అన్వేషించండి

Alert News: మానవాళికి మరో ముప్పు - ఈ వైరస్ వస్తే 48 గంటల్లో చావు - కాంగో నుంచి స్టార్ట్

Congo : కాంగో దేశాన్ని ఓ మిస్టరీ వైరస్ హడలెత్తిస్తోంది. నలభై ఎనిమిది గంటల్లో ఈ వైరస్ సోకిన వారు చనిపోయారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ అంశంపై స్పందించింది.

Death within 48 hours: ప్రపంచాన్ని ఇప్పుడు వైరస్‌లు హడలెత్తిస్తున్నాయి. ఏ దేశంలో ఏ వైరస్ ఆవిర్భవించి ప్రపంచం మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. తాజాగా  కాంగోలో ఒక కొత్త వైరస్ వల్ల యాభై మందికిపైగా చనిపోయారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)ఈ విషయాన్నిప్రకటించింది. వారికి సోకిన వైరస్ ఏమిటో తెలుసుకోవడానికి నిపుణులు ప్రయత్నిస్తున్నారు.  చాలా మంది రోగులు ఈ  కొత్త వైరస్ సోకిన లక్షణాలతో ఆస్పత్రికి వచ్చి   48 గంటల్లోనే మరణించారని వైద్యులు ప్రకటించారు. ఈ వైరస్ ను మొదట జనవరి 21న కనిపెట్టారు. ఇప్పటి వరకూ  53 మరణాలతో సహా 419 కేసులు నమోదయినట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.               

మొదటి సారి గబ్బిలాల్ని తిన్న పిల్లలకు వచ్చిన వైరస్ 

ఈ వైరస్ గబ్బిలాన్ని పిల్లలు తినడం ద్వారా వచ్చిందని గుర్తించారు. కాంగోలోని బోలోకోకు చెందిన ముగ్గురు పిల్లలు గబ్బిలాన్ని వేటాడి తిన్నారు. వారు ఆ  ఆ గబ్బిలాన్ని తిన్న 48 గంటల్లోనే రక్తస్రావం, జ్వరం లక్షణాలతో  చనిపోయారు. తర్వాత ఈ తరహా లక్షణాలతో వైరస్ వ్యాప్తి ప్రారంభమయింది.అడవి జంతువులను మనుషులు వేటాడి తినే ప్రాంతాల్లో పుట్టే వైరస్‌ల గురించి చాలా కాలంగా ఆందోళనలు ఉన్నాయి. ఆఫ్రికాలో ఇటువంటి వైరస్‌ల వ్యాప్తి అయ్యే సంఖ్య గత దశాబ్దంలో 60% కంటే ఎక్కువ పెరిగిందని WHO 2022లో తెలిపింది.     

టెస్టులు చేయిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ 

ఫిబ్రవరి 9న బోమాట్ పట్టణంలో ప్రస్తుత మిస్టరీ  వైరస్  రెండవసారి వ్యాప్తి చెందిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంది.  13 కేసుల నుండి నమూనాలను పరీక్ష కోసం కాంగో రాజధాని కిన్షాసాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్‌కు పంపినట్లు WHO తెలిపింది.అన్ని నమూనాలలో ఎబోలా ,  మార్బర్గ్ వంటి ఇతర సాధారణ హెమరేజిక్ జ్వరం వైరస్‌‌లలు..  కొన్నింటికి మలేరియా పాజిటివ్‌గా తేలినట్లుగా చెబుతున్నారు. అసలు ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో తెలుసుకున్న తర్వాత .. దీని ప్రభావం ప్రపంచంపై ఎలా ఉంటుందో అంచనా వేసే అవకాశం ఉంది.               

కరోనా వచ్చినప్పటి నుండి వైరస్‌ల భయం          

గతంలో చైనాలోని వుహాన్ లో కరోనా వైరస్ పుట్టినప్పుడు ఆ వైరస్ గురించి  చైనా ఏమీ చెప్పలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అది పెద్ద ప్రమాదకరం కాదని చెప్పింది.కానీ రాను రాను ఆ వైరస్ ప్రపంచాన్ని హడలెత్తించింది. దాదాపుగా అన్ని ప్రపంచ దేశాలు  లాక్ డౌన్ ప్రకటించుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఏ దేశంలో కొత్త వైరస్ కనిపించినా ప్రపంచం అంతా అలర్ట్ అవుతోంది.           

Also Read:  ఇండియాపై గెలవకపోతే నా పేరు షాబాజ్ షరీఫ్ కాదన్నాడు పాకిస్తాన్ ప్రధాని - ఇప్పుడు ఆయనకు ఎన్ని పేర్లు పెడుతున్నారంటే ?

టాప్ హెడ్ లైన్స్

SIR పై అప్రమత్తంగా ఉండాలి, ఒక్క ఓటు కూడా గల్లంతు కాకూడదు: Jupally Krishna Rao
SIR పై అప్రమత్తంగా ఉండాలి, ఒక్క ఓటు కూడా గల్లంతు కాకూడదు: Jupally Krishna Rao
YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
Womens World Cup IND W VS AUS W : కంగారూలతో టీమిండియా మహిళలకు అసలైన అగ్నిపరీక్ష.. సెమీస్ బెర్త్ కోసం చావో రేవో, అడుగు దూరంలో నాకౌట్ రేస్
కంగారూలతో టీమిండియా మహిళలకు అసలైన అగ్నిపరీక్ష.. సెమీస్ బెర్త్ కోసం చావో రేవో, అడుగు దూరంలో నాకౌట్ రేస్
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget