అన్వేషించండి

Odisha Train Derails: ఒడిశాలో మరో రైలు ప్రమాదం, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు- ఘటనాస్థలానికి రైల్వే అధికారులు

ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది. రాయగడ జిల్లా అంబడోలా సమీపంలో శనివారం గూడ్స్ రైలు నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పాయి.

Goods Train Derails In Odisha's Rayagada: ఇటీవల ఘోర రైలు ప్రమాదం జరిగిన ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది. రాయగడ జిల్లా అంబడోలా సమీపంలో శనివారం గూడ్స్ రైలు నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ నెల తొలి వారంలో ఘోర రైలు విషాదం తరువాత ఒడిశాలోనే మరోచోట రైలు ప్రమాదం జరిగింది. తాజాగా గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. వరుస రైలు ప్రమాదాలతో అధికారులతో పాటు ప్రయాణికులు సైతం ఆందోళన చెందుతున్నారు.

కలహండిలోని అంబడోలా నుండి లాంజిగఢ్‌ లోని వేదాంత ప్లాంట్‌కు వెళ్తుండగా గూడ్స్ రైలు పట్టాలు తప్పినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గూడ్స్ రైలు ప్రత్యేక ట్రాక్‌పై పట్టాలు తప్పినందున రైలు సర్వీసులకు ఎలాంటి ఆటంకం కలగలేదు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిచారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.

రెండు వారాల కిందట మూడు రైళ్ల ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బిహార్‌కు చెందిన ఓ ప్రయాణికుడు చనిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి CB మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడంతో మరణాల సంఖ్య 291 కి పెరిగింది. బిహార్‌లోని భాగల్‌పూర్ జిల్లా రోషన్‌పూర్‌కు చెందిన సాహిల్ మన్సూర్ (32)గా చనిపోయిన ప్రయాణికుడిగా గుర్తించారు. ట్రామా కేర్ ఐసియులో చికిత్స పొందిన సాహిల్.. కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. అతనికి డయాలసిస్ కూడా చేసినట్లు అధికారులు తెలిపారు. చివరగా కార్డియాక్ అరెస్ట్ కావడంతో పేషెంట్ మరణించాడని SCB మెడికల్ కాలేజీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాన్సు శేఖర్ మిశ్రా తెలిపారు. గాయాలతో పాటు అంతకుముందే అనారోగ్య సమస్యలతో అతడు కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోయాడని చెప్పారు.

SCB మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరిన 205 మందిలో 46 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. వీరిలో 13 మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్నారని పేర్కొన్నారు. ఇద్దరు, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలోని పత్రా గ్రామానికి చెందిన ప్రకాష్ రామ్ (22) అనే వలస కార్మికుడు శుక్రవారం ఇదే ఆసుపత్రిలో మరణించాడు.

జూన్ తొలివారం ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ప్రమాదానికి గురైన ఘటనలో 291 మంది మృతి చెందగా, 1,100 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మొదట కోల్ కతా నుంచి చెన్నైకి వెళ్తున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి గూడ్స్ రైలు ఉన్న లూప్ లోకి వెళ్లి ఢీకొంది. నాలుగైదు బోగీలు పట్టాలు తప్పాయి. మరికొద్ది సేపటికే యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ ఈ రైలును ఢీకొనడంతో కొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. ఈ విషాదంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోగా, మరికొన్ని కుటుంబాలు చనిపోయిన వారి డెడ్ బాడీని సైతం గుర్తించలేకపోవడం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చనిపోయిన ప్రయాణికుల కుటుంబసభ్యులకు పరిహారం ప్రకటించాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandrababu at Davos: ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు యూఏఈ నిర్ణయం.. దావోస్‌లో సీఎం చంద్రబాబు
ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు యూఏఈ నిర్ణయం.. దావోస్‌లో సీఎం చంద్రబాబు
BJP నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారానికి ముందు సందర్శించిన ఆలయాలు ఇవి! వీటి ప్రత్యేకత ఏంటో తెలుసుకోండి
BJP నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారానికి ముందు సందర్శించిన ఆలయాలు ఇవి! వీటి ప్రత్యేకత ఏంటో తెలుసుకోండి
Venkatesh Trivikram Movie : దగ్గుబాటి హీరో సినిమాలో నారా వారి అతిథి పాత్ర... త్రివిక్రమ్ మార్క్ టచ్?
దగ్గుబాటి హీరో సినిమాలో నారా వారి అతిథి పాత్ర... త్రివిక్రమ్ మార్క్ టచ్?
IBPS RRB Clerk Result 2025: ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి

వీడియోలు

WPL 2026 RCB vs GG | ఆర్‌సీబీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు
Sunil Gavaskar Comments on Team India | టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
Simon Doule about Rohit Sharma | రోహిత్ పై కివీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్
Shubman Gill, Jadeja in Ranji Trophy | రంజీ ట్రోఫీలో ఆడనున్న గిల్, జడేజా
Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu at Davos: ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు యూఏఈ నిర్ణయం.. దావోస్‌లో సీఎం చంద్రబాబు
ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు యూఏఈ నిర్ణయం.. దావోస్‌లో సీఎం చంద్రబాబు
BJP నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారానికి ముందు సందర్శించిన ఆలయాలు ఇవి! వీటి ప్రత్యేకత ఏంటో తెలుసుకోండి
BJP నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారానికి ముందు సందర్శించిన ఆలయాలు ఇవి! వీటి ప్రత్యేకత ఏంటో తెలుసుకోండి
Venkatesh Trivikram Movie : దగ్గుబాటి హీరో సినిమాలో నారా వారి అతిథి పాత్ర... త్రివిక్రమ్ మార్క్ టచ్?
దగ్గుబాటి హీరో సినిమాలో నారా వారి అతిథి పాత్ర... త్రివిక్రమ్ మార్క్ టచ్?
IBPS RRB Clerk Result 2025: ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
Movie Ticket Rates : సినిమా టికెట్ ధరల పెంపు - తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సినిమా టికెట్ ధరల పెంపు - తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
US President Donald Trump :
"గ్రీన్లాండ్‌ ఇక అమెరికాదే" డొనాల్డ్ ట్రంప్‌ సోషల్ మీడియా పోస్టులు, నాటో మిత్రులపై విమర్శలు!
Adilabad Waterfalls: ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల జలపాతానికి గుర్తింపు, 100 వీకెండ్ వండర్స్ పోటీలో బహుమతి
ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల జలపాతానికి గుర్తింపు, 100 వీకెండ్ వండర్స్ పోటీలో బహుమతి
Citroen Basalt లేదా Kia Sonet ఫీచర్ల పరంగా ఏ SUV బెస్ట్.. మీకు ఏది మంచిది
Citroen Basalt లేదా Kia Sonet ఫీచర్ల పరంగా ఏ SUV బెస్ట్.. మీకు ఏది మంచిది
Embed widget