అన్వేషించండి

సనాతన ధర్మం వివాదాన్ని పక్కన పెట్టండి, బీజేపీ ట్రాప్‌లో పడొద్దు - కార్యకర్తలకు స్టాలిన్ ఉపదేశం

Sanatana Dharma Row: సనాతన ధర్మం వివాదాన్ని పక్కన పెట్టాలని ఎమ్‌కే స్టాలిన్ పార్టీ కార్యకర్తలకు సూచించారు.

Sanatana Dharma Row: 

సనాతన ధర్మం వివాదం..

సనాతన ధర్మ  వివాదాన్ని ఇక పక్కన పెట్టేయాలని పార్టీ నేతలకు తేల్చి చెప్పారు DMK చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్. బీజేపీ తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు సనాతన ధర్మం వివాదం వైపు ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పార్టీ నేతలతో సమావేశమైనప్పుడు సనాతన ధర్మం అంశాన్నే హైలైట్ చేయాలని సూచించారని, తమ పొలిటికల్ మైలేజ్ కోసం ఈ వివాదాన్ని వాడుకుంటున్నారని చెప్పారు స్టాలిన్. బీజేపీ ట్రాప్‌లో పడి ఈ వివాదాన్ని కొనసాగించొద్దని సూచించారు. 

"ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ మంత్రులతో ఈ మధ్యే భేటీ అయ్యారు. సనాతన ధర్మం వివాదంపై స్పందించాలని అందరికీ చెప్పారు. ఆ విధంగా పొలిటికల్ మైలేజ్‌ కోసం చూస్తున్నారు. ఓ కేంద్రమంత్రి పదేపదే ఈ వివాదంపై స్పందిస్తూ అసలు సమస్యలన్నింటినీ పక్కదోవ పట్టిస్తున్నారు. ఇదంతా డైవర్ట్ చేసే రాజకీయమే. ఈ ట్రాప్‌లో మనం పొరపాటున కూడా చిక్కుకోవద్దు. అవినీతి గురించి మాట్లాడకుండా పూర్తిగా ఈ వివాదంపైనే ఫోకస్ పెడుతున్నారు. బీజేపీ అవినీతి గురించి మాత్రమే మనం మాట్లాడాలి. కాంగ్రెస్‌ సహా వామపక్ష పార్టీలన్నీ ఇదే విధంగా ఉండాలి"

- ఎమ్‌కే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి

బీజేపీ అంతా అవినీతిమయం..

దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అందరూ ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు స్టాలిన్. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీపై పోరాడాలని చెప్పారు. బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్‌ని పట్టించుకోవద్దని సూచించారు. భారత్ మాల, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ వే ప్రాజెక్ట్‌కైన ఖర్చుల్లో అవకతవకలు జరిగినట్టు కాగ్ రిపోర్ట్ వెల్లడించిందని చెప్పారు. మణిపూర్‌లో హింసను అణిచివేయడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో విపక్ష కూటమికి చెందిన నేతలు విజయం సాధించారని, 2024లోనూ ఇదే రిపీట్ అవుతుందని అన్నారు. 

వెనక్కి తగ్గని ఉదయనిధి..

ఉదయనిధి స్టాలిన్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ ఫోటోను పోస్టు చేశారు. ఈ వివాదం నడుస్తున్న వేళ ఆయన అలాంటి ఫోటోను పోస్టు చేయడం చూస్తుంటే.. తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేది లేదు అనే సందేశాన్ని పంపించినట్లు తెలుస్తోంది. సనాతన ధర్మాన్ని గతంలో డెంగ్యూ, మలేరియా, దోమలు లాంటి వాటితో పోలుస్తూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ (X) లో మస్కిటో కాయిల్ ఫోటోను పోస్టు చేశారు ఉదయనిధి స్టాలిన్. ఈ ఫోటోకు క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు. దీంతో పరోక్షంగా మరోసారి వివాదాన్ని పెంచుతున్నారని రాజకీయ నిపుణులు అంటున్నారు. డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాలను వ్యాపింపజేసే దోమలను తరిమికొట్టడానికి మస్కిటో కాయిల్స్ వాడుతుంటారు. ఆయన ఆ ఫోటో పెట్టడాన్ని చూస్తుంటే.. మరోసారి అవే వ్యాఖ్యలను పరోక్షంగా చేసినట్లు అనుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

First Passive Euthanasia: హరీష్ రాణా కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి.. తీర్పు వెల్లడిస్తూ జడ్జి కన్నీళ్లు.. భారత్‌లో తొలి కేసు
హరీష్ రాణా కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు పర్మిషన్.. తీర్పు వెల్లడిస్తూ జడ్జి కన్నీళ్లు.. భారత్‌లో తొలి కేసు
ITR Filing : మీరు ITR ఫైల్ చేయలేదా? పొరపాట్లు ఉన్నా సరే.. మార్చి 31లోపు సవరించుకోండి, పూర్తి డిటైల్స్ ఇవే
మీరు ITR ఫైల్ చేయలేదా? పొరపాట్లు ఉన్నా సరే.. మార్చి 31లోపు సవరించుకోండి, పూర్తి డిటైల్స్ ఇవే
Everest Masala : ఎవరెస్ట్ మసాలాల్లో నాణ్యత సమస్యలు? పురుగుల మందులు, ఎంటెరోబాక్టీరియా నిజంగానే ఉన్నాయా?
ఎవరెస్ట్ మసాలాల్లో నాణ్యత సమస్యలు? పురుగుల మందులు, ఎంటెరోబాక్టీరియా నిజంగానే ఉన్నాయా?
LPG Cylinder Truck Theft: ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
ఎంతకు తెగించార్రా..! ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
Embed widget