అన్వేషించండి

India Pak Tensions: సంగారెడ్డిలోనూ ఉగ్రమూలాలు, పాకిస్తాన్‌కు సమాచారం చేరవేసిన నిందితుడు అరెస్ట్

Assam Police busts fake SIM racket | పాకిస్తాన్‌కు సమాచారం చేరవేస్తున్నారన్న సమాచారంతో అస్సం పోలీసులు ఏడుగుర్ని అరెస్ట్ చేశారు. అందులో ఒక నిందితుడ్ని తెలంగాణలోని సంగారెడ్డిలో అదుపులోకి తీసుకున్నారు.


సంగారెడ్డి: తెలంగాణలో ఉగ్రమూలాలు ఉండటం కలకలం రేపుతోంది. సంగారెడ్డి నుంచి ఓ వ్యక్తి పాకిస్థాన్ కు పకడ్బందీగా సమాచారాలు చేరవేస్తున్నాడు. అస్సాం పోలీసులు మొత్తం ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 948 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆ సిమ్ కార్డులను నిందితులు సైబర్ క్రైమ్స్‌తో పాటు యాంటీ నేషనల్ ఆపరేషన్లకు వినియోగించారని పోలీసులు స్పష్టం చేశారు. ఇటీవల జ్యోతి అనే హర్యానాకు చెందిన యూట్యూబర్ దేశ సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్లకు చేరవేసిందన్న కేసులో అరెస్ట్ చేశారు. ఆమెకు పాక్‌తో ఉన్న మరిన్ని లింకుల గురించి తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.

ఆపరేషన్ ఘోస్ట్ సిమ్ రాకెట్ కేసును అస్సాం పోలీసులు ఛేదించారు. మన దేశానికి చెందిన సిమ్ కార్డులతో OTPలు చెప్పి పాకిస్తాన్‌లో వాట్సప్ అకౌంట్లు క్రియేట్ చేసే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు భారత్‌కు సంబంధించిన పక్కా సమాచారాన్ని పాక్ లోని కొందరు ఏజెంట్లకు చేరవేస్తున్నారని NIA దగ్గర కీలక సమాచారం ఉంది. అస్సాం పోలీసులు అరెస్ట్ చేసిన ఏడుగురు నిందితుల్లో ఒకరు సంగారెడ్డిలో ఉంటున్నాడు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లిలో ఉంటున్న మోఫిజుల్ ఇస్లాం పాకిస్తాన్‌కు సమాచారం చేరవేస్తున్నట్లు గుర్తించారు.

కేంద్ర ఇంటలిజెన్సీ బలగాల హెచ్చరికతో అప్రమత్తమైన అస్సాం పోలీసులు మొత్తం ఏడుగురు సిమ్ రాకెట్ నిందితులను అరెస్ట్ చేశారు. అందులో ఇస్లాం అనే వ్యక్తి అస్సాం నుంచి వచ్చి సంగారెడ్డిలో కూలీ మేస్త్రిగా జీవనం సాగిస్తున్నాడు. ఇక్కడున్న యువకులను ఉగ్రవాదులుగా తయారు చేయడం, ఫేక్ సిమ్ కార్డులు క్రియేట్ చేసి పాకిస్తాన్ ఏజెంట్లకు పక్కా సమాచారం ఇవ్వడం ఇస్లాం పనిగా పెట్టుకున్నాడు. 

అస్సాంలో మొబైల్ షాపులో పనిచేసిన ఇస్లాం వేరే వ్యక్తుల గుర్తింపు కార్డులతో సిమ్ లు తీసుకుని అధిక ధరలకు విక్రయించేవాడు. ప్రస్తుతం సంగారెడ్డిలోని గొల్లపల్లిలో ఉంటున్న నిందితుడు పాకిస్తాన్ వారికి సైతం సిమ్ లు విక్రయించడంతో పాటు దేశంలో ప్రస్తుత పరిస్థితిని, యుద్ధం సమయంలో మీడియాలో వచ్చిన సమాచారాన్ని పాక్ లోని వ్యక్తుల వాట్సాప్ గ్రూపులో చేరవేసేవాడు. నిందితులు దేశంలోని పలు రాష్ట్రాల్లో చిన్నాచితకా పనులు చేసుకుంటూ, సామాన్యులుగా జీవనం సాగిస్తున్నట్లు చుట్టుపక్కల వారిని నమ్మించేవారు. తమపై అనుమానం రాకుండా పాక్‌కు దేశ సమాచారం చేరవేసినట్లు అధికారులు గుర్తించారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు తేలనున్నాయి. వీరితో పాటు ఇంకా ఎవరైనా పాక్ కోసం పనిచేశారా, వీరి ప్లాన్ ఏంటనేది అధికారుల తేల్చనున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Embed widget