అన్వేషించండి

Bride Sisters Suicide: ఒకేరోజు అక్కాచెల్లెళ్ల పెళ్లికి ముహూర్తం.. కొన్ని గంటల ముందు ఇద్దరు ఆత్మహత్య!

Jodhpur Bride Sisters Suicide: జోధ్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు వధువుల వివాహ ఊరేగింపు జరగాల్సి ఉండగా.. అంతకు కొన్ని గంటల ముందే అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబసభ్యులు తెలిపారు.

ఇటీవల యూపీలోని ఘజియాబాద్‌లో ఒకేసారి ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మరో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. శనివారం (ఫిబ్రవరి 21) రాత్రి జోధ్‌పూర్ నగరానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు శోభ (25), విమల (23) తమ పెళ్లి రోజే ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్నారు అని కుటుంబసభ్యులు, స్థానికులు పేర్కొన్నారు. కాగా, సమాచారం అందిన వెంటనే పోలీసులు అంత్యక్రియలను అడ్డుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

జోధ్‌పూర్‌లోని మనాయి గ్రామంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లకు ఒకేరోజు వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఈ క్రమంలో శనివారం (ఫిబ్రవరి 21) ఊరేగింపు జరగాల్సి ఉంది. కానీ అంతకు కొన్ని గంటలముందే వారు విషం తాగి సూసైడ్ చేసుకున్నారు. అప్పటివరకూ పెళ్లి వేడుకలతో ఉత్సాహంగా ఉన్న కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొన్ని గంటల్లో పెళ్లి జరుగుతుందని భావించిన తల్లిదండ్రులు ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రాత్రివరకు సంబరాల్లో మునిగిపోయారు. కానీ తెల్లవారేసరికి ఆ సంతోషం కాస్తా విషాదంగా మారింది.

ఇద్దరినీ ఆసుపత్రికి తీసుకెళ్లిన బంధువులు
యువతులు విషం తాగినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే వారిని హుటాహుటిన చికిత్స అందించేందుకు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వారికి చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం దక్కలేదు. అప్పటికే వారి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.

ఏడీసీపీ (పశ్చిమ) రోషన్ మీనా మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి ఇంట్లో పెళ్లి వేడుకలు జరిగాయి. అర్ధరాత్రి సమయంలో ఇద్దరు వధువులు (అక్కాచెల్లెళ్లు) నిద్రపోవడానికి వెళ్లారు. ఉదయం సుమారు 4 గంటల సమయంలో ఇద్దరి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించిందని కుటుంబసభ్యులు గుర్తించారు. వెంటనే బంధువులు వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూనే వారు చనిపోయారు. మృతిచెందారని డాక్టర్లు నిర్ధారించిన తరువాత కుటుంబ సభ్యులు యువతుల అంత్యక్రియల కోసం మృతదేహాలను ఇంటికి తీసుకువచ్చారు.

అంత్యక్రియలను అడ్డుకున్న పోలీసులు
ఈ విషయం స్థానిక పోలీసులకు తెలియడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని అక్కాచెల్లెళ్ల అంత్యక్రియల ప్రక్రియను నిలిపివేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాతే కుటుంబ సభ్యులకు వారి మృతదేహాలను అప్పగించామని అధికారులు తెలిపారు.

ఇద్దరు పెళ్లికూతుళ్లు విషం తాగడం వల్లే మరణించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే, మరణానికి గల అసలు కారణం పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టమవుతుంది. మృతుల వద్ద ఎలాంటి ఆత్మహత్య లేఖ (సుసైడ్ నోట్)  లభించలేదని పోలీసులు తెలిపారు. పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం చెప్పకపోవడంతో అక్కాచెల్లెళ్లకు ఒకేసారి వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. కానీ పెళ్లికి కొన్ని గంటల ముందు వారు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: భారతీయులను చూసి సభ్యత, సంస్కారం నేర్చుకోండి: అమెరికాకు ఇరాన్ కౌంటర్
భారతీయులను చూసి సభ్యత, సంస్కారం నేర్చుకోండి: అమెరికాకు ఇరాన్ కౌంటర్
Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు భారీ ఊరట.. WFI తీరును తప్పుపట్టిన హైకోర్టు
రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు భారీ ఊరట.. WFI తీరును తప్పుపట్టిన హైకోర్టు
Elephant damages cars Thrissur: త్రిస్సూర్‌లో గజరాజు భీభత్సం - కారును ఫుట్‌బాల్‌లా ఆడేసుకున్న ఏనుగు.. మహిళ ప్రాణాలతో ఎలా బయటపడిందంటే?
త్రిస్సూర్‌లో గజరాజు భీభత్సం - కారును ఫుట్‌బాల్‌లా ఆడేసుకున్న ఏనుగు.. మహిళ ప్రాణాలతో ఎలా బయటపడిందంటే?
Miyazaki Mango price in India: ఆ మామిడి తోటకు జడ్ ప్లస్ సెక్యూరిటీ - వెండి కంటే ఎక్కువ రేటు - ఈ మ్యాంగోల గురించి తెలిస్తే షాక్ అవుతారు!
ఆ మామిడి తోటకు జడ్ ప్లస్ సెక్యూరిటీ - వెండి కంటే ఎక్కువ రేటు - ఈ మ్యాంగోల గురించి తెలిస్తే షాక్ అవుతారు!
Advertisement

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 Playoff Race: రేసు రసవత్తరం...Playoff మహత్తరం
రేసు రసవత్తరం... Playoff మహత్తరం
Telangana Cabinet Decisions: పేదవారికి గుడ్‌న్యూస్.. 2.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు - తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
పేదవారికి గుడ్‌న్యూస్.. 2.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు - తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Prakash Raj: ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
White House Gun Fire: వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం, ట్రంప్ సేఫ్
వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం, ట్రంప్ సేఫ్
Telangana Heatwave: వ‌డ‌గాల్పుల‌తో 16 మంది మృతి.. రూ.4 ల‌క్షల ఆర్ధిక సాయం.. 3 రోజులు మరింత తీవ్రంగా హీట్ వేవ్
వ‌డ‌గాల్పుల‌తో 16 మంది మృతి.. రూ.4 ల‌క్షల ఆర్ధిక సాయం.. 3 రోజులు మరింత తీవ్రంగా హీట్ వేవ్
Talliki Vandanam Eligibility Status: ప్రతి విద్యార్థికి రూ.15 వేలు.. తల్లికి వందనం స్కీమ్ కు మీకు పడతాయా?.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ప్రతి విద్యార్థికి రూ.15 వేలు.. తల్లికి వందనం స్కీమ్ కు మీరు అర్హులేనే.. ఇలా చెక్ చేసుకోండి
వివాహం ఆలస్యం, కెరీర్ అడ్డంకులకు మీరు పూజ చేసే విధానమే కారణమా? దేవతా యోగం రహస్యాలు తెలుసుకోండి!
వివాహం ఆలస్యం, కెరీర్ అడ్డంకులకు మీరు పూజ చేసే విధానమే కారణమా? దేవతా యోగం రహస్యాలు తెలుసుకోండి!
Drishyam 3 Collection Day 3: 100 కోట్ల క్లబ్బులో 'దృశ్యం 3'... మోహన్ లాల్ దెబ్బకు మలయాళ బాక్సాఫీస్ రికార్డులు మటాష్
100 కోట్ల క్లబ్బులో 'దృశ్యం 3'... మోహన్ లాల్ దెబ్బకు మలయాళ బాక్సాఫీస్ రికార్డులు మటాష్
Embed widget