అన్వేషించండి

Petrol Diesel Excise Duty: పెట్రోల్, డీజిల్‌పై లీటర్ కి రూ.10 ట్యాక్స్ తగ్గించిన కేంద్రం.. మనకు రేట్లు తగ్గుతాయా ?

Petrol Excise Duty: పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా ధరలు పెరిగే అవకాశం ఉందని ఈ నిర్నయం తీసుకుంది.

న్యూఢిల్లీ: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వేళ దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉన్నందున, భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. గురువారం విడుదల చేసిన జీవో ప్రకారం, పెట్రోల్ పై అదనపు ఎక్సైజ్ ట్యాక్స్ లీటరుకు రూ.13 నుంచి రూ.3కి తగ్గించారు. డీజిల్ పై ఎక్సైజ్ సుంకం లీటరుకు రూ.10 నుంచి 0కి తగ్గించారు. 

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా..

కేంద్రం చేసిన పన్నుల తగ్గింపు వల్ల సామాన్య వినియోగదారులకు పెట్రోల్ తక్కువ ధరకు లభించే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) పంపు విక్రయాలపై ఎదుర్కొంటున్న భారీ నష్టాలను భర్తీ చేసుకోవడానికి ఈ తగ్గింపును అవే వినియోగించుకునే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతానికి యథాతథంగా ఉండనున్నాయి.

అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 100 అమెరికన్ డాలర్లు దాటాయి. దీనివల్ల ప్రస్తుతం ఓఎంసీలు విక్రయించే ప్రతి లీటరు పెట్రోల్ లేదా డీజిల్‌పై రూ. 48.8 నష్టపోతున్నాయి. రష్యా కంపెనీ రోస్నెఫ్ట్, కేసాని ఎంటర్ప్రైజెస్ మద్దతు ఉన్న దేశీయ అతిపెద్ద ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ నయారా ఎనర్జీ, పెట్రోల్, డీజిల్ ధరలను రూ. 5.3, రూ. 3 పెంచిన తరువాత రోజే ప్రభుత్వం ఈ ఎక్సైజ్ సుంకం తగ్గింపు నిర్ణయం తీసుకుంది. 

ఇరాన్ హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు విధించిన కారణంగా ఏర్పడిన ప్రపంచ ఇంధన సంక్షోభం సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలమార్గం ప్రపంచానికి ఒక ముఖ్యమైన ఇంధన సరఫరా మార్గం. 20 నుండి 25 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురు, దాదాపు 10 బిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్ ఈ మార్గం ద్వారా సరఫరా అవుతుంది. 

ATF పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం అమలు
అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా ఏవియేషన్ టర్బైన్ ఇంధనంపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. కొత్త నిబంధనల ప్రకారం, ATF పై లీటరుకు ₹50 పన్ను నిర్ణయించారు. మినహాయింపు తరువాత, ఎఫెక్టివ్ రేటు లీటరుకు 29.5కి తగ్గించారు. ఇది విమానయాన సంస్థల వ్యయాన్ని పెంచే అవకాశం ఉంది.  

దేశీయ చమురు కంపెనీలకు పెద్ద ఉపశమనం
ప్రభుత్వం పెట్రోల్ పై పన్నును పూర్తిగా తొలగించింది. అయితే డీజిల్ పై లీటరుకు ₹18.5 చొప్పున నిర్ణయించింది. ఎగుమతుల కోసం పెట్రోల్, డీజిల్ , ATF పై అనేక సుంకాల నుండి మినహాయింపు ఇచ్చారు. దీనితో పాటు 2022లో అమలులోకి వచ్చిన విండ్‌ఫాల్ టాక్స్ కూడా రద్దు చేశారు. దీనివల్ల దేశీయ చమురు కంపెనీలకు ఉపశమనం లభిస్తుంది. ఈ మార్పులన్నీ అమలులోకి వచ్చాయి.

కేంద్ర ప్రభుత్వం గురువారం తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. భారత్ వద్ద సుమారు 60 రోజులకు సరిపడా చమురు నిల్వలు, 30 రోజులకు సరిపడా ఎల్‌పీజీ సిలిండర్లు ఉన్నాయని తెలిపింది. కొరత గురించి వస్తున్న నివేదికలను కొట్టిపారేసింది. ముడి చమురు, ఎల్‌పీజీ దిగుమతులను పెంచడానికి ప్రభుత్వం కొత్త ఒప్పందాలను వేగవంతం చేసినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి ఈ వారం పార్లమెంటులో మాట్లాడుతూ, భారత్ లోని మూడు వ్యూహాత్మక నిల్వ కేంద్రాలలో ప్రస్తుతం సుమారు 3.372 మిలియన్ టన్నుల చమురు ఉందని, ఇది వాటి గరిష్ట సామర్థ్యంలో మూడింట రెండు వంతులని తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
Embed widget