అన్వేషించండి

Road Accidents: వరుస ప్రమాదాలతో రక్తమోడుతున్న రహదారులు - అనంతలో బస్సు, ట్రాక్టర్ ఢీకొని నలుగురు మృతి

Andhra News: ప్రకాశం జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన విషాద ఘటన మరువక ముందే అనంత జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. కల్లూరు వద్ద ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

Four Died in Road Accident in Ananthapuram: రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో రహదారులు రక్తమోడాయి. ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో రోడ్డు ప్రమాద ఘటనల్లో 9 మంది ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. అనంతపురం (Ananthapuram) జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గార్లదిన్నె (Garladinne) మండలం కల్లూరు (Kalluru) వద్ద జాతీయ రహదారి నెం 44పై బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను ఓ ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు గుత్తి మండలం మామిడూరుకు చెందిన చిన్నతిప్పయ్య (45), శ్రీరాములు (45), నాగార్జున (30), శ్రీనివాసులు (30)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్ సహా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండగా, అతన్ని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

బంధువుల ఆందోళన

మరోవైపు, మృతుల బంధువులు రహదారిపైనే ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించి పరిహారం ప్రకటించే వరకూ మృతదేహాలను తరలించేందుకు వీల్లేదని రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో హైదరాబాద్ - బెంగుళూరు హైవేపై రెండు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గుంతకల్లు వైసీపీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి వచ్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు సద్దిచెప్పడంతో ఆందోళన విరమించుకున్నారు. 

ప్రకాశం జిల్లాలోనూ

ప్రకాశం (Prakasam) జిల్లా పెద్దారవీడు (Peddaraveedu) మండలం దేవరాజుగట్టు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. వంతెన పైనుంచి ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు మాబూ, అభినయ్ (10), రాయ వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావుగా గుర్తించారు. గాయపడిన వారిలో ఇద్దరిని మార్కాపురం, ముగ్గురిని స్థానికులు, పోలీసులు కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అయితే, మెరుగైన వైద్యం కోసం మార్కాపురం నుంచి ఇద్దరు ఒంగోలు ఆస్పత్రికి తరలిస్తుండగా డానియల్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఓ గృహ ప్రవేశ కార్యక్రమానికి గుంటూరు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Telangana News: ఉచిత బస్సు ప్రయాణం - మహిళలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Virat Kohli and Rohit Sharma Records: బ్యాట్ పట్టకముందే రోహిత్ శర్మ, కోహ్లీ ద్వయం రికార్డ్.. భారత్ నుంచి నెం 1 జోడీ
బ్యాట్ పట్టకముందే రోహిత్ శర్మ, కోహ్లీ ద్వయం రికార్డ్.. భారత్ నుంచి నెం 1 జోడీ
Akhanda 2 Tickets : 'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
Advertisement

వీడియోలు

India vs South Africa First ODI | నేడు భారత్ సఫారీ మధ్య మొదటి వన్డే
Ind vs SA ODI KL Rahul | కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Faf du Plessis Out of IPL 2026 | IPLకు స్టార్ ప్లేయర్ గుడ్​బై
BCCI Meeting With Rohit, Kohli | రో-కోతో గంభీర్ సమావేశం?
I Bomma Ravi Piracy Sites Issue Explained | మనం చూసే ఒక్క సినిమాతో.. లక్షల కోట్ల నేర సామ్రాజ్యం బతికేస్తోంది | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Virat Kohli and Rohit Sharma Records: బ్యాట్ పట్టకముందే రోహిత్ శర్మ, కోహ్లీ ద్వయం రికార్డ్.. భారత్ నుంచి నెం 1 జోడీ
బ్యాట్ పట్టకముందే రోహిత్ శర్మ, కోహ్లీ ద్వయం రికార్డ్.. భారత్ నుంచి నెం 1 జోడీ
Akhanda 2 Tickets : 'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు.. మరిన్ని చిక్కుల్లో సోనియా, రాహుల్ గాంధీ
నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్.. మరిన్ని చిక్కుల్లో సోనియా, రాహుల్ గాంధీ
IND vs SA 1st ODI India Playing XI: దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. జట్టులోకి రోహిత్, కోహ్లీ.. ప్లేయింగ్ లెవన్ ఇదే!
దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. జట్టులోకి రోహిత్, కోహ్లీ.. ప్లేయింగ్ లెవన్ ఇదే!
Jobs: మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
The Girlfriend OTT : ఓటీటీలోకి రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget