభ్యర్థనను పరిష్కరించ లేకపోవచ్చని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో గ్యాస్ సరఫరాను గాడిలో పెట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమిది. సామాన్య ప్రజల వంట గదిలో మంట ఆరిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇళ్లకు, ఆసుపత్రులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. 

Frequently Asked Questions

ప్రభుత్వం ఎందుకు LPG సరఫరాపై కొత్త నిబంధనలు ప్రకటించింది?

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల LPG సరఫరాలో ఇబ్బందులు రాకుండా, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.

LPG సరఫరాలో ఎవరికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది?

సామాన్య గృహ వినియోగదారులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఆసుపత్రులు, విద్యాసంస్థలకు కూడా ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ సరఫరా కొనసాగుతుంది.

వంట గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టడానికి కొత్త రూల్ ఏమిటి?

ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత రెండో సిలిండర్ బుక్ చేయడానికి మధ్యలో కచ్చితంగా 25 రోజులు గ్యాప్ ఉండాలి. ఇది సిలిండర్ల దుర్వినియోగాన్ని తగ్గిస్తుంది.

హోటళ్లు, రెస్టారెంట్లకు LPG సరఫరాలో ఇబ్బందులు వస్తాయా?

అవును, ఇళ్లకు, ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వాణిజ్య వినియోగదారులైన హోటళ్లు, రెస్టారెంట్లకు గ్యాస్ సరఫరాలో కొంత ఇబ్బంది తప్పదు.

వాణిజ్య వినియోగదారుల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారా?

అవును, వాణిజ్య రంగాల నుంచి వచ్చే గ్యాస్ అభ్యర్థనలను పరిశీలించడానికి ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
MP Jhabua Man Builds Underground House: తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !
తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Embed widget