అన్వేషించండి

Road Accidents: వరుస ప్రమాదాలతో రక్తమోడుతున్న రహదారులు - అనంతలో బస్సు, ట్రాక్టర్ ఢీకొని నలుగురు మృతి

Andhra News: ప్రకాశం జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన విషాద ఘటన మరువక ముందే అనంత జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. కల్లూరు వద్ద ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

Four Died in Road Accident in Ananthapuram: రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో రహదారులు రక్తమోడాయి. ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో రోడ్డు ప్రమాద ఘటనల్లో 9 మంది ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. అనంతపురం (Ananthapuram) జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గార్లదిన్నె (Garladinne) మండలం కల్లూరు (Kalluru) వద్ద జాతీయ రహదారి నెం 44పై బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను ఓ ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు గుత్తి మండలం మామిడూరుకు చెందిన చిన్నతిప్పయ్య (45), శ్రీరాములు (45), నాగార్జున (30), శ్రీనివాసులు (30)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్ సహా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండగా, అతన్ని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

బంధువుల ఆందోళన

మరోవైపు, మృతుల బంధువులు రహదారిపైనే ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించి పరిహారం ప్రకటించే వరకూ మృతదేహాలను తరలించేందుకు వీల్లేదని రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో హైదరాబాద్ - బెంగుళూరు హైవేపై రెండు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గుంతకల్లు వైసీపీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి వచ్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు సద్దిచెప్పడంతో ఆందోళన విరమించుకున్నారు. 

ప్రకాశం జిల్లాలోనూ

ప్రకాశం (Prakasam) జిల్లా పెద్దారవీడు (Peddaraveedu) మండలం దేవరాజుగట్టు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. వంతెన పైనుంచి ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు మాబూ, అభినయ్ (10), రాయ వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావుగా గుర్తించారు. గాయపడిన వారిలో ఇద్దరిని మార్కాపురం, ముగ్గురిని స్థానికులు, పోలీసులు కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అయితే, మెరుగైన వైద్యం కోసం మార్కాపురం నుంచి ఇద్దరు ఒంగోలు ఆస్పత్రికి తరలిస్తుండగా డానియల్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఓ గృహ ప్రవేశ కార్యక్రమానికి గుంటూరు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Telangana News: ఉచిత బస్సు ప్రయాణం - మహిళలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Embed widget