By: ABP Desam | Updated at : 06 May 2022 03:19 PM (IST)
Edited By: Murali Krishna
పార్టీ లేదా పుష్పా! అన్నావ్- ఇస్తే బిర్యానీతో పాటు నగలు కూడా మింగేశాడు!
Chennai News: ఎవరైనా పార్టీకి పిలిస్తే ఏం చేస్తాం? కడుపు నిండా తింటాం.. హ్యాపీగా మాట్లాడి వచ్చేస్తాం. కానీ ఓ వ్యక్తి మాత్రం పార్టీలో పెట్టిన బిర్యానీతో పాటు లక్షలు విలువ చేసే నగలు కూడా కడుపు నిండా లాగించేశాడు. అవును మీరు చదివింది నిజమే. అసలు ఏం జరిగిందంటే?
ఇదేందిరా సామీ!
తమిళనాడులోని చెన్నై నగరంలో ఈద్ పర్వదినం కదా అని పార్టీకి పిలిచి బిర్యానీ పెట్టాడు ఓ వ్యక్తి. అయితే అతిథి బిర్యానీతో పాటు రూ.1.45 లక్షల విలువ గల నగలను మింగేశాడు.
చెన్నైలో నగల దుకాణంలో పనిచేస్తున్న ఓ మహిళ రంజాన్ ఈద్ పండుగ సందర్భంగా తన స్నేహితురాలితోపాటు ఆమె ప్రియుడిని విందుకు ఆహ్వానించింది. శుభ్రంగా బిర్యానీ పెట్టింది. బిర్యానీ పిసర కూడా లేకుండా ఫుల్గా లాగించేశారు. కానీ వాళ్లు వెళ్లాక గానీ అసలు విషయం తెలియలేదు.
ఇదే ట్విస్ట్
విందుకు వచ్చిన స్నేహితురాలి ప్రియుడు మద్యం మత్తులో బిర్యానీతో పాటు వజ్రాల నెక్లెస్, బంగారు గొలుసు, డైమండ్ లాకెట్లను మింగేశాడు. వాళ్లు వెళ్లిన తర్వాత తన ఇంట్లోని అలమారాలో వజ్రాల నెక్లెస్, బంగారు గొలుసు, డైమండ్ లాకెట్ కనిపించకుండా పోవడం చూసి ఆమె షాకైంది.
తన స్నేహితురాలి ప్రియుడే నగలు ఎత్తుకెళ్లినట్లు అనుమానం వచ్చి ఆమె విరుగంబాక్కం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అతన్ని విచారించగా బిర్యానీతో పాటు తానే నగలను మింగేశానని అంగీకరించాడు. దీంతో పోలీసులు వైద్యుడితో నిందితుడి పొట్టను స్కానింగ్ చేయించగా ఆభరణాలు కడుపులో ఉన్నాయని తేలింది.
బయటకు తీసి
వైద్యులు నిందితుడికి గురువారం ఎనీమా చేసి రూ.95 వేల విలువైన బంగారు హారం, రూ.25వేల బంగారాన్ని వెలికి తీసి పోలీసులకు అప్పగించారు. నిందితుడి కడుపులో పెండెంట్ ఇంకా ఉండిపోవడంతో దాన్ని బయటకు తీయడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు. అయితే మద్యం మత్తులోనే అతను ఇలా నగలు మింగేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఫిర్యాదు చేసిన మహిళ.. కేసు వాపసు తీసుకోవడానికి అంగీరించినట్లు సమాచారం. ఈ విచిత్ర ఘటన విని నెటిజన్లు కూడా అవాక్కవుతున్నారు.
Also Read: White House Press Secretary: జో బైడెన్ సంచలన నిర్ణయం- హై ప్రొఫైల్ పదవికి ఓ LGBTకి ఛాన్స్
Also Read: Viral Video: ఇదేం కొవిడ్ టెస్ట్ రా నాయనా! కింద పడేసి, మీద కూర్చొని!
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
BJP Telugu States Rajya Sabha: తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరికి రాజ్యసభ ! బీజేపీలో ఎవరా అదృష్టవంతుడు ?
Yasin Malik Case Verdict: మాలిక్కు జీవిత ఖైదుతోపాటు జరిమానా కూడా విధించిన కోర్టు- తీర్పు పూర్తి వివరాలు ఇవే
Five Congress Leaders : కాంగ్రెస్కు గుడ్ బై చెబుతున్న సీనియర్లు ! ఆపడం లేదా ? ఆగడం లేదా ?
Yasin Malik Case Verdict:కశ్మీర్ వేర్పాటువేద నేత యాసిన్ మాలిక్కు జీవిత ఖైదు
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు