అన్వేషించండి

Lok Sabha Security Breach: పార్లమెంట్‌ ఘటనలో ఐదుగురు అరెస్ట్, మరొకరి కోసం గాలింపు

Lok Sabha Security breach:పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న వేళ లోక్‌సభలోకి దుండగులు దూసుకురావడం యావత్‌ దేశాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనలో ఆరుగురి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

Parliament Winter Sessions: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న వేళ...లోక్‌సభ(Loksabha)లోకి  దుండగులు దూసుకురావడం యావత్‌ దేశాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనలో ఆరుగురి (Six Members) ప్రమేయం ఉన్నట్టు  పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు (Arrest)చేసిన ఢిల్లీ పోలీసులు...మరో నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. దుండగులు పక్కా ప్రణాళిక, పరస్పర సమన్వయంతోనే ఈ తరహా దుశ్చర్యకు పాల్పడ్డారని  పోలీసులు తెలిపారు. నిందితులందరికీ నాలుగేళ్లుగా పరిచయం ఉందని, కొద్ది రోజుల క్రితమే రెక్కీ కూడా నిర్వహించారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. లోక్‌సభ గ్యాలరీలోకి ప్రవేశించి ఎంపీలను భయాందోళనకు గురిచేసిన సాగర్‌ శర్మ, మనో రంజన్‌ డి అనే వ్యక్తులను అక్కడే అదుపులోకి తీసుకున్నారు. అమోల్‌ శిందే, నీలమ్‌ను పార్లమెంటు భవనం బయట అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరిని పోలీసులు విచారిస్తున్నారు. వీరితో పాటు లలిత్‌, విక్రమ్‌ అనే మరో ఇద్దరి పేర్లు బయటకు వచ్చాయి. దీంతో విక్రమ్‌ను గురుగ్రామ్‌లో అదుపులోకి తీసుకోగా.. లలిత్‌ కోసం గాలింపు చేపట్టారు.

పార్లమెంటుకు వచ్చే ముందు వీరంతా గురుగ్రామ్‌లోని విక్రమ్‌ ఇంట్లోనే ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. ప్రణాళిక ప్రకారం ఆరుగురూ పార్లమెంటు లోపలికి వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. ఇద్దరికే విజిటర్‌ పాసులు దొరికాయి.  నాలుగేళ్లుగా ఒకరితో ఇంకొకరికి పరిచయం ఉందని.. సామాజిక మాధ్యమాల వేదికగా కాంటాక్టు అయ్యేవారని పోలీసులు గుర్తించారు.  ఈ తరహా దాడికి ప్రయత్నించాలని ఎవరైనా వ్యక్తులు లేదా సంస్థ ఆదేశించిందా అన్న కోణంలో విచారణ చేపట్టారు. నిందితులు లోక్‌సభలోకి వెళ్లేందుకు అవసరమైన పాసులు మైసూరు ఎంపీ ప్రతాప్‌సింహా కార్యాలయం నుంచి జారీ అయ్యాయి. దీంతో ఆయన కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనకు దిగాయి.  దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.  లోక్‌సభలో జరిగిన భద్రతా వైఫల్యానికి ఆయనే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. 

పార్లమెంటు లోపల, బయట పసుపు రంగుతో కూడిన పొగ విడుదల చేస్తూ ఎంపీలు, భద్రతా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. సంచలనం కోసం దుండగులు చేసిన ఈ చర్యతో యావత్‌ దేశం ఉలిక్కిపడింది. అయితే, ఇవి సాధారణ రంగులతో కూడిన వాయువులు విడుదల చేసేవేనని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో ఊరట కలిగించింది. ఈ ఘటనపై స్పీకర్‌ ఓం బిర్లా స్పందించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడుతామని, దానికి పూర్తి బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.  లోక్‌సభ లోపల ఇద్దరు దుండగులు, బయట మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారని అన్నారు. వారి దగ్గరున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నారని, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతామని ఎంపీలకు హామీ ఇచ్చారు. నిందితులు వదిలింది కేవలం సాధారణ పొగే అని...ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై చర్చ
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై చర్చ
TGPSC Group1 Recruitment: తగ్గేదేలే అంటున్న టీజీపీఎస్సీ, 1:50 నిష్పత్తిలోనే 'గ్రూప్‌-1' మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక
తగ్గేదేలే అంటున్న టీజీపీఎస్సీ, 1:50 నిష్పత్తిలోనే 'గ్రూప్‌-1' మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక
Andhra Pradesh: కలకలం రేపుతున్న దస్త్రాలు దహనం ఘటన- కీలకంగా మారుతున్న డ్రైవర్‌ వాంగ్మూలం
కలకలం రేపుతున్న దస్త్రాలు దహనం ఘటన- కీలకంగా మారుతున్న డ్రైవర్‌ వాంగ్మూలం
Etvwin Web Series: ఈటీవీ విన్ ఓటీటీ కోసం... చంద్రశేఖర్ యేలేటి వెబ్ సిరీస్!
ఈటీవీ విన్ ఓటీటీ కోసం... చంద్రశేఖర్ యేలేటి వెబ్ సిరీస్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై చర్చ
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై చర్చ
TGPSC Group1 Recruitment: తగ్గేదేలే అంటున్న టీజీపీఎస్సీ, 1:50 నిష్పత్తిలోనే 'గ్రూప్‌-1' మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక
తగ్గేదేలే అంటున్న టీజీపీఎస్సీ, 1:50 నిష్పత్తిలోనే 'గ్రూప్‌-1' మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక
Andhra Pradesh: కలకలం రేపుతున్న దస్త్రాలు దహనం ఘటన- కీలకంగా మారుతున్న డ్రైవర్‌ వాంగ్మూలం
కలకలం రేపుతున్న దస్త్రాలు దహనం ఘటన- కీలకంగా మారుతున్న డ్రైవర్‌ వాంగ్మూలం
Etvwin Web Series: ఈటీవీ విన్ ఓటీటీ కోసం... చంద్రశేఖర్ యేలేటి వెబ్ సిరీస్!
ఈటీవీ విన్ ఓటీటీ కోసం... చంద్రశేఖర్ యేలేటి వెబ్ సిరీస్!
Team India: 16 గంటల విమాన ప్రయాణంలో భారత క్రికెటర్లు ఏం చేశారంటే?
16 గంటల విమాన ప్రయాణంలో భారత క్రికెటర్లు ఏం చేశారంటే?
Bonalu in Hyderabad 2024: అమ్మకు బోనం.. ఆధ్యాత్మిక సంబురం మాత్రమే కాదు అంటు వ్యాధులు తరిమేసే ఆయుధం!
అమ్మకు బోనం.. ఆధ్యాత్మిక సంబురం మాత్రమే కాదు అంటు వ్యాధులు తరిమేసే ఆయుధం!
Team India Return: సగర్వంగా స్వదేశానికి వచ్చిన ఆటగాళ్ళు, ఎక్కడ చూసినా అభిమానుల సందడే
సగర్వంగా స్వదేశానికి వచ్చిన ఆటగాళ్ళు, ఎక్కడ చూసినా అభిమానుల సందడే
Trisha Krishnan : మీ డ్రెస్​ నచ్చి వేసుకుంటున్నారా? వేరే వాళ్లని ఇంప్రెస్ చేయడం వేసుకుంటున్నారా? త్రిష వేసిన ప్రశ్న మీకేనేమో
మీ డ్రెస్​ నచ్చి వేసుకుంటున్నారా? వేరే వాళ్లని ఇంప్రెస్ చేయడం వేసుకుంటున్నారా? త్రిష వేసిన ప్రశ్న మీకేనేమో
Embed widget