అన్వేషించండి

Nandyal District News: రాంగ్ కాల్‌తో పరిచయం, ఆపై సహజీవనం - నలుగురు పిల్లలు, చివరకు ఊహించని ట్విస్ట్

Nandyal District News: రాంగ్ కాల్ ద్వారా ఏర్పడిన పరిచయంతో దేశంలోకి అక్రమంగా చొరబడి మరీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. నలుగురు పిల్లల తండ్రయ్యాక వారితో పాటు సొంత దేశానికి పారిపోతుండగా పోలీసులకు చిక్కాడు.

Nandyal District News: ఫోన్‌కు వచ్చిన ఓ  రాంగ్ కాల్ ద్వారా ఏర్పడిన పరిచయంతో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకునేందుకని చెప్పి అక్రమంగా దేశంలోకి చొరబడ్డాడు. ఆపై దాదాపు తొమ్మిదేళ్ల పాటు ఆమెతో సహజీవనం చేశాడు. ఆపై పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరికీ నలుగురు పిల్లలు జన్మించారు. ఆ తర్వాత వారితోపాటు దేశం దాటి పారిపోయే క్రమంలో పోలీసులకు పట్టుబడి ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నాడు. నేడు అతడు జైల్లో ఉండగా.. పిల్లల పోషణ భారం మోయలేక ఆ మహిళ దీనంగా ఆర్జిస్తోంది. 

అసలేం జరిగిందంటే..?

నంద్యాల జిల్లా గడివేములకు చెందిన షేక్ దౌలత్ బీకి పెళ్లయిన రెండేళ్ల తర్వాత భర్త చనిపోయాడు. అప్పటికే వారికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. భర్త మరణించాక దౌలత్ బీ తల్లిదండ్రుల వద్దకు చేరింది. అక్కడే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే 2010లో ఆమె ఫోన్ కు ఓ కాల్ వచ్చింది. అలా పాకిస్థాన్ పౌరుడైన గుల్జార్ ఖాన్ తో పరిచయం ఏర్పడింది. అక్కడి పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన గుల్జార్ సౌదీ అరేబియాలో పెయింటర్ గా పని చేసేవాడు. ఇద్దరూ తరచూ ఫోన్ లో మాట్లాడుకునే వారు. దౌలత్ బీని కలిసేందుకని గుల్జార్ ఖాన్ సౌదీ నుంచి ముంబయి మీదుగా భారత్ లోకి అక్రమంగా ప్రవేశించాడు. నేరుగా గడివేములకు వచ్చి 2011 జనవరి 25వ తేదీన దౌలత్ బీని నిఖా చేుకున్నాడు. వారికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం కలిగారు. తొమ్మిదేళ్ల పాటు వీరిద్దరి సంసారం సాఫీగానే సాగింది. 

భార్యాపిల్లలతో కలిసి పారిపోతుండగా.. పట్టుబడి

గుల్జార్ ఖాన్ గడివేములలో ఆధార్ కార్డు కూడా పొందాడు. దాని ఆధారంగా తనతో పాటు భార్య, ఐదుగురు పిల్లలను సౌదీ అరేబియాకు తీసుకెళ్లేందుకు వీసాలు తీసుకున్నాడు. అక్కడి నుంచి పాకిస్థాన్ వెళ్లాలన్నది వారి ప్రణాళిక. 2019లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాగా తనిఖీ సిబ్బంది పరిశీలనలో గుల్జార్ ఖాన్ అక్రమంగా భారత్ లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. దీంతో చేసేదేం లేక పిల్లలతో సహా దౌలత్ బీ ఎయిర్ పోర్టు నుంచి ఆమె స్వస్థలానికి చేరుకుంది. ఆనాటి నుంచి భర్త తోడు లేక.. పిల్లల పోషణ భారమై కష్టంగా బతుకీడుస్తోంది. 

గతేడాది మళ్లీ హైదరాబాద్ జైలుకు తరలింపు

తన ఐదుగురు సంతానంతోపాటు బుద్ధి మాంద్యంతో బాధపడుతున్న సోదరి పోషణ భారం ఆమె పైనే పడింది ఇళ్లల్లో పనులు చేస్తూ పిల్లల్ని పోషిస్తోంది. పెద్ద కుమారుడు మహమ్మద్ ఇలియాస్ కూలీ పనులకు వెళ్తుండగా.. మిగిలిన వారంతా పదేళ్లలోపు చిన్నారులే. గుల్జార్ ఖాన్ అరెస్టయిన ఆరు నెలల తర్వాత కరోనా కారణంగా జైలు నుంచి విడుదల అయ్యాడు. ఏడాది పాటు భార్యా పిల్లలతోనే కలిసి ఉన్నాడు. కానీ 2022లో మళ్లీ హైదరాబాద్ లోని జైలుకు తరలించారు. ఆమె తన భర్తను విడుదల చేయాలని అధికారులు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Fibernet: ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
Revanth Reddy : ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
Pawan Kalyan in Assembly: పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ  పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
Nara Lokesh Fires on YSRCP: మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Minister Narayana Team in Maha Kumbh 2025 | పుష్కరాల కోసం మహాకుంభమేళాలో అధ్యయనం | ABP DesamGV Reddy Resign AP Fibernet Chairman | ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీరెడ్డి రాజీనామా | ABP DesamBJP MLC Candidate Anji Reddy Interview | కిషన్ రెడ్డి ప్రచారం చేసేంత ప్రాధాన్యత అంజిరెడ్డికి ఎందుకు?Tesla Company for Andhra Pradesh | ఎలన్ మస్క్ కార్ల కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ కు వస్తోందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Fibernet: ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
Revanth Reddy : ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
Pawan Kalyan in Assembly: పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ  పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
Nara Lokesh Fires on YSRCP: మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
Telangana Latest News: రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
NTRNeel Project: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కథ ఇదేనా? - పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ రోల్‌పై ఆ రూమర్స్‌లో నిజమెంత?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కథ ఇదేనా? - పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ రోల్‌పై ఆ రూమర్స్‌లో నిజమెంత?
Highcourt: సహజీవనం చేసిన తర్వాత పెళ్లికి నో - రేప్ కేసు పెట్టిన యువతి - ప్రేమ వైఫల్యం నేరం కాదన్న కోర్టు !
సహజీవనం చేసిన తర్వాత పెళ్లికి నో - రేప్ కేసు పెట్టిన యువతి - ప్రేమ వైఫల్యం నేరం కాదన్న కోర్టు !
Sai Pallavi: సాయి పల్లవి మిగతా హీరోయిన్లలా ఎందుకు మేకప్ వేసుకోదో తెలుసా?
సాయి పల్లవి మిగతా హీరోయిన్లలా ఎందుకు మేకప్ వేసుకోదో తెలుసా ?
Embed widget