అన్వేషించండి

Electoral Bonds Case: పొలిటికల్ హీట్ పెంచిన ఎలక్టోరల్ బాండ్స్ కేసు, బీజేపీపై కాంగ్రెస్ ఫైర్

Electoral Bonds Case: ఎలక్టోరల్ బాండ్స్ పేరు చెప్పి బీజేపీ అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ బీజేపీపై తీవ్రంగా మండి పడుతోంది.

Electoral Bonds Case: ఎలక్టోరల్ బాండ్స్ కేసు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే SBIపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. అడిగిన విధంగా సరైన వివరాలు ఇవ్వడం లేదని మండి పడుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీ బీజేపీపై విమర్శలు గుప్పిస్తోంది. ఎలక్టోరల్ బాండ్స్ పేరు చెప్పి బీజేపీ అవకతవకలకు పాల్పడిందని,అది ఎక్కడ బయటపడుతుందోనని భయపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. డొల్ల కంపెనీలను రక్షించేందుకు ఇలా పెద్ద ఎత్తున విరాళాలు తీసుకుందని ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ఈ వివాదంపై తీవ్రంగా స్పందించారు. యునిక్ బాండ్ ఐడీ నంబర్స్‌ అందరికీ తెలిసేలా వెల్లడించాలని, అప్పుడే నిజానిజాలేంటో బయటపడతాయని డిమాండ్ చేశారు. కావాలనే SBI ఈ విషయంలో జాప్యం చేస్తోందని, ఎన్నికల వరకూ ఇలాగే సాగదీయాలని చూస్తోందని విమర్శించారు. 2019 నుంచి బీజేపీకి రూ.6 వేల కోట్ల మేర విరాళాల రూపంలో వచ్చాయని వెల్లడించారు. దాదాపు 1,300  సంస్థలు, వ్యక్తులకు SBI ఎలక్టోరల్ బాండ్స్‌ విక్రయించిందని తేల్చి చెప్పారు. ఇప్పటికే విడుదలైన వివరాల ఆధారంగా చూస్తే బీజేపీ కచ్చితంగా ఏదో మోసానికి పాల్పడినట్టు అర్థమవుతోందని ఫైర్ అయ్యారు జైరాం రమేశ్. 

"బీజేపీ ఎలక్టోరల్ బాండ్స్‌ పేరు చెప్పి క్విడ్ ప్రో కో కి పాల్పడింది. కొన్ని కంపెనీలు బీజేపీకి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చాయి. అలా ఇచ్చిన వెంటనే ఆ సంస్థలకు భారీ లాభాలు వచ్చాయి. ఇదే అనుమానంగా ఉంది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో రూ.800 కోట్లు ఇచ్చింది. 2023 ఏప్రిల్‌లో రూ.140 కోట్లు విరాళమిచ్చింది. ఆ తరవాత నెల రోజులకే థానే బోరివల్ ట్విన్ టన్నెల్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌ని ఆ కంపెనీకి కట్టబెట్టారు. రూ.14,400 కోట్ల విలువైన ప్రాజెక్ట్ ఇది"

- జైరాం రమేశ్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ 

ఆ వివరాలు ఎక్కడికి పోయాయి: కాంగ్రెస్ 

2022 అక్టోబర్ 7వ తేదీన జిందాల్ స్టీల్ కంపెనీ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో రూ.25 కోట్ల విరాళమిచ్చిందని, ఆ తరవాత మూడు రోజులకే ఓ కోల్‌మైన్‌ని కట్టబెట్టారని ఆరోపించారు. అంతే కాదు. గతేడాది కేంద్ర ప్రభుత్వం కావాలనే ఈడీ, సీబీఐ దాడులు చేయించి, బెదిరించి విరాళాలు రాబట్టుకుందని విమర్శించారు. విరాళాలు ఇచ్చిన కంపెనీలకు భారీ లాభాలు వచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపణలు చేశారు. పైగా ఓ కంపెనీ ఇంత మాత్రమే విరాళంగా ఇవ్వాలన్న నిబంధననూ కావాలనే తొలగించారని మండి పడ్డారు. అసలు కీలకమైన డేటా కనిపించకుండాపోవడమే అన్నింటికన్నా ఎక్కువ అనుమానాలకు తావిస్తోందని కాంగ్రెస్ అంటోంది. దాదాపు రూ.2,500 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్‌ వివరాలు కనిపించకుండా పోయాయని చెబుతోంది. 2018 మార్చి నుంచి 2019 ఏప్రిల్ మధ్య కాలంలోని బాండ్ల వివరాలు మిస్ అవ్వడంపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఈ కేసుపై సుప్రీంకోర్టు కాస్త గట్టిగానే దృష్టి పెట్టింది. 

Also Read: Russian Presidential Elections: కేరళలో రష్యా అధ్యక్ష ఎన్నికల హడావుడి, పోలింగ్‌కి ఏర్పాట్లు కూడా చేశారు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Embed widget