అన్వేషించండి

Natural Disasters: దేశంలో వేగంగా మారిపోతున్న వాతావరణం, వేలాదిగా మరణాలు

Extreme Weather: ఇండియాలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. దేశంలో ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో సుమారు ప్రతిరోజు అసాధారణ వాతావరణ పరిణామాలు చోటుచేసుకున్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

Climate Change In India: భారతదేశం (India)లో వాతావరణ పరిస్థితులు (Weather Conditions) వేగంగా మారిపోతున్నాయి. దేశంలో ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో సుమారు ప్రతిరోజు అసాధారణ వాతావరణ పరిణామాలు చోటుచేసుకున్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. నిత్యం మారుతున్న పరిస్థితుల కారణంగా దేశ వ్యాప్తంగా వేలాది మరణాలు సంభవించాయని విశ్లేషించింది. సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (Center For Science And Environment) విడుదల చేసిన ఈ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 

దేశం మొత్తం మీద ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకూ పరిశీలిస్తే 86 శాతం రోజుల్లో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు నివేదిక వెల్లడించింది. దీంతో 2,923 మంది మృత్యువాత పడ్డారని, 20 లక్షల హెక్టార్లలోని పంట తుడిచిపెట్టుకుపోయిందని నివేదిక పేర్కొంది. 80 వేల గృహాలు ధ్వంసం అవగా 92 వేల జంతువులు మరణించాయి. వాస్తవంలో ఈ గణాంకాలు ఇంకా ఎక్కువగా కూడా ఉండొచ్చని పేర్కొంది. దేశంలో కొంత వరకు మాత్రమే సమాచారం సేకరించామని, మొత్తం సేకరిస్తే వివరాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది.

మండుతున్న భారతం
దేశ వ్యాప్తంగా 2023లో ప్రతికూల వాతావరణం ఉందని సీఎస్‌ఈ తన నివేదికలో వెల్లడించింది. 122 ఏళ్లలో ఎన్నడూ లేనంత అధిక ఉష్ణోగ్రతలు ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదయ్యాయని తెలిపింది. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 138 రోజుల పాటు ప్రకృతి ప్రకోపాలు సంభవించగా, బిహార్‌ 642 మరణాలు సంభవించాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో  365, ఉత్తర్‌ ప్రదేశ్‌లో 341 మరణాలు నమోదయ్యాయి.

వేల ఎకరాల్లో పంట నష్టం
వాతావరణ వైపరీత్యాలతో పంజాబ్‌లో అత్యధిక పశు మరణాలు సంభవించాయి. హిమాచల్ ప్రదేశ్‌లో అత్యధికంగా నివాసాలు దెబ్బతిన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో 113 రోజుల్లో వాతావరణ వైపరీత్యాలు నమోదయ్యాయి. అస్సాంలో అత్యధికంగా 102 రోజులపాటు ప్రకృతి వైపరీత్యాలు జరిగాయి. దక్షిణ భారతంలో అత్యధికంగా 67 వాతావరణ వైపరీత్య ఘటనలు జరిగాయి. 

కేరళలో 60 మరణాలు నమోదయ్యాయి. తెలగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో 62,000 హెక్టార్ల అత్యధిక పంట నష్టం సంభవించినట్లు సీఎస్‌ఈ తన నివేదికలో వెల్లడించింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా 645 పశువులు మరణించాయని, కర్ణాటకలో 11,000 ఇళ్లు నేలమట్టం అయినట్లు నివేదిక తెలిపింది.

ఇటీవల హెచ్చరించిన ఐక్యరాజ్య సమితి
వాతావరణంలో మార్పులపై ఇటీవల ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్యం కారణంగా మానవాళి మనుకగడకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. యూఎన్ వివరాల ప్రకారం.. మునుపటి శతాబ్దాలతో పోలిస్తే 1900 నుంచి ప్రపంచ సగటు సముద్ర మట్టాలు వేగంగా పెరుగు­తున్నాయి. భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్‌ మించి పెరగకుండా పరిమితం చేయగలిగితే.. వచ్చే 2 వేల సంవత్సరాలలో ప్రపంచ సగటు సముద్ర మట్టం 2 నుంచి 3 మీటర్లు పెరుగుతుంది. 

ఒకవేల 2 డిగ్రీల సెల్సియస్‌ పెరిగితే సముద్రాలు 6 మీటర్లు, 5 డిగ్రీల సెల్సియస్‌ పెరుగుదలతో సముద్రాలు 22 మీటర్లు వరకు పెరగవచ్చు. లోతట్టు ప్రాంతాలు, మొత్తం దేశాలు జలసమాధి అవుతాయి. భూతాపం పెరిగితే అది తీవ్రమైన కరువు, కార్చిచ్చు, వరదలు లాంటి అసహజ వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేస్తుంది. లక్షలాది మందికి ఆహారం కొరత ఏర్పడేలా చేస్తుంది.  

ప్రధాన నగరాలు జలమట్టం
ముంబై, కైరో, లాగోస్, మపుటో, బ్యాంకాక్, ఢాకా, జకార్తా, షాంఘై, కోపెన్‌హాగెన్, లండన్, లాస్‌ ఏంజిలిస్, న్యూయార్క్, బ్యూనస్‌ ఏరిస్, శాంటియాగో వంటి నగరాలకు ముప్పు వాటిల్లుతుంది.  ఈ పరిస్థితులను నియంత్రించడానికి గ్రీన్‌హౌస్‌ వాయువులు, కర్బన ఉద్గారాలను 2030 నాటికి కనీసం 43 శాతానికి, 2035 నాటికి 60 శాతానికి తగ్గించాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TVK Chief Vijay: CSK మ్యాచ్‌లు పోతున్నా... విజయ్‌కి మాత్రం కలిసి వస్తుంది! స్టేడియం అంతా విజిల్ సౌండ్సే! ఇదో రకం పబ్లిసిటీ!
CSK మ్యాచ్‌లు పోతున్నా... విజయ్‌కి మాత్రం కలిసి వస్తుంది! స్టేడియం అంతా విజిల్ సౌండ్సే! ఇదో రకం పబ్లిసిటీ!
Bengal Assembly Elections: బెంగాల్ రాజకీయాల్లో ముస్లిం కూటమి - మమతకు ముప్పు తప్పదా?
బెంగాల్ రాజకీయాల్లో ముస్లిం కూటమి - మమతకు ముప్పు తప్పదా?
Keralam Assembly Elections: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతల వ్యూహాత్మక ప్రచారం - యువనేతలకు ఎలక్షనీరింగ్ బాధ్యతలు !
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతల వ్యూహాత్మక ప్రచారం - యువనేతలకు ఎలక్షనీరింగ్ బాధ్యతలు !
Shroud of Turin: జీసస్ చివరి వస్త్రంపై ఇండియన్ DNA! సంచలనం రేపుతున్న కొత్త స్టడీ!
జీసస్ చివరి వస్త్రంపై ఇండియన్ DNA! సంచలనం రేపుతున్న కొత్త స్టడీ!

వీడియోలు

Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam
Sanjeev Goenka Behavior with LSG Captains | సంజీవ్ గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Basra Development: బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
Telugu Desam Party:'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
TVK Chief Vijay: CSK మ్యాచ్‌లు పోతున్నా... విజయ్‌కి మాత్రం కలిసి వస్తుంది! స్టేడియం అంతా విజిల్ సౌండ్సే! ఇదో రకం పబ్లిసిటీ!
CSK మ్యాచ్‌లు పోతున్నా... విజయ్‌కి మాత్రం కలిసి వస్తుంది! స్టేడియం అంతా విజిల్ సౌండ్సే! ఇదో రకం పబ్లిసిటీ!
Kyathanpally and Ibragimpatnam: ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో నాటకీయ పరిణామాలు! రెండింటిని కైవశం చేసుకున్న బీఆర్‌ఎస్‌!
ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో నాటకీయ పరిణామాలు! రెండింటిని కైవశం చేసుకున్న బీఆర్‌ఎస్‌!
TN 2026 Vijay: వైఎస్ జగన్ అనుకుంటే విజయ్ వచ్చాడు... దళపతి ఫ్యాన్స్‌కు నట్టి 'టీఎన్ 2026' టెన్షన్
వైఎస్ జగన్ అనుకుంటే విజయ్ వచ్చాడు... దళపతి ఫ్యాన్స్‌కు నట్టి 'టీఎన్ 2026' టెన్షన్
Extramarital Affairs in Hyderabad : సీక్రెట్ ఎఫైర్స్‌లో హైదరాబాద్ టాప్ 2 -  గ్లీడెన్ సర్వేలో విస్తుపోయే వివరాలు
సీక్రెట్ ఎఫైర్స్‌లో హైదరాబాద్ టాప్ 2 -  గ్లీడెన్ సర్వేలో విస్తుపోయే వివరాలు
Varanasi Update : వారణాసి షూటింగ్‌కు మందాకిని - సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రియాంక చోప్రా
వారణాసి షూటింగ్‌కు మందాకిని - సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రియాంక చోప్రా
Andhra Pradesh NTR Vaidya Seva Scheme: ఎన్టీఆర్ వైద్య సేవకు పదే పదే ఆటంకాలు - ప్రభుత్వ నిర్లక్ష్యం - పేదలకు కష్టాలు!
ఎన్టీఆర్ వైద్య సేవకు పదే పదే ఆటంకాలు - ప్రభుత్వ నిర్లక్ష్యం - పేదలకు కష్టాలు!
Embed widget