అన్వేషించండి

మణిపూర్‌లో మరో దారుణం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అత్యాచార ఘటన - కన్నీళ్లు పెట్టుకున్న బాధితురాలు

Manipur Violence: మణిపూర్‌లో మరో అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Manipur Violence: 

సామూహిక అత్యాచారం

మణిపూర్‌ వైరల్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అక్కడ మహిళలపై ఎంత దారుణమైన దాడులు జరుగుతున్నాయో ఆ వీడియోతో ప్రపంచానికి తెలిసింది. కానీ...ఇప్పటికీ వెలుగులోకి రాని దారుణాలు చాలానే ఉన్నాయి. ఎంతో మంది అత్యాచార  బాధితులు ఇప్పుడిప్పుడే తమ ఆవేదనను బయటకు చెబుతున్నారు. న్యాయం జరుగుతుందన్న ఆశతో పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఓ 37 ఏళ్ల బాధితురాలు తన బాధనంతా బయటపెట్టింది. చురచందపూర్‌లో ఓ వర్గం వాళ్లు వచ్చి ఇళ్లన్నీ తగలబెడుతుంటే కుటుంబంతో సహా పారిపోవాలని ప్రయత్నించింది ఓ మహిళ. ఇద్దరు కొడుకులు, మేన కోడలితో బయటకు వెళ్తున్న సమయంలో కొందరు దుండగులు వచ్చి ఆమెను అడ్డగించారు. బలవంతంగా లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది. మే 3వ తేదీన ఈ దారుణం జరిగినా...ఇన్నాళ్లూ నోరి విప్పలేదని చెప్పింది. పోలీసుల వరకూ వెళ్లి ఫిర్యాదు చేసే ధైర్యం ఇన్నాళ్లూ లేదని, ఇప్పుడిప్పుడే కాస్త ధైర్యం తెచ్చుకుని కంప్లెయింట్ ఇచ్చినట్టు వివరించింది. 

"నన్ను, నా కుటుంబాన్ని కాపాడుకోడానికి ఇన్నాళ్లూ నోరి విప్పలేదు. దీని గురించి మాట్లాడాలంటేనే నాకు భయమేసింది. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనిపించింది"

- బాధితురాలు

కేసు నమోదు 

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు జీరో FIR నమోదు చేశారు. ప్రస్తుతానికి ఓ రిలీఫ్ క్యాంప్‌లో తల దాచుకుంటోంది. పోలీసుల FIR ప్రకారం...మే 3వ తేదీన సాయంత్రం 6.30 నిముషాలకు ఈ ఘటన జరిగింది. 

"నా మేనకోడలిని చీరతో వెనక్కి కట్టుకున్నాను. ఇద్దరి కొడుకులనూ జాగ్రత్తగా బయటకు పంపాను. అక్కడి నుంచి పరిగెత్తాం. ఉన్నట్టుండి నేను కింద పడిపోయాను. నా మేనకోడలు వచ్చి నన్ను లేపింది. సరిగ్గా అదే సమయానికి ఆరుగురు వ్యక్తులు వచ్చారు. నన్ను గట్టిగా పట్టుకున్నారు. ఇష్టమొచ్చినట్టు తిట్టారు. నేలకేసి కొట్టారు. లైంగికంగా వేధించారు. నేను ఏ తప్పూ చేయకపోయినా ఈ దారుణానికి బలి కావాల్సి వచ్చింది. ఇలాంటి వాళ్లకు కఠినమైన శిక్ష విధించాలి"

- బాధితురాలు 

3 నెలలుగా హింసతో అట్టుడుకుతున్న మణిపూర్ లో దర్యాప్తు, పరిష్కార చర్యలు, పరిహారం, పునరావాసాన్ని పర్యవేక్షించడానికి సుప్రీం కోర్టు ప్రత్యేక ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. ముగ్గురు మాజీ మహిళా హైకోర్టు న్యాయమూర్తుల కమిటీని సుప్రీం కోర్టు నియమించింది. దర్యాప్తు సంస్థ నమోదు చేసిన 11 ఎఫ్ఐఆర్‌లపై సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు ముంబయి మాజీ పోలీసు కమిషనర్ దత్తాత్రయ్ పద్‌సాల్గికర్‌ను సుప్రీం కోర్టు నియమించింది. మే నెలలో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసుతో సహా మణిపూర్ హింసాకాండకు సంబంధించిన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రత్యేక ప్యానెల్ ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ ప్యానెల్ లో జస్టిస్ గీతా మిట్టల్ (జమ్మూ & కశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ షాలినీ ఫన్సాలార్ జోషి (బాంబే హెచ్సీ మాజీ న్యాయమూర్తి), జస్టిస్ ఆశా మీనన్ (ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి) లు ఈ ప్యానెల్ ఉంటారు. ఈ ప్యానెల్ కు జస్టిస్ గీత మిట్టల్ నేతృత్వం వహిస్తారని స్పష్టం చేసింది. 

Also Read: Rice Price Hike: మండిపోతున్న బియ్యం ధరలు, గత 15 ఏళ్లలో ఎన్నడూ ఇంత రేటు వినలేదు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Dangerous bike smoke: బైక్ ఆన్ చేసి గదిలో ఉంచితే ప్రాణాలు మిగలవు - పుంగనూరు ఘటనలో జరిగింది ఇదే - ఎందుకంటే ?
బైక్ ఆన్ చేసి గదిలో ఉంచితే ప్రాణాలు మిగలవు - పుంగనూరు ఘటనలో జరిగింది ఇదే - ఎందుకంటే ?
Tamil Nadu Assembly Elections 2026: రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
Visa Interview Tips : వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలా? ముందుగానే ఇలా ప్రిపేర్ అవ్వండి, వీసా రిజెక్ట్ కాదు
వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలా? ముందుగానే ఇలా ప్రిపేర్ అవ్వండి, వీసా రిజెక్ట్ కాదు
Hard Rock Cafe Close: రాక్ అండ్ రోల్ థీమ్‌ రెస్టారెంట్స్‌కు గడ్డు కాలం - భారతదేశంలో మూతపడిన హార్డ్ రాక్ కేఫ్‌లు
రాక్ అండ్ రోల్ థీమ్‌ రెస్టారెంట్స్‌కు గడ్డు కాలం - భారతదేశంలో మూతపడిన హార్డ్ రాక్ కేఫ్‌లు

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Tamil Nadu Assembly Elections 2026: రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Embed widget