అన్వేషించండి

Ajay Jadeja : జామ్‌నగర్ సంస్థానం వారసుడు అజయ్ జడేజా - రాజ్యం లేకపోయినా రాజే !

Cricketer Ajay Jadeja : క్రికెటర్ అజయ్ జడేజా గురించి తెలియని వాళ్లు తక్కువ. డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్‌మెన్. ఇప్పుడు ఆయన ఓ సంస్థానానికి వారసుడు అయ్యాడు. త్వరలో మహారాజ్ కానున్నారు.

Former Cricketer Ajay Jadeja Named Heir To Jamnagar Throne :  2020లో క్రికెట్‌లో సూపర్ స్టార్లు ఎవరంటే ఖచ్చితంగా గుర్తుకు వచ్చే పేరు అజయ్ జడేజా. ఎన్నో సార్లు గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడి గొప్పవిజయాలు టీమిండియాకు తెచ్చి పెట్టారు. ఆయన ఇప్పుడు జామ్ నగర్ రాజ కుటుంబానికి వారసుడిగా ఎంపికయ్యాడు.   ప్రస్తుత జామ్ సాహెబ్ శత్రుసల్యసింహ్‌జీ దిగ్విజయ్‌సింహ్‌జీ అజయ్ జడేజాను అధికారికంగా దసరా పర్వదినం సందర్భంగా ప్రకటించారు. "  పాండవులు 14 సంవత్సరాల అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న రోజు అయిన  దసరా పర్వదినం సందర్భంగా అజయ్ జడేజాను రాజ కుటుంబానికి వారసుడిగా, నవానగర్‌కు తదుపరి జాం సాహెబ్‌గా ప్రకటిస్తున్నాము. నా వారసుడిగా అతడు  సింహాసనాన్ని అధిష్టిస్తాడు" అని దిగ్విజయ్ సింహ్ జీ ప్రకటించారు.  

క్రికెట్‌కు ఎంతో చేసిన జామ్ నగర్ రాజా కుటుంబం 

రంజీ ట్రోఫి, దులీప్ ట్రోఫీలకు ఆ పేర్లు జామ్ నగర్ రాజుల కారణంగానే వచ్చాయి. రంజీ ట్రోఫికి ఆ పేరును జామ్ నగర్ రాజ వంశీకుడు అయిన K.S.రంజిత్‌సింహ్‌జీకి గుర్తుగా పెట్టారు. దులీప్ ట్రోఫీని అదే వంశానికి చెందిన  K.S. దులీప్‌సింహ్‌జీ పేరు పెట్టారు. ఊరకనే వీరి పేరు పెట్టలేదు. భారత్ క్రికెట్‌కు ఈ రాజకుటుంబం అందించిన అండదండలకు గుర్తుగా, గౌరవంగా వారి పేరు  పెట్టారు.  అజయ్ జడేజా కూడా ఈ కుటుంబానికి చెందిన వారే. క్రికెట్‌ పట్ల ఆ కుటుంబంలో ఉన్న ఆసక్తి అజయ్ జడేజాకూ వచ్చింది. అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగారు. 

టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో రిషబ్ పంత్ యాక్టింగ్ చేశాడా! రోహిత్ కామెంట్లపై స్పందించిన కీపర్

అంతర్జాతీయ క్రికెటర్‌గా జడేజా రాణింపు
 
1990లో భారత క్రికెట్‌ చూసిన గొప్ప క్రికెటర్లలో జడేజా ఒకడు.  1992 నుంచి 2000 వరకు 15 టెస్టులు, 196 వన్డేల్లో భారత జట్టుకు అజేయ్‌ ప్రాతినిథ్యం వహించాడు. ముఖ్యంగా 1996 వన్డే ప్రపంచకప్‌లో బెంగళూరు వేదికగా జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో పాక్‌పై జడేజా ఆడిన ఇన్నింగ్స్‌ సగటు క్రికెట్‌ అభిమానికి ఇప్పటికి గుర్తుండి ఉంటుంది.  జడేజా కేవలం 25 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అందులో  40 పరుగులు దిగ్గజ పేసర్‌ వకార్ యూనిస్ వేసిన చివరి రెండు ఓవర్లలో వచ్చాయి. తర్వాత ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఆ కారణంగా ఆటకు దూరమయ్యారు. ఆ ఆరోపణలు తేలిపోయినా మరోసారి క్రికెట్ వైపు చూడలేదు.                                       

యాక్షన్ మోడ్‌లోకి వెళ్తున్న స్టార్ బాయ్ - రిలీజ్ డేట్‌తో వచ్చిన ‘కోహినూర్’!

కిరీటం లేకపోయినా వారసత్వంగా మహారాజ్ 

అజయ్ జడేజా రాజకీయ నాయకురాలిగా ఉన్న  జయా జైట్లీ కుమార్తెను వివాహం చేసుకున్నారు.  దిగ్విజయ్ సింహ్ జీ తరవాత నవానగర్ గా పిలిచే జామ్ నగర్ సామ్రాజ్యానికి మహారాజు అవుతారు. ఇప్పుడు రాచరికాలు, సంస్థానాలు లేవు కానీ.. నవానగర్ రాజకుటుంబం మాత్రం వారసత్వం ప్రకటిస్తూనే ఉంటోంది.    

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

5 Best Car Options: సిటీ రోడ్లపై నడిపేందుకు 5 బెస్ట్ కార్లు ఇవే.. ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
సిటీ రోడ్లపై నడిపేందుకు 5 బెస్ట్ కార్లు ఇవే.. ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Breaking News: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. మే 28న సిద్ధరామయ్య రాజీనామా!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. మే 28న సిద్ధరామయ్య రాజీనామా!
Super Splendor XTEC 2.0 Launched: హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ 2.0 లాంచ్: సరికొత్త డిజైన్, మైలేజ్ ఫీచర్లతో వచ్చిన అప్‌డేటెడ్ బైక్
హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ 2.0 లాంచ్: సరికొత్త డిజైన్, మైలేజ్ ఫీచర్లతో వచ్చిన అప్‌డేటెడ్ బైక్
Driving Without Insurance: ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏమవుతుంది? పెరుగుతున్న జరిమానాలు, ప్రమాదాలు
ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏమవుతుంది? పెరుగుతున్న జరిమానాలు, ప్రమాదాలు

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Chandrababu Speech At Mahanadu: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
BRS Aggressive Politics: బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
CM Revanth Reddy: గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget