అన్వేషించండి

Cyclone Biperjoy: సాయంత్రానికి తీరం దాటనున్న బిపర్‌జోయ్‌- అసలు అరేబియాలో తీవ్ర తుపానులు ఎందుకు ఏర్పడుతున్నాయి?

Cyclone Biperjoy: ఈ ఏడాది అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న మొదటి తుపాను బిపర్ జోయ్ తుపానుయే. దీని కారణంగా పెద్ద ఎత్తున గాలులు వీయడం, వర్షం పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Cyclone Biperjoy: ప్రస్తుతం దేశంలోని పశ్చిమ తీర ప్రాంతాల్లో 'బిపర్‌ జోయ్' తుపానుపై హెచ్చరిక కొనసాగుతోంది. తుపాను సమయంలో బలమైన గాలులు వీయడం, వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంది. ముంబయి, గోవా, పోర్‌ బందర్‌, కరాచీ సహా పరిసర ప్రాంతాలపై తుపాను ప్రభావం చూపవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాను ఇదేనని వాతావరణ శాఖ చెబుతోంది. సముద్రంలో ఏం జరుగుతుందో, అటువంటి భీకర తుఫానులు తరచుగా ఎందుకు ఏర్పడతాయి, ఆపై భూమిపైకి వచ్చి ఎందుకు విధ్వంసం సృష్టిస్తాయి?  

అరేబియా సముద్రంలో తుఫానులు తక్కువ..!

అరేబియా సముద్రం కంటే బంగాళాఖాతంలో తుఫానులు ఎక్కువగా ఏర్పడతాయని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూ కోల్ చెప్పారు. కానీ ఇప్పుడు అరేబియా సముద్రంలో కూడా పరిస్థితి మారిపోయిందని అంటున్నారు. వాాతావరణం హీటెక్కిందని అందుకే ఇక్కడ మరింత తీవ్రతతో తుపానులు ఏర్పడుతాయని అభిప్రాయపడుతున్నారు. 

సముద్రంలో తుపానులు ఎందుకు ఏర్పడతాయి?

సముద్రాలలో పెను తుపానులకు గ్లోబల్ వార్మింగ్ ప్రధాన కారణమనే వాదన బలపడుతోంది. గ్రీన్‌ హౌస్ వాయువుల వల్ల పెరిగే వేడిలో 93 శాతం మహా సముద్రాలు గ్రహిస్తాయని ఐపీసీసీ నివేదిక చెబుతోంది. దీని కారణంగా సముద్రాల ఉష్ణోగ్రత కూడా ప్రతి సంవత్సరం పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో ఇక్కడ ఏర్పడే బిపార్ జోయ్ వంటి ఉష్ణ మండల తుపానుల సంఖ్య, తీవ్రత కూడా పెరుగుతున్నాయి.  బిపర్ జోయ్ వంటి తుపానులు సముద్రాల వెచ్చని భాగంలో మాత్రమే ఏర్పడతాయి. ఈ భాగం సగటు ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో తుఫానులు శక్తిమంతంగా మారుతాయి. ఆ తర్వాత ముందుకు దూసుకెళ్తాయి అలా అవి భూమిపైకి వచ్చి విధ్వంసం సృష్టిస్తాయి.

ఇలాంటి తుపానులు, ప్రకృతి విపత్తుల సంగతి భారతదేశంలో కచ్చితత్వంతో ముందే అంచనా వేయగలుగుతున్నామని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని కారణంగా రిలీఫ్, డిజాస్టర్ రెస్క్యూ టీమ్ అలర్ట్‌గా ఉంటోందని ప్రభావిత ప్రాంతాల ప్రజలను సకాలంలో సురక్షిత ప్రదేశాలకు చేరుస్తున్నామని అంటున్నారు. 

ఇప్పటికే 50 వేల మందిని తాత్కాలిక ఆశ్రయాలకు తరలించిన అధికారులు

బిపర్జోయ్ తుపాను కారణంగా సౌరాష్ట్ర, కచ్‌లలో అలర్ట్ ప్రకటించారు. కచ్ జిల్లాలోని జఖౌ ఓడరేవు సమీపంలో శక్తివంతమైన తుపాను 'బిపార్జోయ్' తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే గుజరాత్ తీర ప్రాంతాల నుంచి 50 వేల మందిని తాత్కాలిక శిబిరాలకు తరలించారు. వాయుగుండం గుజరాత్ తీరం వైపు దూసుకు రావడంతో సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను గురువారం సాయంత్రం "తీవ్రమైన తుఫానుగా" తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గరిష్ట గాలి వేగం గంటు 150 కిలో మీటర్లకు చేరుకుంటుందని తెలిపారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MS Raju Bhagavad Gita Issue: భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు - హిందూ సంస్థల ఆగ్రహం - క్షమాపణ చెప్పిన  TTD బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు
భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు - హిందూ సంస్థల ఆగ్రహం - క్షమాపణ చెప్పిన TTD బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు
YS Jagan: చంద్రబాబు వల్లే రైతులకు తీవ్ర నష్టం - పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
చంద్రబాబు వల్లే రైతులకు తీవ్ర నష్టం - పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
Montha Cyclone Effect: నీట మునిగిన హన్మకొండ బస్టాండ్
Montha Cyclone Effect: నీట మునిగిన హన్మకొండ బస్టాండ్
Maoist Surrender Rehabilitation 2025: లొంగిపోయిన మావోయిస్టులు ఎక్కడ ఉంటున్నారు? వారి కోసం ప్రభుత్వాలు ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయా?
లొంగిపోయిన మావోయిస్టులు ఎక్కడ ఉంటున్నారు? వారి కోసం ప్రభుత్వాలు ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయా?
Advertisement

వీడియోలు

Montha Cyclone Effect | ఖమ్మం జిల్లాలో లారీతో సహా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన డ్రైవర్ | ABP Desam
Mumbai Kidnapper Rohit Arya Incident | ఆడిషన్ కి వచ్చిన పిల్లల్ని కిడ్నాప్ చేస్తే...ముంబై పోలీసులు పైకి పంపించారు | ABP Desam
India vs Australia 2025 | Shafali Verma | సెమీస్‌కు ముందు భారత జట్టులో షెఫాలీ
India vs Australia | Womens World Cup 2025 | నేడు ఆస్ట్రేలియాతో భారత్ ఢీ
Rohit Sharma | ICC ODI Rankings | ప్రపంచ నంబర్ 1 బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MS Raju Bhagavad Gita Issue: భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు - హిందూ సంస్థల ఆగ్రహం - క్షమాపణ చెప్పిన  TTD బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు
భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు - హిందూ సంస్థల ఆగ్రహం - క్షమాపణ చెప్పిన TTD బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు
YS Jagan: చంద్రబాబు వల్లే రైతులకు తీవ్ర నష్టం - పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
చంద్రబాబు వల్లే రైతులకు తీవ్ర నష్టం - పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
Montha Cyclone Effect: నీట మునిగిన హన్మకొండ బస్టాండ్
Montha Cyclone Effect: నీట మునిగిన హన్మకొండ బస్టాండ్
Maoist Surrender Rehabilitation 2025: లొంగిపోయిన మావోయిస్టులు ఎక్కడ ఉంటున్నారు? వారి కోసం ప్రభుత్వాలు ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయా?
లొంగిపోయిన మావోయిస్టులు ఎక్కడ ఉంటున్నారు? వారి కోసం ప్రభుత్వాలు ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయా?
Andhra Pradesh Deputy CM Pawan Kalyan : మోకాళ్ల లోతు బురద నీటిలో దిగిన పంట పొలాలను పరిశీలించిన పవన్ కల్యాణ్
మోకాళ్ల లోతు బురద నీటిలో దిగిన పంట పొలాలను పరిశీలించిన పవన్ కల్యాణ్
India vs Australia second T20I : భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 ఎప్పుడు, ఎక్కడ ఆడతారు? A to Z వివరాలు తెలుసుకోండి
భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 ఎప్పుడు, ఎక్కడ ఆడతారు? A to Z వివరాలు తెలుసుకోండి
Baahubali The Epic Review : 'బాహుబలి ది ఎపిక్'... మహేష్ బాబు కొడుకు రివ్యూ
'బాహుబలి ది ఎపిక్'... మహేష్ బాబు కొడుకు రివ్యూ
TTD Adulterated Ghee Case: శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం- వైవీ సుబ్బారెడ్డిని విచారణకు పిలుస్తారా?
శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం- వైవీ సుబ్బారెడ్డిని విచారణకు పిలుస్తారా?
Embed widget