అన్వేషించండి

Gujarat Cable Bridge: కేబుల్ బ్రిడ్జి ప్రమాదంలో 60 మందికిపైగా మృతి! అమాంతం నదిలో పడిపోయిన వందలాది మంది

Morbi Cable Bridge వంతెన కూలడంతో వందలాది మంది నదిలో మునిగిపోయారు. ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు వైర్లకు వేలాడారు.

Gujarat News: మోర్బీలో పెను విషాదం వెలుగు చూసింది. మోర్బిలో మచ్చు నదిపై నిర్మించిన వేలాడే వంతెన కూలిపోవడంతో వందల మంది నదిలో అమాంతం పడిపోయారు. ఈ ప్రమాదంలో 60 మందికి పైగా మరణించారని స్థానిక బీజేపీ నేత కాంతి అమృతయ్య తెలిపారు. చనిపోయిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం సమయంలో 300 నుంచి 400 వరకూ సందర్శకులు వంతెనపై ఉన్నట్లు సమాచారం. వంతెన కూలడంతో వందలాది మంది నదిలో మునిగిపోయారు. ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు వైర్లకు వేలాడారు. 60 మందికి పైగా చనిపోయిన విషయాన్ని బీజేపీ ఎంపీ మోహన్ భాయ్ కల్యాణ్ జీ కుండరీయ కూడా ప్రకటించారు.

ఈ దుర్ఘటన గురించి ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. ప్రమాదం జరిగినప్పుడు వంతెనపై చాలా మంది మహిళలు, పిల్లలు ఉన్నారని చెప్పారు. దాదాపు 100 మంది నదిలో గల్లంతైనట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం అంబులెన్స్‌లు ఒకదాని తర్వాత ఒకటి ఘటనా స్థలానికి చేరుకుంటున్నాయి. 

పాత వీడియోలు వైరల్

నదిపై వంతెన కుప్పకూలడంతో దానిపై భారీగా జనం ఉన్న పాత వీడియోలు ట్విటర్ లో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో కొంత మంది యువత ఎగిరి గెంతుతుండడం కనిపిస్తోంది. అందరూ మూకుమ్మడిగా వేలాడే వంతెనపై గంతులు వేస్తుండడంతో తీగల వంతెన భారీగా ఊగుతోంది. కొందరు ఆ వీడియోలను పోస్ట్ చేసి, ఉద్దేశపూర్వకంగానే వంతెనను దెబ్బతినేలా చేశారని విమర్శలు చేశారు. 

తాము రెస్క్యూ పనులు దగ్గరుండి చూసుకుంటున్నామని గుజరాత్ మంత్రి ABP News తో అన్నారు. ఈ ప్రమాదంపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ట్వీటర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. "మోర్బిలో కేబుల్ బ్రిడ్జి కూలిన ప్రమాదంతో నాకు చాలా బాధ కలిగింది. ప్రభుత్వం నుంచి సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారికి తక్షణ చికిత్స కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించాను. ఈ విషయంలో నేను అధికారులతో నిరంతరం టచ్‌లో ఉన్నాను.’’ అని ట్వీట్ చేశారు.

గుజరాత్ సీఎంకు ప్రధాని మోదీ ఫోన్

మోర్బీ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ సీఎంతో మాట్లాడారు. సహాయక చర్యల కోసం తక్షణమే బృందాలను సమీకరించాలని ఆయన ఆదేశించారు. పరిస్థితిని నిశితంగా, నిరంతరం పర్యవేక్షించాలని.. బాధిత ప్రజలకు అన్ని విధాలుగా సహాయం అందించాలని ప్రధాని కోరారు. దీనితో పాటు, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి ప్రధాన మంత్రి సహాయ నిధి (PMNRF) నుండి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ ఠాకూర్ కూడా మోర్బీ బ్రిడ్జి దుర్ఘటనపై ట్వీటర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. మోర్బీలో ఒక సస్పెన్షన్ వంతెన కూలిపోయిందన్న వార్త విని షాక్ అయ్యానని అన్నారు. ‘‘ఈ ఘటనలో 400 మందికి పైగా బాధితులు ఉన్నారు. మోర్బి చుట్టుపక్కల ప్రాంత కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులందరూ త్వరగా సహాయ చర్యల్లో పాల్గొని ప్రజలకు సహాయం చేయాలని వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’’ అని జగదీష్ ఠాకూర్ ట్వీట్ చేశారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంతాపం

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ‘‘గుజరాత్ నుండి చాలా విచారకరమైన వార్త వచ్చింది. మోర్బిలో వంతెన కూలిపోవడంతో చాలా మంది నదిలో పడిపోయినట్లు సమాచారం. వారి జీవితం, ఆరోగ్యం కోసం నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABPCM Revanth Reddy on PM Modi | రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్న రేవంత్ రెడ్డి | ABPPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం గుండె చప్పుడు ఏంటీ..? | ABP DesamPithapuram MLA Candidate Tamanna Simhadri | పవన్ పై పోటీకి ట్రాన్స్ జెండర్ తమన్నాను దింపింది ఎవరు.?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
Embed widget