అన్వేషించండి

Bride Sisters Suicide: ఒకేరోజు అక్కాచెల్లెళ్ల పెళ్లికి ముహూర్తం.. కొన్ని గంటల ముందు ఇద్దరు ఆత్మహత్య!

Jodhpur Bride Sisters Suicide: జోధ్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు వధువుల వివాహ ఊరేగింపు జరగాల్సి ఉండగా.. అంతకు కొన్ని గంటల ముందే అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబసభ్యులు తెలిపారు.

ఇటీవల యూపీలోని ఘజియాబాద్‌లో ఒకేసారి ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మరో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. శనివారం (ఫిబ్రవరి 21) రాత్రి జోధ్‌పూర్ నగరానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు శోభ (25), విమల (23) తమ పెళ్లి రోజే ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్నారు అని కుటుంబసభ్యులు, స్థానికులు పేర్కొన్నారు. కాగా, సమాచారం అందిన వెంటనే పోలీసులు అంత్యక్రియలను అడ్డుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

జోధ్‌పూర్‌లోని మనాయి గ్రామంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లకు ఒకేరోజు వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఈ క్రమంలో శనివారం (ఫిబ్రవరి 21) ఊరేగింపు జరగాల్సి ఉంది. కానీ అంతకు కొన్ని గంటలముందే వారు విషం తాగి సూసైడ్ చేసుకున్నారు. అప్పటివరకూ పెళ్లి వేడుకలతో ఉత్సాహంగా ఉన్న కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొన్ని గంటల్లో పెళ్లి జరుగుతుందని భావించిన తల్లిదండ్రులు ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రాత్రివరకు సంబరాల్లో మునిగిపోయారు. కానీ తెల్లవారేసరికి ఆ సంతోషం కాస్తా విషాదంగా మారింది.

ఇద్దరినీ ఆసుపత్రికి తీసుకెళ్లిన బంధువులు
యువతులు విషం తాగినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే వారిని హుటాహుటిన చికిత్స అందించేందుకు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వారికి చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం దక్కలేదు. అప్పటికే వారి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.

ఏడీసీపీ (పశ్చిమ) రోషన్ మీనా మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి ఇంట్లో పెళ్లి వేడుకలు జరిగాయి. అర్ధరాత్రి సమయంలో ఇద్దరు వధువులు (అక్కాచెల్లెళ్లు) నిద్రపోవడానికి వెళ్లారు. ఉదయం సుమారు 4 గంటల సమయంలో ఇద్దరి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించిందని కుటుంబసభ్యులు గుర్తించారు. వెంటనే బంధువులు వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూనే వారు చనిపోయారు. మృతిచెందారని డాక్టర్లు నిర్ధారించిన తరువాత కుటుంబ సభ్యులు యువతుల అంత్యక్రియల కోసం మృతదేహాలను ఇంటికి తీసుకువచ్చారు.

అంత్యక్రియలను అడ్డుకున్న పోలీసులు
ఈ విషయం స్థానిక పోలీసులకు తెలియడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని అక్కాచెల్లెళ్ల అంత్యక్రియల ప్రక్రియను నిలిపివేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాతే కుటుంబ సభ్యులకు వారి మృతదేహాలను అప్పగించామని అధికారులు తెలిపారు.

ఇద్దరు పెళ్లికూతుళ్లు విషం తాగడం వల్లే మరణించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే, మరణానికి గల అసలు కారణం పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టమవుతుంది. మృతుల వద్ద ఎలాంటి ఆత్మహత్య లేఖ (సుసైడ్ నోట్)  లభించలేదని పోలీసులు తెలిపారు. పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం చెప్పకపోవడంతో అక్కాచెల్లెళ్లకు ఒకేసారి వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. కానీ పెళ్లికి కొన్ని గంటల ముందు వారు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలైన ప్రశ్న రావణ్.. త్వరలోనే ప్రెస్ మీట్
బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలైన ప్రశ్న రావణ్.. త్వరలోనే ప్రెస్ మీట్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
US Woman Liz Shocked Indian Medicine Prices Cancer: అమెరికాలో రూ.85,000.. ఇండియాలో రూ.35! క్యాన్సర్ మందుల ధరలు చూసి అమెరికన్ మహిళ షాక్!
అమెరికాలో రూ.85,000.. ఇండియాలో రూ.35! క్యాన్సర్ మందుల ధరలు చూసి అమెరికన్ మహిళ షాక్!
New Jersey Indian Grocery Store Parval Sale: కూరగాయల మార్కెట్టే.. ఇక్కడయినా.. అమెరికా అయినా ! మనోళ్లు మారరుగా !
కూరగాయల మార్కెట్టే.. ఇక్కడయినా.. అమెరికా అయినా ! మనోళ్లు మారరుగా ! వీడియో

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget