Amritsar Golden Temple : అమృత్ సర్ స్వర్ణదేవాలయం మీదనే గురి పెట్టిన పాక్ - నిర్వీర్యం చేసిన సైన్యం - సంచలన దృశ్యాలు
India Air Defence : ఆపరేషన్ సిందూర్ లో భారత్ ఉగ్రవాదుల్ని టార్గెట్ చేస్తే పాకిస్తాన్ ఏకంగా ఆలయాలను టార్గెట్ చేసింది. నేరుగా స్వర్ణదేవాలయం మీదకు మిస్సైల్ పంపింది. కానీ సైన్యం నిర్వీర్యం చేసింది.

Pakistan attempt to target Amritsar Golden Temple: భారత్ లో మత చిచ్చు పెట్టేందుకు పాకిస్తాన్ ఆలయాలను టార్గెట్ చేసిందని భారత సైన్యాధికారులు పదే పదే చెబుతున్నారు. దీనికి కారణాలు మెల్లగా బయటకు వస్తున్నాయి. అసలు పాకిస్తాన్ ఏకంగా అమృత్ సర్ స్వర్ణ దేవాలయాన్నే టార్గెట్ చేసిందని వెలుగులోకి వచ్చింది.
మే 8న పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడికి తెగబడింది. ఈ దాడిలో ప్రధాన లక్ష్యం పవిత్ర స్వర్ణ దేవాలయం. భారత వాయు రక్షణ దళాలు అత్యంత సమర్థవంతంగా ఈ కుట్రను భగ్నం చేసి ఆలయానికి రక్షణ కల్పించాయి.
#WATCH | Amritsar, Punjab: Indian Army shows a demo of how Indian Air Defence systems, including the upgraded L-70 Air Defence Guns, saved the Golden Temple in Amritsar and cities of Punjab from Pakistani missile and drone attacks. pic.twitter.com/acej4SgL3v
— ANI (@ANI) May 19, 2025
భారత సైన్యంలోని 15వ ఇన్ఫాంట్రీ డివిజన్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్మే జర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి ఈ సంచలన వివరాలను వెల్లడించారు. స్వర్ణ దేవాలయం లక్ష్యంగా వచ్చిన అన్ని డ్రోన్లు, క్షిపణులను ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ గన్నర్లు విజయవంతంగా కూల్చివేశాయని శేషాద్రి తెలిపారు. "పాకిస్థాన్ సైన్యానికి చట్టబద్ధమైన లక్ష్యాలు ఏవీ లేవు. అందుకే వారు భారత సైనిక స్థావరాలు, మతపరమైన ప్రదేశాలతో సహా పౌర లక్ష్యాలపై దాడి చేస్తారని ముందే ఊహించాం. వీటిలో స్వర్ణ దేవాలయం అత్యంత ప్రధానమైనదిగా గుర్తించి, ఆలయానికి సంపూర్ణ వాయు రక్షణ కల్పించేందుకు ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అదనంగా మోహరించాం" అని మేజర్ జనరల్ ప్రకటించారు.
#WATCH | Amritsar, Punjab: Indian Army shows a demo of how Indian Air Defence systems, including AKASH missile system, L-70 Air Defence Guns, saved the Golden Temple in Amritsar and cities of Punjab from Pakistani missile and drone attacks. pic.twitter.com/yulFvSFqKv
— ANI (@ANI) May 19, 2025
మే 8న పాకిస్థాన్ మానవరహిత విమానాలు, ప్రధానంగా డ్రోన్లు, సుదూర శ్రేణి క్షిపణులతో భారీ వైమానిక దాడికి పాల్పడింది. పాకిస్థానీ క్షిపణి, డ్రోన్ దాడుల నుంచి పంజాబ్లోని అమృత్సర్తో పాటు ఇతర నగరాలను ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, ఎల్-70 ఎయిర్ డిఫెన్స్ గన్లతో సహా భారతీయ వాయు రక్షణ వ్యవస్థలు ఎలా కాపాడాయో సోమవారం సైన్యం వివరించింది.
స్వదేశీ ఉత్పత్తి అయిన ఈ మిస్సైల్ వ్యవస్థ డ్రోన్లు మరియు మిస్సైళ్లను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించింది. ఈ గన్స్ తక్కువ ఎత్తులో ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా తాకాయి. ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్* వ్యవస్థ డ్రోన్లు, మైక్రో UAVలు మరియు లోయిటరింగ్ మ్యూనిషన్లను గుర్తించి నాశనం చేసింది.





















