అన్వేషించండి

Odisha Train Derails: ఒడిశాలో మరో రైలు ప్రమాదం, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు- ఘటనాస్థలానికి రైల్వే అధికారులు

ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది. రాయగడ జిల్లా అంబడోలా సమీపంలో శనివారం గూడ్స్ రైలు నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పాయి.

Goods Train Derails In Odisha's Rayagada: ఇటీవల ఘోర రైలు ప్రమాదం జరిగిన ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది. రాయగడ జిల్లా అంబడోలా సమీపంలో శనివారం గూడ్స్ రైలు నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ నెల తొలి వారంలో ఘోర రైలు విషాదం తరువాత ఒడిశాలోనే మరోచోట రైలు ప్రమాదం జరిగింది. తాజాగా గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. వరుస రైలు ప్రమాదాలతో అధికారులతో పాటు ప్రయాణికులు సైతం ఆందోళన చెందుతున్నారు.

కలహండిలోని అంబడోలా నుండి లాంజిగఢ్‌ లోని వేదాంత ప్లాంట్‌కు వెళ్తుండగా గూడ్స్ రైలు పట్టాలు తప్పినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గూడ్స్ రైలు ప్రత్యేక ట్రాక్‌పై పట్టాలు తప్పినందున రైలు సర్వీసులకు ఎలాంటి ఆటంకం కలగలేదు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిచారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.

రెండు వారాల కిందట మూడు రైళ్ల ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బిహార్‌కు చెందిన ఓ ప్రయాణికుడు చనిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి CB మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడంతో మరణాల సంఖ్య 291 కి పెరిగింది. బిహార్‌లోని భాగల్‌పూర్ జిల్లా రోషన్‌పూర్‌కు చెందిన సాహిల్ మన్సూర్ (32)గా చనిపోయిన ప్రయాణికుడిగా గుర్తించారు. ట్రామా కేర్ ఐసియులో చికిత్స పొందిన సాహిల్.. కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. అతనికి డయాలసిస్ కూడా చేసినట్లు అధికారులు తెలిపారు. చివరగా కార్డియాక్ అరెస్ట్ కావడంతో పేషెంట్ మరణించాడని SCB మెడికల్ కాలేజీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాన్సు శేఖర్ మిశ్రా తెలిపారు. గాయాలతో పాటు అంతకుముందే అనారోగ్య సమస్యలతో అతడు కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోయాడని చెప్పారు.

SCB మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరిన 205 మందిలో 46 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. వీరిలో 13 మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్నారని పేర్కొన్నారు. ఇద్దరు, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలోని పత్రా గ్రామానికి చెందిన ప్రకాష్ రామ్ (22) అనే వలస కార్మికుడు శుక్రవారం ఇదే ఆసుపత్రిలో మరణించాడు.

జూన్ తొలివారం ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ప్రమాదానికి గురైన ఘటనలో 291 మంది మృతి చెందగా, 1,100 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మొదట కోల్ కతా నుంచి చెన్నైకి వెళ్తున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి గూడ్స్ రైలు ఉన్న లూప్ లోకి వెళ్లి ఢీకొంది. నాలుగైదు బోగీలు పట్టాలు తప్పాయి. మరికొద్ది సేపటికే యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ ఈ రైలును ఢీకొనడంతో కొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. ఈ విషాదంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోగా, మరికొన్ని కుటుంబాలు చనిపోయిన వారి డెడ్ బాడీని సైతం గుర్తించలేకపోవడం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చనిపోయిన ప్రయాణికుల కుటుంబసభ్యులకు పరిహారం ప్రకటించాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
Sarpanches Chalo Assembly: అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
The Raja Saab Pre Release Event : విలన్ల చెంప పగలగొట్టారు - 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై RGV రియాక్షన్
విలన్ల చెంప పగలగొట్టారు - 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై RGV రియాక్షన్

వీడియోలు

BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Yashasvi Jaiswal about Rohit Sharma | జైస్వాల్‌ డెబ్యూపై రోహిత్ మాస్టర్ ప్లాన్
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
Sarpanches Chalo Assembly: అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
The Raja Saab Pre Release Event : విలన్ల చెంప పగలగొట్టారు - 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై RGV రియాక్షన్
విలన్ల చెంప పగలగొట్టారు - 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై RGV రియాక్షన్
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Sankranti 2026 Movies Telugu: హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
Rohit Sharma Records: ఈ ఏడాది 50 రికార్డులు నెలకొల్పిన రోహిత్ శర్మ.. దిగ్గజాలను వెనక్కి నెట్టిన హిట్ మ్యాన్
ఈ ఏడాది 50 రికార్డులు నెలకొల్పిన రోహిత్ శర్మ.. దిగ్గజాలను వెనక్కి నెట్టిన హిట్ మ్యాన్
Rule Changes From 1st January: పాన్- ఆధార్ అనుసంధానం నుంచి ఎల్పీజీ వరకు.. జనవరి నుంచి అమలులోకి కొత్త రూల్స్!
పాన్- ఆధార్ అనుసంధానం నుంచి ఎల్పీజీ వరకు.. జనవరి నుంచి అమలులోకి కొత్త రూల్స్!
Embed widget