అన్వేషించండి

7th Pay Commission: కేంద్ర ఆర్థికశాఖ కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగుల కుటుంబాలకు బిగ్ రిలీఫ్

ఉద్యోగులు సైతం చనిపోవడంతో పలువురి కుటుంబాలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఏడవ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా కష్ట కాలంలో ప్రైవేట్ ఉద్యోగులతో పాటు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగులు సైతం చనిపోవడంతో పలువురి కుటుంబాలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఏడవ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో ఏదైనా కారణాలతో మరణిస్తే ఆ ఉద్యోగి కుటుంబానికి ఎక్స్-గ్రేషియా ఒకేసారి పరిహారం చెల్లించే నియమాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణకు ముందు వివిధ పరిస్థితులలో విధి నిర్వహణలో చనిపోతే వారి  ఒకేసారి పరిహారం చెల్లించవచ్చు. ఈ మొత్తం నగదు ఆయా ఏడాది, సమయాన్ని బట్టి ఎప్పటికప్పుడు సవరించనున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగి కుటుంబసభ్యుడికి లేదా గతంలో ఉద్యోగి పేర్కొన్న నామినీలకు ఈ భారీ మొత్తం అందించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు పరిహారం చెల్లించడంపై కొన్ని సవరణలు చేశారు.

Also Read: కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్లోకి మూడు నెలల జీతం 

ఉద్యోగి విధులు నిర్వహిస్తున్న సమయంలో పేర్కొన్న నామినీకి నగదు మొత్తం అందిస్తారు. డెత్ గ్రాట్యుటీ, జీపీఎఫ్ బ్యాలెన్స్, సీజీఈజీఐఎస్ నగదు మొత్తాన్ని విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి పేర్కొన్న నామినీకి అందుతాయి. ఒకవేళ నామినీ వివరాలు లేని పక్షంలో కుటుంబసభ్యులలో ఒకరికి పరిహారం నగదు అందిస్తామని డిపార్ట్ మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ సెప్టెంబర్ 30, 2021న ఓ ప్రకటనలో తెలిపింది. సీసీఎస్ పెన్షన్ రూల్స్, 1972లోని నామినేషన్ ఫామ్ అయిన ఫామ్ 1లో పరిహారానికి సంబంధించి కొన్ని మార్పులు చేశారు.

నామినేషన్ చేయకపోతే..
డిపార్ట్ మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ (డీఓపీపీడబ్ల్యూ) ప్రకారం.. ఎవరైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నామినేషన్ వివరాలు పేర్కొనని పక్షంలో చనిపోయిన ఉద్యోగి కుటుంబసభ్యులు అందరికీ నగదు మొత్తం సమాన వాటాలుగా అందిస్తారు. రూల్ 51 ప్రకారం ఈ పరిహారం అందించాలని మార్పులు జరిగాయి.

Also Read: బ్యాంకు నిబంధనల్లో కొత్త మార్పులు! కస్టమర్లకు లాభమా? నష్టామా? తెలుసుకోండి!

 కుటుంబం నుంచి నామినేషన్ లేకపోతే..
డీఓపీపీడబ్ల్యూ ప్రకారం.. కుటుంబానికి చెందని వ్యక్తిని నామినీగా పేర్కొన్న సందర్భాలలో వారికి పరిహారం అందదు. ఉద్యోగికి సొంత కుటుంబం లేకపోయినా ఇతర వ్యక్తులను నామినీగా చేర్చితే వారికి ఎక్స్ గ్రేషియా చెల్లించనక్కర్లేదని రూల్స్‌లో మార్పులు చేశారు.

కొత్త రూల్ ఎందుకంటే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే ప్రస్తుత రూల్స్ ప్రకారం నామినీకి నగదు మొత్తం, గ్రాట్యుటీ, జీపీఎఫ్ బ్యాలెన్స్, సీజీఈజీఐఎస్ నగదును అందిస్తారు.  సీసీఎస్ రూల్స్ 1932 ప్రకారం కుటుంబంలో ఎవరికి పరిహారం చెల్లించాలనే అంశాన్ని స్పష్టంగా పేర్కొనలేదు. తాజాగా చేసిన సవరణలతో నామినీ పేరు పేర్కొనని సందర్భంలో కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ సమానంగా వాటాలుగా విభజించి పరిహారం, ఇతరత్రా బెనిఫిట్స్ చెల్లించనున్నారు. ఏడవ వేతన సంఘం సిఫార్సుతో ఆర్థిక శాఖ పరిహారంపై నిర్ణయం తీసుకుని స్వల్ప మార్పులు చేసింది.

Also Read: మీ జీతం 15 వేల కంటే తక్కువా? మీకో శుభవార్త.. ఈ ఒక్క పని ఫ్రీగా చేస్తే ఎన్నో లాభాలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Tamil Nadu Assembly Elections 2026: అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
Rupali Chakankar and Ashok Kharat: కీచకబాబాతో మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సంబంధాలు - పదవి పోయింది!
కీచకబాబాతో మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సంబంధాలు - పదవి పోయింది!
Bengal Elections 2026: ప్రాంతీయ సెంటిమెంట్‌తో మమత ఎత్తుగడ.. జాతీయవాద మంత్రంతో బీజేపీ ఎదురుదాడి - బెంగాల్‌లో పైచేయి ఎవరిది?
ప్రాంతీయ సెంటిమెంట్‌తో మమత ఎత్తుగడ.. జాతీయవాద మంత్రంతో బీజేపీ ఎదురుదాడి - బెంగాల్‌లో పైచేయి ఎవరిది?

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
RCB VS SRH Highlights: ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్, చివర్లో అనికేత్ వర్మ మెరుపులు.. RCBకి SRH బిగ్ టార్గెట్
ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్, చివర్లో అనికేత్ వర్మ మెరుపులు.. RCBకి SRH బిగ్ టార్గెట్
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Embed widget