అన్వేషించండి

అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు, ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంపై భారత్ ఆందోళన

ఇజ్రాయెల్, హమాస్ వార్ కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలోని డిప్యూటీ శాశ్వత ప్రతినిధి ఆర్ రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్, హమాస్ వార్ కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలోని డిప్యూటీ శాశ్వత ప్రతినిధి ఆర్ రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో బహిరంగ చర్చ సందర్బంగా రవీంద్ర ఈ వ్యాఖ్యలు చేశారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్ లో జరిగిన దాడులు దిగ్బ్రాంతిని కలిగించాయన్న ఆయన, హమాస్  దాడులను తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయెల్ పై ఉగ్రవాదులు చేసిన దాడులను ప్రధాన మంత్రి మోడీ సైతం ఖండించారని గుర్తు చేశారు. 

38 టన్నుల విపత్తు సహాయక సామాగ్రి
గాజా స్ట్రిప్ లోని ప్రజలకు మానవతా సాయం చేయడంలో ఇండియా కూడా ముందుందన్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం ముగిసేలా ప్రపంచ దేశాలు పాటు ఆర్ రవీంద్ర కోరారు. ఇజ్రాయెల్ కు భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని, ఆరోగ్యం, టెక్నాలజీ రంగాల్లో రెండు దేశాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తున్నాయని గుర్తు చేశారు. గాజాలో బాధితుల కోసం 6.5 టన్నుల వైద్య, 38 టన్నుల విపత్తు సహాయక సామగ్రిని భారత్‌ పంపిందన్నారు యుఎన్ లోని భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి ఆర్ రవీంద్ర. భారత వాయుసేనకు చెందిన సీ-17 విమానం వాటిని ఈజిప్టులోని ఎల్‌-అరిష్‌ విమానాశ్రయానికి చేర్చిందని, అక్కడి నుంచి గాజా స్ట్రిప్ లోని ప్రజలకు అందిస్తోందన్నారు. ఇందులో ప్రాణాధార ఔషధాలు, శస్త్రచికిత్స పరికరాలు, టెంట్లు, స్లీపింగ్‌ బ్యాగులు, టార్పాలిన్స్‌, శానిటరీ వస్తువులు, నీటిని శుద్ధి చేసే ట్యాబ్లెట్లు ఉన్నాయన్నారు.

ఆస్పత్రుల్లో కమ్ముకున్న చీకట్లు
మరోవైపు ఇజ్రాయెల్‌ సైన్యం గాజా నగరంపై బాంబుల వర్షం కురిపిస్తోంది. రెండు వారాలకు పైగా కొనసాగుతున్న బాంబుదాడుల్లో పాలస్తీనాలో చిన్నారులు, మహిళలతో పాటు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. గాజా స్ట్రిప్‌లో పరిస్థితులు అత్యంత దయనీయంగా తయారయ్యాయి. విద్యుత్ సరఫరా కారణంగా వందల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. వివిధ ఆస్పత్రుల్లోని ఇంక్యుబేటర్లలో ఉన్న శిశువుల ఆరోగ్యంపై ఎన్‌ఐసీయూ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంక్యుబేటర్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే నిమిషాల వ్యవధిలోనే అనేక మంది శిశువులు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని  ఆవేదన చెందుతున్నారు. అత్యంత సంక్లిష్టమైన ఈ విభాగానికి అవసరమైన వైద్య సామగ్రిని పంపించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే భారీ విపత్తు ఎదురవుతుందని గాజా నగరంలోని అల్-షిఫా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. గాజాస్ట్రిప్‌ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ ఇంక్యుబేటర్లలో మొత్తంగా 130 మంది శిశువులు ఉన్నారు. ఒకవేళ విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే ఇంక్యుబేటర్లలో ఉన్న 55 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు.   

యుద్దానికి విరామమిస్తే హమాస్ కే లాభమన్న అమెరికా
యుద్ధాన్ని ఆపి వేయాలంటూ యూరోపియన్ యూనియన్ పిలుపును అమెరికా వ్యతిరేకించింది. యుద్ధానికి విరామం ఇవ్వడం వల్ల హమాస్‌కే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని హెచ్చరించింది. యుద్ధాన్ని ఆపడం వల్ల హమాస్‌కి విరామం లభిస్తుందని, బలం పుంజుకొని తిరిగి ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు అవకాశం లభిస్తుందని స్పష్టం చేసింది. దారుణమైన ఉగ్రదాడుల్ని ఎదుర్కొంటోన్న ఇజ్రాయెల్‌ యుద్ధాన్ని ఆపలేని పరిస్థితిలో ఉందన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections 2026: రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
Visa Interview Tips : వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలా? ముందుగానే ఇలా ప్రిపేర్ అవ్వండి, వీసా రిజెక్ట్ కాదు
వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలా? ముందుగానే ఇలా ప్రిపేర్ అవ్వండి, వీసా రిజెక్ట్ కాదు
Hard Rock Cafe Close: రాక్ అండ్ రోల్ థీమ్‌ రెస్టారెంట్స్‌కు గడ్డు కాలం - భారతదేశంలో మూతపడిన హార్డ్ రాక్ కేఫ్‌లు
రాక్ అండ్ రోల్ థీమ్‌ రెస్టారెంట్స్‌కు గడ్డు కాలం - భారతదేశంలో మూతపడిన హార్డ్ రాక్ కేఫ్‌లు
Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?
Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Tamil Nadu Assembly Elections 2026: రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Iran War Effect On Vijayawada Hotels: విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
Embed widget