అన్వేషించండి

Train Fare Hike: టికెట్ ఛార్జీలు పెంచిన రైల్వేశాఖ.. డిసెంబర్ 26 నుంచి అమల్లోకి కొత్త ఛార్జీలు

Indian Railways hike train fare | భారత్‌లో రైలు ఛార్జీల పెంపు 26 డిసెంబర్ నుండి అమలులోకి వస్తుంది. ఇది సుదూర ప్రయాణాలు చేసే వారిని ప్రభావితం చేస్తుంది.

Train Fare Hike | దేశంలో ప్రతిరోజూ కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఎందుకంటే తక్కువ ధర, అధిక సౌకర్యవంతమైనది. రైల్వేను సామాన్యుల వాహనంగా పరిగణిస్తారు. కానీ రైల్వే శాఖ తమ ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. భారతీయ రైల్వే రైలు ఛార్జీలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది సుదూర ప్రయాణాలు చేసేవారిపై నేరుగా ప్రభావాన్ని చూపుతుంది. రైల్వే ప్రకారం డిసెంబర్ 26 నుండి రైళ్ల ఛార్జీలలో మార్పులు అమలు కానున్నాయి. 

ఈ నిర్ణయం తర్వాత, అనేక మార్గాలలో ప్రయాణాలు గతంలో కంటే ఖరీదైనది కావచ్చు. అయితే, రైల్వే చిన్న దూర ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని 215 కిలోమీటర్ల వరకు జర్నీకి ఛార్జీలు పెంచకూడదని నిర్ణయించింది. అంటే, రోజువారీ ప్రయాణికులకు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ సుదూర ప్రయాణాలు చేసే వారి ఖర్చు పెరుగుతుంది.  కానీ కొంతలో కొంత ఉపశమనం ఏంటంటే తక్కువ దూరం ప్రయాణం చేసేవారికి ఛార్జీలు పెరగలేదు. సుదూర ప్రయాణాలు చేసేవారికి సైతం నామ మాత్రం ఛార్జీలు పెంచారు.

సుదూర ప్రయాణాలకు ఛార్జీల పెంపు ఎంత?

రైల్వే ఛార్జీల పెంపుపై శాఖ కీలక ప్రకటన చేసింది. ఛార్జీల పెంపు 215 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. సాధారణ కేటగిరీలో ఇప్పుడు ప్రతి కిలోమీటరుకు 1 పైసా అదనంగా చెల్లించాలి. అయితే, మెయిల్, ఎక్స్‌ప్రెస్, ఏసీ కేటగిరీలలో ఈ పెంపు కిలోమీటరుకు 2 పైసలు ఉంటుంది. ఉదాహరణకు 1000 కిలోమీటర్ల ప్రయాణం విషయానికి వస్తే.. ఆ మార్గంలో నాన్-ఏసీ రైలులో ప్రయాణించే ప్రయాణికులు సుమారు 10 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్ ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణించడానికి సుమారు 20 రూపాయలు ఎక్కువగా చెల్లించాలి. మొత్తంగా చూస్తే, ప్రయాణికుల జేబులపై పెద్దగా భారం మోపలేదు. కానీ గతంలో కంటే టికెట్ కోసం కొంచె ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. కానీ స్వల్ప పెరుగుదల కూడా సామాన్యులపై  కొంచెం ప్రభావం చూపుతుంది.

ఈ ప్రయాణికులకు అదనపు ఛార్జీలు ఉండవు

రైల్వే ఛార్జీల పెంపుతో పాటు ప్రయాణికులకు ఉపశమనం కూడా ఇచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం, సాధారణ కేటగిరీలో 215 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వారికి ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరని స్పష్టం చేసింది. ఇది రోజువారీ రైలు ప్రయాణికులకు, చిన్న దూర ప్రయాణికులపై ప్రభావం చూపదు. ఆఫీసు, చదువు కోసం లేదా చిన్న పట్టణాల మధ్య రాకపోకలు చేసేవారిపై టికెట్ ఛార్జీల పెంపు ప్రభావం ఉండదు.

గడిచిన పదేళ్లలో రైల్వే తన నెట్‌వర్క్‌ను, మౌలిక సదుపాయాలను భారీగా విస్తరించింది. మెరుగైన సేవలు అందించడానికి సిబ్బంది సంఖ్యను పెంచాల్సిన అవసరం ఏర్పడింది. సిబ్బంది సంఖ్య పెరగడం వల్ల ఖర్చులు 1,15,000 కోట్ల రూపాయల మేర పెరిగాయి. పెన్షన్ల కోసం చేసే ఖర్చు కూడా 60 వేల కోట్లకు చేరింది. మొత్తంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రైల్వే నిర్వహణ వ్యయం 2,63,000 కోట్లకు చేరుకుంది. ఇటీవల దీపావళి, ఇతర పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే 12,000 కంటే ఎక్కువ ప్రత్యేక రైళ్లను నడిపినట్లు గుర్తు చేసింది.

ఏడాదిలో రెండోసారి ధరల పెంపు
2025లో రైల్వేశాఖ ఛార్జీలను పెంచడం ఇది రెండోసారి. అంతకుముందు జూన్ నెలలో ధరల పెంపు నిర్ణయం తీసుకోగా, జూలై 1, 2025 నుండి అమలులోకి వచ్చాయి. ఆ నిర్ణయం జరిగిన 5 నెలల వ్యవధిలోనే రైల్వే మరోసారి ప్రయాణ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఛార్జీల పెంపు ద్వారా ఈ ఏడాది రైల్వేకు అదనంగా 600 కోట్ల ఆదాయం సమకూరనుంది. కొత్త నిబంధనల ప్రకారం, 500 కిలోమీటర్ల లోపు ప్రయాణించే నాన్-ఏసీ కోచ్ ప్రయాణికులు ఇప్పుడు అదనంగా 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: Indian Railways Legal Action: రైల్వే టికెట్లు, రిజర్వేషన్లపై వ్లాగర్స్ ఇష్టరీతిన వీడియోలు.. చర్యలకు సిద్ధమైన రైల్వే శాఖ

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Embed widget