అన్వేషించండి

G20 Summit 2023: సర్వాంగ సుందరంగా ఢిల్లీ, G-20 సదస్సు ఆహ్వానితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

G20 Summit 2023: జీ-20 సదస్సును భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సమావేశాలకు వచ్చే ప్రముఖులకు అతిథి మర్యాదలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.  

G20 Summit 2023: జీ-20 సదస్సును భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సమావేశాలకు వచ్చే ప్రముఖులకు అతిథి మర్యాదలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.  ప్రపంచ దేశాధినేతలకు చక్కటి ఆతిథ్యం ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. వారి కోసం దేశ రాజధాని ఢిల్లీలో ప్రముఖ హోటళ్లను ఇప్పటికే బుక్‌ చేశారు. సదస్సుకు వచ్చే ప్రతినిధులకు వారికి భారత వంటలను రుచి చూపించేందుకు, భారత ఆతిథ్యాన్ని పరిచయం చేసేలా హోటళ్ల నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. 

అతిథులకు స్వాగతం పలకడం దగ్గర నుంచి వారికి బస, వంటకాల ఏర్పాట్లపై హోటల్లు ప్రత్యేక దృష్టి పెట్టాయి. అతిథులను మెప్పించేందుకు హోటళ్లను రంగుల పూలతో అందంగా అలంకరిస్తున్నాయి. వారికి ఏమాత్రం లోటు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అతిథులకు విదేశీ వంటకాలతో పాటు భారత రుచులను పరిచయం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తాజ్‌ హోటల్‌ నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ దేశాధినేతలు బస చేసే గదులను పోలీసులు, భద్రతా సిబ్బంది ఇప్పటికే తనిఖీ చేశారని చెప్పారు. 

జీ-20 అతిథులకు అంతర్జాతీయ వంటకాలతో సహా 250కి పైగా రుచికరమైన వంటకాలను అందించాలని లలిత్‌ హోటల్‌ ప్రణాళిక చేస్తోంది. తృణధాన్యాల ఆధారిత వంటకాలను కూడా తయారు చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బై డెన్ ,  బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ సహా 24  దేశాధినేతలు సమావేశాలకు హాజరుకానున్న నేపథ్యంలో ఆతిథ్యానికి ఎటువంటి వంటి లోటు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే అతిథులు బస చేస్తున్న హోటళ్ల వద్ద కఠిన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.  

అమెరికా అధ్యక్షుడు జోబైడన్‌కు ఐటీసీ మౌర్యలో బస ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆయా దేశాల ఇంటలిజెన్స్ సంస్థల అధికారులు ఢిల్లీకి చేరుకొని తమ అధినేతల  రాకపోకల ఏర్పాటు చేసుకుంటున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ జి 20 శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావడం లేదు. ఈ రెండు దేశాల అధ్యక్షులు హాజరు కాకపోవడం వెనుక కారణాలపై  రకరకాల చర్చలు జరుగుతున్నాయి.  జీ-20 సదస్సుకు సంబంధించిన ఢిల్లీలోని కీలకమైన వేదికలు, ఇతర ప్రాంతాల వద్ద సన్నద్ధతను ఆదివారం కొందరు ప్రభుత్వ ప్రతినిధులు పరిశీలించారు. ఆ బృందంలో ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాతో పాటు ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పీకే మిశ్ర ఉన్నారు. 

సర్వాంగ సుందరంగా ఢిల్లీ 
జీ 20 సదస్సుకు ఢిల్లీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రోడ్లకు ఇరువైపులా ల్యాండ్ స్కేపింగ్ చేసి చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జి20 సదస్సు జరిగే భారత మండపం వరకు పరిసరాలన్నిటిని అలంకరించారు. రోడ్లకు ఇరువైపులా జీ 20 దేశాల జెండాలు నిలబెట్టారు. భారతదేశ కళావైభవ చిహ్నాలు అన్నిటిని రోడ్ల ముఖ్య కూడలిలో అందంగా అమర్చారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కళారూపాల ఫ్లెక్సీలను విమానాశ్రయం వద్ద ప్రదర్శనగా పెట్టారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఈ డెకరేషన్స్  చేశారు. 

ఆ మూడు రోజులు ఢిల్లీ లాక్ డౌన్ ?
సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో ఢిల్లీ అనధికారిక లాక్ డౌన్ లోకి వెళ్లబోతోంది. ఢిల్లీకి వచ్చే దాదాపు 100కు పైగా రైళ్లను ఈ మూడు రోజుల్లో రద్దు చేశారు. అలాగే విమాన రాకపోకలు సైతం రద్దు చేశారు. సెంట్రల్ ఢిల్లీని పూర్తిగా శత్రు దుర్భేద్యంగా మార్చేశారు. కేవలం సెంట్రల్ ఢిల్లీలో నివసించేవారు మినహా మిగిలిన వారెవరిని సెంట్రల్ ఢిల్లీలోకి అనుమతించడం లేదు. దేశాధినేతల వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకే ఈ మూడు రోజులపాటు ఆంక్షలు విధించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rana Final Video: భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
FASTag Annual Pass Fees: వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Board Exams Cancel: వార్ ఎఫెక్ట్.. ఖతార్, యుఏఈ సహా గల్ఫ్ దేశాలలో CBSE 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు
వార్ ఎఫెక్ట్.. ఖతార్, యుఏఈ సహా గల్ఫ్ దేశాలలో CBSE 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget