అన్వేషించండి

Odisha Train Derails: ఒడిశాలో మరో రైలు ప్రమాదం, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు- ఘటనాస్థలానికి రైల్వే అధికారులు

ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది. రాయగడ జిల్లా అంబడోలా సమీపంలో శనివారం గూడ్స్ రైలు నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పాయి.

Goods Train Derails In Odisha's Rayagada: ఇటీవల ఘోర రైలు ప్రమాదం జరిగిన ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది. రాయగడ జిల్లా అంబడోలా సమీపంలో శనివారం గూడ్స్ రైలు నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ నెల తొలి వారంలో ఘోర రైలు విషాదం తరువాత ఒడిశాలోనే మరోచోట రైలు ప్రమాదం జరిగింది. తాజాగా గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. వరుస రైలు ప్రమాదాలతో అధికారులతో పాటు ప్రయాణికులు సైతం ఆందోళన చెందుతున్నారు.

కలహండిలోని అంబడోలా నుండి లాంజిగఢ్‌ లోని వేదాంత ప్లాంట్‌కు వెళ్తుండగా గూడ్స్ రైలు పట్టాలు తప్పినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గూడ్స్ రైలు ప్రత్యేక ట్రాక్‌పై పట్టాలు తప్పినందున రైలు సర్వీసులకు ఎలాంటి ఆటంకం కలగలేదు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిచారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.

రెండు వారాల కిందట మూడు రైళ్ల ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బిహార్‌కు చెందిన ఓ ప్రయాణికుడు చనిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి CB మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడంతో మరణాల సంఖ్య 291 కి పెరిగింది. బిహార్‌లోని భాగల్‌పూర్ జిల్లా రోషన్‌పూర్‌కు చెందిన సాహిల్ మన్సూర్ (32)గా చనిపోయిన ప్రయాణికుడిగా గుర్తించారు. ట్రామా కేర్ ఐసియులో చికిత్స పొందిన సాహిల్.. కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. అతనికి డయాలసిస్ కూడా చేసినట్లు అధికారులు తెలిపారు. చివరగా కార్డియాక్ అరెస్ట్ కావడంతో పేషెంట్ మరణించాడని SCB మెడికల్ కాలేజీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాన్సు శేఖర్ మిశ్రా తెలిపారు. గాయాలతో పాటు అంతకుముందే అనారోగ్య సమస్యలతో అతడు కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోయాడని చెప్పారు.

SCB మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరిన 205 మందిలో 46 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. వీరిలో 13 మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్నారని పేర్కొన్నారు. ఇద్దరు, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలోని పత్రా గ్రామానికి చెందిన ప్రకాష్ రామ్ (22) అనే వలస కార్మికుడు శుక్రవారం ఇదే ఆసుపత్రిలో మరణించాడు.

జూన్ తొలివారం ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ప్రమాదానికి గురైన ఘటనలో 291 మంది మృతి చెందగా, 1,100 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మొదట కోల్ కతా నుంచి చెన్నైకి వెళ్తున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి గూడ్స్ రైలు ఉన్న లూప్ లోకి వెళ్లి ఢీకొంది. నాలుగైదు బోగీలు పట్టాలు తప్పాయి. మరికొద్ది సేపటికే యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ ఈ రైలును ఢీకొనడంతో కొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. ఈ విషాదంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోగా, మరికొన్ని కుటుంబాలు చనిపోయిన వారి డెడ్ బాడీని సైతం గుర్తించలేకపోవడం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చనిపోయిన ప్రయాణికుల కుటుంబసభ్యులకు పరిహారం ప్రకటించాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
గుడ్ న్యూస్.. హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
Sonam Wangchuk: సోనమ్‌వాంగ్ చుక్‌కు కేంద్రం గుడ్ న్యూస్ - నిర్బంధం ఎత్తివేయాలని నిర్ణయం
సోనమ్‌వాంగ్ చుక్‌కు కేంద్రం గుడ్ న్యూస్ - నిర్బంధం ఎత్తివేయాలని నిర్ణయం

వీడియోలు

Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Embed widget