అన్వేషించండి

Bharat Nyaya Jodo Yatra: ముగిసిన భార‌త్ జోడో న్యాయ యాత్ర‌- కాంగ్రెస్ పుంజుకున్న‌ట్టేనా?

కాంగ్రెస్‌పార్టీ అగ్ర‌నేత‌ రాహుల్ గాంధీప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన భార‌త్ జోడో న్యాయ యాత్ర ముగిసింది. వ‌చ్చేపార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఈ యాత్ర ఏమేర‌కు ప్ర‌భావం చూపిస్తుంద‌నేది ప్ర‌ధానచ‌ర్చ‌గా మారింది.

Bharat Nyaya Jodo Yatra: కాంగ్రెస్(Congress) పార్టీ అగ్ర‌నేత, వ‌య‌నాడ్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేప‌ట్టిన `భార‌త్ జోడో న్యాయ యాత్ర‌`(Bharth Jodo Nyay Yatra) ఆదివారం ముగిసింది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ నుంచి ఈ ఏడాది జ‌న‌వ‌రి(January-2024) 14న‌ ప్రారంభమైన ఈ యాత్ర 6,700 కిలోమీటర్ల మేర సాగింది. ఆదివారం మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలోని శివాజీ పార్క్ వద్ద రాహుల్‌ గాంధీ ముగింపు పలికారు. వాస్త‌వానికి గ‌త ఏడాది 2023లోనే తొలి ద‌శ యాత్ర‌ను చేప‌ట్టిన రాహుల్ గాంధీ.. భార‌త్ జోడో పేరుతో యాత్ర‌ను ప్రారంభించారు. అప్ప‌ట్లో ఏపీ, తెలంగాణ‌ల మీదుగా కూడా ఈ యాత్ర సాగింది. అయితే.. రెండో ద‌శ‌లో మాత్రం ఉత్త‌రాది, ఈశాన్య రాష్ట్రాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ముందుకు సాగారు. 

Image

ఇదీ ల‌క్ష్యం.. 

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ(PM Narendra Modi) స‌ర్కారుపై యుద్ధం ప్ర‌క‌టించిన రాహుల్ గాంధీ.. ప్రధాని త‌న మ‌న‌సులోని భావాల‌నే ప్ర‌జ‌ల‌కు పంచుతున్నార‌ని, ప్ర‌జ‌ల మాట‌ల‌ను వినిపించుకోవ‌డం లేద‌ని ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే.ఈ  క్ర‌మంలో అణ‌గారిన వ‌ర్గాల వారి మాట వింటాన‌ని ఆయ‌న రోడ్డెక్కారు. ఈ క్ర‌మంలోనే మ‌ణిపూర్‌లో ఆయ‌న రెండో ద‌శ యాత్ర ప్రారంభ‌మైంది. ఘర్షణలతో అట్టుడికిపోతున్న కల్లోల మణిపూర్‌ రాష్ట్రానికి శాంతి, సామరస్యం తిరిగి తీసుకొస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. మణిపూర్‌లోని థౌబాల్‌ నుంచి ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’కు జ‌న‌వ‌రి 14న ఆయన శ్రీకారం చుట్టారు. తొలుత ఖోంగ్‌జామ్‌ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. మోడీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దృష్టిలో మణిపూర్‌(Manipur) రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం కాకపోవచ్చని ఆక్షేపించారు. ‘‘మీ బాధను వారి బాధగా భావించడం లేదు. కానీ మీ దుఃఖాన్ని, మీకు తగిలిన గాయాలు, మీరెదుర్కొంటున్న విచారాన్ని మేం అర్థం చేసుకున్నాం’’ అని చెప్పారు.

Image

బాధితులు ఆప్యాయతను కోరుకుంటున్నారని రాహుల్‌ అన్నారు. అంతేకాదు.. దేశంలో అన్యాయ కాలం కొనసాగుతున్నందు వల్లే న్యాయ యాత్ర చేపట్టాల్సి వచ్చిందని రాహుల్‌ పేర్కొన్నారు. ప్రజలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్యాయాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలను ఏకం చేయాలన్నదే ఈ యాత్ర ఉద్దేశమని వివరించారు. సమానత్వం, సౌభ్రాతృత్వం, సామరస్యంతో కూడిన ‘న్యూ విజన్‌ ఆఫ్‌ ఇండియా’ను సాధించడం ధ్యేయమని స్పష్టం చేశారు. 

Image

యాత్ర సాగుతున్న‌ప్పుడే.. 

రాహుల్ చేప‌ట్టిన యాత్ర సాగుతున్న‌ప్పుడే ఇండియా కూట‌మి బీట‌లు వారింది. రాహుల్ గాంధీ న్యాయ‌ యాత్ర మిత్రపక్షాల మద్దతు కోసం చాలా కాలంగా వేచి చూసింది. రాహుల్ పశ్చిమ బెంగాల్ చేరుకున్నప్పుడు సీఎం మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు. యాత్రకు దూరంగా ఉన్నారు. అంతేకాదు.. యాత్ర‌కు తొలుత అనుమ‌తులు కూడా ఇవ్వ‌లేదు. ఇక‌, యాత్ర బెంగాల్‌ నుంచి బిహార్‌కు చేరుకోగానే నితీష్‌ కుమార్ ఇండియా కూటమి మారి మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రాహుల్ బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్లినప్పుడు, అఖిలేష్ యాదవ్ రాహుల్ యాత్రలో పాల్గొంటారనే గ్యారెంటీ లేదు. పార్ల‌మెంటు సీట్ల పంపకం పూర్తయిన తర్వాతే తాను భారత్ జోడో న్యాయ యాత్రలో చేరతానని అఖిలేష్ యాదవ్ స్వయంగా ప్రకటించారు. ఇలా..  అనేక త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లతో మిత్ర ప‌క్షాల అసంతృప్తి స్వ‌రాల‌తోనే యాత్ర ముందుకు సాగింది.  

Image

ముగిసిన యాత్ర 

తాజాగా ఆదివారం భార‌త జోడో న్యాయ యాత్ర ముంబైలో ముగిసింది. కాంగ్రెస్‌ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, ఉద్ధవ్ ఠాక్రే త‌దితరులు చివ‌రి రోజు యాత్ర‌లో పాల్గొన్నారు. కాగా... జనవరి 14న మణిపూర్‌లోని తౌబాల్‌ జిల్లా నుంచి ప్రారంభమైన ఈ యాత్ర `న్యాయం కోసం పోరాటం` నినాదంతో సాగింది. మొత్తంగా ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో 100 లోక్‌సభ నియోజవర్గాల మీదుగా కొనసాగింది. 110 జిల్లాల మీదుగా సాగిన ఈ యాత్రకు కొన్ని చోట్ల విశేష స్పంద‌న రాగా.. మ‌రికొన్ని చోట్ల పెద్ద‌గా రియాక్ష‌న్ రాలేదు. ఇక‌, అసోంలో బీజేపీ ప్ర‌భుత్వం రాహుల్‌పై కేసులు న‌మోదు చేయ‌డం, సీఎం హిమంత బిశ్వ‌శ‌ర్మ హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. 

Image

పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం ఎంత‌?

రాహుల్ గాంధీ చేపట్టిన భార‌త్ జోడో న్యాయ యాత్ర పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌పై ఏమేర‌కు ప్ర‌భావం చూపిస్తుంద‌నేది ప్ర‌స్తుతానికి ప్ర‌శ్నార్థ‌క‌మే. ఎందుకంటే యాత్ర సాగుతున్న స‌మ‌యంలోనే కీల‌క నేత‌లు పార్టీకి దూర‌మ‌య్యారు. మ‌హారాష్ట్ర‌లోనే సీనియ‌ర్లు పార్టీని వీడారు. మ‌రోవైపు మోడీ ప్ర‌భావాన్ని స‌రైన విధంగా ఎదుర్కొనే ప‌టిమ కూడా క‌న‌బ‌ర‌చ‌లేక పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో యాత్ర తాలూకు ప్ర‌భావం పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌పై పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 

Image

Image

Image

Image

Image

ImageImageImageImage

 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
యమహా R2 నుంచి ఎలక్ట్రిక్‌ ఏరోక్స్‌ వరకు - 2026లో లాంచ్‌ కానున్న యమహా బైక్స్‌, స్కూటర్లు ఇవే
2026లో య'మహా' ప్లాన్‌ - రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, కొత్త R2 స్పోర్ట్‌ బైక్‌ రెడీ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget