అన్వేషించండి

Natural Disasters: దేశంలో వేగంగా మారిపోతున్న వాతావరణం, వేలాదిగా మరణాలు

Extreme Weather: ఇండియాలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. దేశంలో ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో సుమారు ప్రతిరోజు అసాధారణ వాతావరణ పరిణామాలు చోటుచేసుకున్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

Climate Change In India: భారతదేశం (India)లో వాతావరణ పరిస్థితులు (Weather Conditions) వేగంగా మారిపోతున్నాయి. దేశంలో ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో సుమారు ప్రతిరోజు అసాధారణ వాతావరణ పరిణామాలు చోటుచేసుకున్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. నిత్యం మారుతున్న పరిస్థితుల కారణంగా దేశ వ్యాప్తంగా వేలాది మరణాలు సంభవించాయని విశ్లేషించింది. సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (Center For Science And Environment) విడుదల చేసిన ఈ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 

దేశం మొత్తం మీద ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకూ పరిశీలిస్తే 86 శాతం రోజుల్లో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు నివేదిక వెల్లడించింది. దీంతో 2,923 మంది మృత్యువాత పడ్డారని, 20 లక్షల హెక్టార్లలోని పంట తుడిచిపెట్టుకుపోయిందని నివేదిక పేర్కొంది. 80 వేల గృహాలు ధ్వంసం అవగా 92 వేల జంతువులు మరణించాయి. వాస్తవంలో ఈ గణాంకాలు ఇంకా ఎక్కువగా కూడా ఉండొచ్చని పేర్కొంది. దేశంలో కొంత వరకు మాత్రమే సమాచారం సేకరించామని, మొత్తం సేకరిస్తే వివరాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది.

మండుతున్న భారతం
దేశ వ్యాప్తంగా 2023లో ప్రతికూల వాతావరణం ఉందని సీఎస్‌ఈ తన నివేదికలో వెల్లడించింది. 122 ఏళ్లలో ఎన్నడూ లేనంత అధిక ఉష్ణోగ్రతలు ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదయ్యాయని తెలిపింది. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 138 రోజుల పాటు ప్రకృతి ప్రకోపాలు సంభవించగా, బిహార్‌ 642 మరణాలు సంభవించాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో  365, ఉత్తర్‌ ప్రదేశ్‌లో 341 మరణాలు నమోదయ్యాయి.

వేల ఎకరాల్లో పంట నష్టం
వాతావరణ వైపరీత్యాలతో పంజాబ్‌లో అత్యధిక పశు మరణాలు సంభవించాయి. హిమాచల్ ప్రదేశ్‌లో అత్యధికంగా నివాసాలు దెబ్బతిన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో 113 రోజుల్లో వాతావరణ వైపరీత్యాలు నమోదయ్యాయి. అస్సాంలో అత్యధికంగా 102 రోజులపాటు ప్రకృతి వైపరీత్యాలు జరిగాయి. దక్షిణ భారతంలో అత్యధికంగా 67 వాతావరణ వైపరీత్య ఘటనలు జరిగాయి. 

కేరళలో 60 మరణాలు నమోదయ్యాయి. తెలగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో 62,000 హెక్టార్ల అత్యధిక పంట నష్టం సంభవించినట్లు సీఎస్‌ఈ తన నివేదికలో వెల్లడించింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా 645 పశువులు మరణించాయని, కర్ణాటకలో 11,000 ఇళ్లు నేలమట్టం అయినట్లు నివేదిక తెలిపింది.

ఇటీవల హెచ్చరించిన ఐక్యరాజ్య సమితి
వాతావరణంలో మార్పులపై ఇటీవల ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్యం కారణంగా మానవాళి మనుకగడకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. యూఎన్ వివరాల ప్రకారం.. మునుపటి శతాబ్దాలతో పోలిస్తే 1900 నుంచి ప్రపంచ సగటు సముద్ర మట్టాలు వేగంగా పెరుగు­తున్నాయి. భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్‌ మించి పెరగకుండా పరిమితం చేయగలిగితే.. వచ్చే 2 వేల సంవత్సరాలలో ప్రపంచ సగటు సముద్ర మట్టం 2 నుంచి 3 మీటర్లు పెరుగుతుంది. 

ఒకవేల 2 డిగ్రీల సెల్సియస్‌ పెరిగితే సముద్రాలు 6 మీటర్లు, 5 డిగ్రీల సెల్సియస్‌ పెరుగుదలతో సముద్రాలు 22 మీటర్లు వరకు పెరగవచ్చు. లోతట్టు ప్రాంతాలు, మొత్తం దేశాలు జలసమాధి అవుతాయి. భూతాపం పెరిగితే అది తీవ్రమైన కరువు, కార్చిచ్చు, వరదలు లాంటి అసహజ వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేస్తుంది. లక్షలాది మందికి ఆహారం కొరత ఏర్పడేలా చేస్తుంది.  

ప్రధాన నగరాలు జలమట్టం
ముంబై, కైరో, లాగోస్, మపుటో, బ్యాంకాక్, ఢాకా, జకార్తా, షాంఘై, కోపెన్‌హాగెన్, లండన్, లాస్‌ ఏంజిలిస్, న్యూయార్క్, బ్యూనస్‌ ఏరిస్, శాంటియాగో వంటి నగరాలకు ముప్పు వాటిల్లుతుంది.  ఈ పరిస్థితులను నియంత్రించడానికి గ్రీన్‌హౌస్‌ వాయువులు, కర్బన ఉద్గారాలను 2030 నాటికి కనీసం 43 శాతానికి, 2035 నాటికి 60 శాతానికి తగ్గించాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Ram Mohan Naidu summons IndiGo CEO: ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం

వీడియోలు

Tirupparankundram Temple Issue | తిరుప్పారన్‌కుండ్రం మురుగున్ ఆలయం వివాదం ఏంటి? | ABP Desam
Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Ram Mohan Naidu summons IndiGo CEO: ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
Karthigai Deepam Row: ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
Pilot Rostering Issues: భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
IPL 2026 Auction :ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
Dekhlenge Saala Song Promo: 'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
Embed widget