అన్వేషించండి

Indian Railways: ఎంత పని చేశావ్ సామీ- రూ.35 కోసం ఐదేళ్ల పోరాటం- రైల్వేశాఖకు షాక్!

Indian Railways: రూ.35 కోసం రైల్వేశాఖతో ఐదేళ్లు పోరాటం చేసి విజయం సాధించాడు ఓ సామాన్యుడు.

Indian Railways:  "నాది కానిది కోటి రూపాయలైనా నాకొద్దు- నాది అయినది ఒక్క రూపాయి కూడా వదలను" ఇది ఓ సినిమాలో డైలాగ్. అదేంటి సడెన్‌గా డైలాగ్ చెబుతున్నారు అనుకుంటున్నారా? ఎందుకంటే ఓ వ్యక్తి తన రూ.35 కోసం ఏకంగా ఐదేళ్లు పోరాటం చేశాడు. అది కూడా సాదాసీదా వ్యక్తులతో కాదు ఏకంగా రైల్వేశాఖతో. అవును.. మరి ఆ వ్యక్తి ఏం సాధించాడు తెలుసుకుందాం.

రూ.35 కోసం

రాజస్థాన్‌లోని కోటకు చెందిన సుజీత్‌ స్వామి అనే ఇంజనీర్‌ రూ.35 రిఫండ్‌ కోసం రైల్వే శాఖపై  ఐదేళ్లు పోరాటం చేశాడు. సమాచార హక్కు చట్టం కింద 50 దరఖాస్తులు చేసి చివరికి విజయం సాధించాడు. తనతో పాటు 3 లక్షల మంది రైల్వే ప్రయాణికులకూ ప్రయోజనం కలిగించాడు. వారందరికీ రైల్వే శాఖ రూ.2.43 కోట్లు రిఫండ్‌ చేసేందుకు అంగీకరించింది. 

ఇదీ జరిగింది

2017 ఏప్రిల్‌లో సుజీత్ రైల్వే టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. అదే ఏడాది జూలై 2న కోట నుంచి దిల్లీ వెళ్లేందుకు రిజర్వ్‌ చేశారు. అయితే అంతకుముందు రోజు అంటే జులై 1న జీఎస్టీ అమల్లోకి వచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల ఆయన టికెట్‌(రూ.765)ను రద్దు చేసుకున్నారు. రైల్వే శాఖ క్లరికల్‌ ఛార్జీ కింద రూ.65, సేవా పన్ను కింద రూ.35 మినహాయించుకుని రూ.665 రిఫండ్‌ చేసింది.

తాను జీఎస్టీ రాకముందు టికెట్‌ రిజర్వ్‌ చేసుకున్నానని, అప్పుడు సేవా పన్ను లేనందున రూ.35 రిఫండ్‌ చేయాలని కోరుతూ సుజీత్‌ స్వామి పోరాటం ప్రారంభించారు. సమాచార హక్కు చట్టం కింద 50 దరఖాస్తులు చేయడంతో పాటు నాలుగు ప్రభుత్వ శాఖలకు లేఖలు రాశారు. రిఫండ్‌ చేయాలని కోరుతూ ప్రధాని, రైల్వే మంత్రి, కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, జీఎస్టీ కౌన్సిల్‌కు వరుసగా ట్వీట్లు చేశారు.

రూ.2 కోసం

అయితే ఎట్టకేలకు 2019 మే1న ఆయన పోరాటు ఫలించింది. కానీ రూ. 35 చెల్లించాల్సిన రైల్వేశాఖ ఆయన బ్యాంకు ఖాతాలో రూ.33 మాత్రమే జమ చేసింది. దీంతో మిగిలిన రెండు రూపాయల కోసం స్వామి మరో మూడేళ్లు పోరాడి విజయం సాధించారు. ఆ రెండు రూపాయలను కూడా రైల్వే ఆయన ఖాతాలో జమచేసింది. అంతేకాదు, ఆయన పోరాటంతో మరో 2.98 లక్షల మంది కూడా లబ్ధిపొందారు. జీఎస్టీ అమల్లోకి రావడానికి ముందు టికెట్లు బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకున్న 2.98 లక్షల మందికి కూడా రూ. 35 వెనక్కి ఇచ్చేందుకు రెడీ అయింది. ఇందుకోసం మొత్తంగా రూ. 2.43 కోట్లను రైల్వే రీఫండ్ చేయనుంది. సుజీత్ స్వామి చేసిన ప‌నికి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. స్వామి చేసిన పనికి అధికారులు మాత్రం అవాక్క‌య్యారు. 

Also Read: PMEGP: ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం పొడిగింపు- 40 లక్షల మందికి ఉద్యోగాలు!

Also Read: Jammu Kashmir News: మరో కశ్మీరీ పండిట్ దారుణ హత్య- కుల్గాంలో కాల్చి చంపిన ఉగ్రవాదులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Prabhas Marriage: వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
Golconda Bonalu 2024: ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
Jr NTR: ఎన్టీఆర్ షాకింగ్ డెసిషన్... ఒక్క సినిమా తీసిన దర్శకుడికి ఛాన్స్!
ఎన్టీఆర్ షాకింగ్ డెసిషన్... ఒక్క సినిమా తీసిన దర్శకుడికి ఛాన్స్!
Embed widget