అన్వేషించండి

Indian Seafarers Killed Oman:హొర్మూజ్ సమీపంలో నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!

Indian Seafarers Killed Oman:ఒమన్‌లో భారత నౌకలపై దాడులు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పలావు జెండా నౌకపై దాడి, ముగ్గురు భారతీయ నావికులు మృతి.
  • ఎంటీ జల్వీస్ నౌక ఇంజిన్‌లో మంటలు; 20 మంది సురక్షితంగా బయటపడ్డారు.
  • భారత ప్రభుత్వం దాడులను ఖండించి, అమెరికాకు తీవ్ర నిరసన తెలిపింది.

Indian Seafarers Killed Oman:నీలి సముద్రం రక్తసిక్తమవుతోంది. పశ్చిమ ఆసియాలో రగులుతున్న ఉద్రిక్తతలు సామాన్య నావికుల ప్రాణాలను హరిస్తున్నాయి. తాజాగా ఒమన్ తీరంలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకలపై జరిగిన దాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. హోర్ముజ్‌ జలసంధి సమీపంలో, ఒమన్ తీరంలోని షినాస్‌ పోర్డు వద్ద రెండు వేర్వేరు ఘటనల్లో భారతీయ నావికులు లక్ష్యంగా దాడులు జరిగాయి. పలావు జెండాతో ప్రయాణిస్తున్న ఎంటీ సెట్టిబెల్లో వాణిజ్య నౌకపై ఒమన్ గల్ఫ్‌ గుండా వెళ్తుండగా దాడి జరిగింది ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఇందులో ముగ్గురు గల్లంతు అయ్యారు. వారిలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

రెండో దాడి ఎంటీ జల్వీస్ నౌకపై జరిగింది. షినాస్ పోర్టు సమీపంలో ఈ నౌకపై దాడి జరిగింది. దీని ఇంజిన్ గదిలో మంటలు చెలరేగడంతో నౌక సముద్రం మధ్యలో తగలబడుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో 20 మంది భారతీయులు ఉన్నారు. 

ఈ దాడులు జూన్ 10-11 తేదీల్లో జరిగాయి. బుధవారం జరిగిన దాడిలో ప్రాణనష్టం జరిగింది. గురువారం జరిగిన ఘటనలో నౌక మంటల్లో చిక్కుకుంది. ఈ దాడుల ఫలితంగా భారత్‌కు చెందిన ముగ్గురు నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని పార్వర్డ్‌ సీమెన్‌ యూనియన్ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. వారు చెప్పిన వివరాలు పరిశీలిస్తే, ఒక చీఫ్ ఇంజనీర్‌, ఇద్దరు నావికులు ఈ దుర్ఘటనలో మరణించారు. మొత్తం 24 మంది సిబ్బందిలో 21 మందిని సురక్షితంగా రక్షించారు. ముగ్గురు గల్లంతయ్యారు. తర్వాత వారిలో ఇద్దరి మృతదేహాలు వెలికి తీశారు. ఇంకో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. మరణించిన వారిలో ఆంధ్రప్రదేశ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారని అధికారులు తెలిపారు. 

ఇరాన్ ఓడరేవులను దిగ్బంధం చేయడానికి అమెరికా చేపట్టిన చర్యల ఫలితంగానే ఇది జరిగి ఉండవచ్చని, బ్రిటిష్ సముద్ర భద్రతా సంస్థ ఎంప్రేర్‌ను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. దాడి జరిగే పక్షంలో, సిబ్బందిని ఓడ వెనుక భాగంలో కాకుండా ముందు భాగంలో ఉండాలని గతంలోనే హెచ్చరించారు.

మూడు రోజుల్లో మూడు నౌకలపై దాడి 

MT జల్వీర్‌పై దాడికి ముందు, గత రెండు రోజులుగా ఒమన్ తీరప్రాంతంపై దాడులు జరుగుతుండగా, నౌకపై ఇది వరుసగా మూడో దాడి. బుధవారం, సెటెబెలో ట్యాంకర్‌పై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. నిరసన తెలియజేయడానికి భారత్, అమెరికా ఛార్జ్ డి అఫైర్స్ జాసన్ మీక్స్‌ను విదేశాంగ మంత్రిత్వ శాఖకు పిలిపించింది. 

భారత్ ప్రభుత్వం ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ  ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నాగరాజ్‌ నాయుడు, అమెరికా చార్జ్‌ డి అఫైర్స్‌ జాసన్ మిక్స్‌ను పిలిపించి అధికారికంగా నిరసన వ్యక్తం చేశారు. ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.                 

Frequently Asked Questions

భారతీయ నావికులను లక్ష్యంగా చేసుకుని దాడులు ఎక్కడ జరిగాయి?

ఒమన్ తీరంలోని షినాస్ పోర్ట్ సమీపంలో, హోర్ముజ్ జలసంధి వద్ద భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకలపై దాడులు జరిగాయి.

ఏ నౌకలపై దాడులు జరిగాయి, అవి ఎప్పుడు సంభవించాయి?

జూన్ 10-11 తేదీలలో పలావు జెండాతో ఉన్న ఎంటీ సెట్టిబెల్లో మరియు ఎంటీ జల్వీస్ అనే రెండు నౌకలపై దాడులు జరిగాయి.

ఈ దాడులలో ఎంతమంది భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు?

ఈ దాడుల ఫలితంగా ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 21 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించారు.

ఈ దాడులపై భారత ప్రభుత్వం ఎలా స్పందించింది?

భారత ప్రభుత్వం ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అమెరికా చార్జ్ డి అఫైర్స్‌కు నిరసన తెలియజేసింది మరియు ఒమన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Akhil Akkineni : తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Double Occupancy OTT : పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Roshan Kanakala : సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?
సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Embed widget