Alert News: మానవాళికి మరో ముప్పు - ఈ వైరస్ వస్తే 48 గంటల్లో చావు - కాంగో నుంచి స్టార్ట్
Congo : కాంగో దేశాన్ని ఓ మిస్టరీ వైరస్ హడలెత్తిస్తోంది. నలభై ఎనిమిది గంటల్లో ఈ వైరస్ సోకిన వారు చనిపోయారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ అంశంపై స్పందించింది.

Death within 48 hours: ప్రపంచాన్ని ఇప్పుడు వైరస్లు హడలెత్తిస్తున్నాయి. ఏ దేశంలో ఏ వైరస్ ఆవిర్భవించి ప్రపంచం మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. తాజాగా కాంగోలో ఒక కొత్త వైరస్ వల్ల యాభై మందికిపైగా చనిపోయారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)ఈ విషయాన్నిప్రకటించింది. వారికి సోకిన వైరస్ ఏమిటో తెలుసుకోవడానికి నిపుణులు ప్రయత్నిస్తున్నారు. చాలా మంది రోగులు ఈ కొత్త వైరస్ సోకిన లక్షణాలతో ఆస్పత్రికి వచ్చి 48 గంటల్లోనే మరణించారని వైద్యులు ప్రకటించారు. ఈ వైరస్ ను మొదట జనవరి 21న కనిపెట్టారు. ఇప్పటి వరకూ 53 మరణాలతో సహా 419 కేసులు నమోదయినట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
మొదటి సారి గబ్బిలాల్ని తిన్న పిల్లలకు వచ్చిన వైరస్
ఈ వైరస్ గబ్బిలాన్ని పిల్లలు తినడం ద్వారా వచ్చిందని గుర్తించారు. కాంగోలోని బోలోకోకు చెందిన ముగ్గురు పిల్లలు గబ్బిలాన్ని వేటాడి తిన్నారు. వారు ఆ ఆ గబ్బిలాన్ని తిన్న 48 గంటల్లోనే రక్తస్రావం, జ్వరం లక్షణాలతో చనిపోయారు. తర్వాత ఈ తరహా లక్షణాలతో వైరస్ వ్యాప్తి ప్రారంభమయింది.అడవి జంతువులను మనుషులు వేటాడి తినే ప్రాంతాల్లో పుట్టే వైరస్ల గురించి చాలా కాలంగా ఆందోళనలు ఉన్నాయి. ఆఫ్రికాలో ఇటువంటి వైరస్ల వ్యాప్తి అయ్యే సంఖ్య గత దశాబ్దంలో 60% కంటే ఎక్కువ పెరిగిందని WHO 2022లో తెలిపింది.
టెస్టులు చేయిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఫిబ్రవరి 9న బోమాట్ పట్టణంలో ప్రస్తుత మిస్టరీ వైరస్ రెండవసారి వ్యాప్తి చెందిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంది. 13 కేసుల నుండి నమూనాలను పరీక్ష కోసం కాంగో రాజధాని కిన్షాసాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్కు పంపినట్లు WHO తెలిపింది.అన్ని నమూనాలలో ఎబోలా , మార్బర్గ్ వంటి ఇతర సాధారణ హెమరేజిక్ జ్వరం వైరస్లలు.. కొన్నింటికి మలేరియా పాజిటివ్గా తేలినట్లుగా చెబుతున్నారు. అసలు ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో తెలుసుకున్న తర్వాత .. దీని ప్రభావం ప్రపంచంపై ఎలా ఉంటుందో అంచనా వేసే అవకాశం ఉంది.
కరోనా వచ్చినప్పటి నుండి వైరస్ల భయం
గతంలో చైనాలోని వుహాన్ లో కరోనా వైరస్ పుట్టినప్పుడు ఆ వైరస్ గురించి చైనా ఏమీ చెప్పలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అది పెద్ద ప్రమాదకరం కాదని చెప్పింది.కానీ రాను రాను ఆ వైరస్ ప్రపంచాన్ని హడలెత్తించింది. దాదాపుగా అన్ని ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ప్రకటించుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఏ దేశంలో కొత్త వైరస్ కనిపించినా ప్రపంచం అంతా అలర్ట్ అవుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

