Bihar Assembly Elections 2025: ఎన్డీఏలో పూర్తయిన సీట్ల పంపకం.. మహా ఘట్ బంధన్లో ఇంకా కొలిక్కిరాని వ్యవహారం
Bihar Elections 2025: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏనే మళ్లీ విజయం సాధిస్తుందని నేతలు ధీమాగా ఉన్నారు. ఎన్నికలకుగానూ ఎన్డీయేలో సీట్ల పంపకం ప్రశాంతంగా పూర్తయింది. పార్టీలవారీగా సీట్ల వివరాలివే.

NDA Seat Sharing in Bihar Assembly Elections | బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏలో సీట్ల పంపకం పూర్తయింది. బీజేపీ, జేడీయూలు చెరో 101 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. చిరాగ్ పాశ్వాన్ పార్టీకి 29 సీట్లను కేటాయించారు. దీంతో పాటు జీతన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుష్వాహాలకు చెరో 6 సీట్లు ఇచ్చారు. బీజేపీ బీహార్ ఇన్ఛార్జ్ వినోద్ తావ్డే సీట్ల పంపకాలపై ట్లాడుతూ.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీఏ లోని సభ్యులందరూ స్నేహపూర్వక వాతావరణంలో పరస్పర అంగీకారంతో సీట్ల పంపకం పూర్తి చేశాం. ఎవరికీ సీట్ల పంపకంపై అసంతృప్తి లేదు.
ఎన్డీయే కూటమిలో సీట్ల పంపకాలు ఇలా చేశారు..
బీజేపీ – 101 సీట్లు
జేడీయూ – 101 సీట్లు
లోజపా (రాంవిలాస్) – 29 సీట్లు
రాలోమో – 06 సీట్లు
హమ్ – 06 సీట్లు
జీతన్ రామ్ మాంఝీ పార్టీకి దక్కిన సీట్లు ఇవే
టెకారీ
కుటుంబా
అత్రి
ఇమామ్గంజ్
సికింద్రా
బరాచట్టి
ఉపేంద్ర కుష్వాహా పార్టీ ఎక్కడ పోటీ చేస్తుంది
ససారం
దినారా
ఉజియార్పూర్
మహువా
బాజ్పట్టి
మధుబని
సీట్ల పంపకంపై జేడీయూ అభిప్రాయం
జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ కుమార్ ఝా సీట్ల పంపకాలపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం ఎన్డీఏలోని మిత్రులతో కలిసి స్నేహపూర్వక వాతావరణంలో సీట్ల పంపకం జరిగిందన్నారు. ఎన్డీఏలోని అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు సీట్ల పంపకాన్ని స్వాగతిస్తున్నారని, నితీష్ కుమార్ ను భారీ మెజారిటీతో తిరిగి ముఖ్యమంత్రిని చేయడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. కూటమి లోని అన్ని పార్టీలు ఐక్యంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని, బిహార్ అందుకు సిద్ధంగా ఉందన్నారు.
వినోద్ తావ్డే మాట్లాడుతూ.. ఎన్డీఏలోని అన్ని పార్టీల నాయకులు సీట్ల పంపకాల నిర్ణయాన్ని సంతోషంగా స్వాగతించారు. మరోసారి విజయం సాధించడానికి అందరూ నడుం బిగించారు. బిహార్లో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
మహా ఘట్ బంధన్ సీట్ల పంపకంపై ఉత్కంఠ
ఎన్డీఏ సీట్ల పంపకం జరిగిన తర్వాత, ఇప్పుడు అంతా మహాకూటమి సీట్ల పంపకం కోసం ఎదురు చూస్తున్నారు. మహాకూటమి కూడా త్వరలో సీట్ల పంపకం ప్రకటిస్తుందని, ఎన్నికలకు రోజులు దగ్గర పడేకొద్దీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది.
రెండు దశల్లో ఎన్నికలు
బిహార్ అసెంబ్లీలోని 243 సీట్లకు మొత్తం రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో 121 సీట్లకు నవంబర్ 6న ఎన్నికలు జరగనుండగా, మిగతా 122 సీట్లకు రెండో దశలో నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనుంది ఈసీ.






















