అన్వేషించండి

Covid-19 Cases: భారీగా నమోదవుతున్న కరోనా కేసులు, 3 వేల మంది వైరస్‌- ఆరుగురు మృతి

Covid-19 Cases: దేశంలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 3 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత కొన్ని వారాలుగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి.

Covid-19 Cases: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని వారాలుగా విపరీతంగా కేసులు వెలుగుచూస్తున్నాయి. కేసుల్లో ఉద్ధృతి తీవ్రంగా ఆందోళన కలిపిస్తోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న వేలాది కేసులతో అధికారులు అప్రమత్తం అయ్యారు. భారత్ లో నిన్న ఒక్కరోజే 3 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. మహమ్మారి బారిన పడి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 15 వేలు దాటాయి. గత 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 3,095 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత క్రియాశీల కేసుల సంఖ్య 15,208 గా ఉంది. 24 గంటల్లో 1,396 మంది కరోనాను జయించి  ఆస్పత్రి నుండి డిశ్చార్జీ అయినట్లు నివేదికలు చెబుతున్నాయి. కరోనా రికవరీ రేటు 98.78 శాతం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. 

గత కొన్ని రోజులుగా కరోనా కేసుల్లో విపరీతమైన పెరుగుదల నమోదు అవుతోంది. మార్చి 30వ తేదీన నమోదు అయిన కేసులతో పోలిస్తే మార్చి 31న వెలుగు చూసిన కేసుల్లో 50 శాతం పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో కొత్తగా 694 కేసులు నమోదు అయ్యాయి. కేరళలో 765 కేసులు వెలుగు చూశాయి. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈ వారంలో సోమవారంతో పోలిస్తే మంగళవారం దేశవ్యాప్త కేసుల్లో కొంత తగ్గుదల కనిపించింది. తిరిగి బుధవారం కేసులు పెరిగాయి. గురు, శుక్రవారాల్లోనూ విపరీతమైన పెరుగుదల ప్రస్తుతం అధికారులను ఆందోళనకు  గురి చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కరోనా కేసుల పెరుగుదలపై అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ప్రధానమంత్రి నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ 1.16 ఉద్ధృతి వల్లే కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు పెరిగితే కేసులు కూడా పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు.

గర్భధారణ సమయంలో కోవిడ్ వస్తే పుట్టే పిల్లల్లో ఊబకాయం వచ్చే ప్రమాదం 

ఎండోక్రైన్ సొసైటీకి చెందిన జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ & మెటబాలిజంలో ప్రచురించిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం, గర్భధారణ సమయంలో కోవిడ్-19 వచ్చే తల్లులకు జన్మించిన పిల్లలు ఊబకాయం వచ్చే అవకాశం ఉంది.

2019 నుంచి యునైటెడ్ స్టేట్స్‌లో 100 మిలియన్లకు పైగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ ఇన్‌ఫెక్షన్ వల్ల దీర్ఘకాలికందా ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయన్న సమాచారం ఉంది. "మా పరిశోధనలు కోవిడ్-19కి గురైన గర్భిణీలకు పుట్టిన పిల్లల జీవితంపై ప్రభావం చూపించనుంది. ఇది స్థూలకాయం, షుగర్‌,  హృదయ సంబంధ వ్యాధులకు కారణం కావచ్చు " అని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ ఎండీ లిండ్సే టీ ఫోర్మాన్ అన్నారు. "గర్భిణీ స్త్రీలు. వారి పిల్లలపై COVID-19 ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా చాలా పరిశోధనలు అవసరం." గర్భధారణ సమయంలో COVID-19 ఉన్న తల్లులకు జన్మించిన 150 మంది శిశువులను పరిశోధకులు అధ్యయనం చేశారు. తల్లులకు ప్రినేటల్ ఇన్‌ఫెక్షన్ లేని 130 మంది శిశువులతో పోలిస్తే వారు తక్కువ బరువు కలిగి ఉన్నారని కనుగొన్నారు. ఈ మార్పులు ఊబకాయం, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad ORR Car Fire Accident: కారులో మంటలు చెలరేగి ఓఆర్‌ఆర్‌పై డ్రైవర్‌ సజీవ దహనం
కారులో మంటలు చెలరేగి Hyderabad ఓఆర్‌ఆర్‌పై డ్రైవర్‌ సజీవ దహనం
Raithanna Meekosam: అన్నదాతలకు అండగా ప్రభుత్వం.. ఏపీలో నేటి నుంచి రైతన్నా మీకోసం కార్యక్రమాలు
అన్నదాతలకు అండగా ప్రభుత్వం.. ఏపీలో నేటి నుంచి రైతన్నా మీకోసం కార్యక్రమాలు
Raj Mantena: అమెరికా అధ్యక్షుడి కొడుకు, బాలీవుడ్ స్టార్లు.. ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఇంత గ్రాండ్ వెడ్డింగ్! అసలు ఎవరీ రామరాజు మంతెన?
కూతురు పెళ్లికి జూనియర్ ట్రంప్‌నే దించాడు.. ఎవరీ రాజ్‌ మంతెన..?
CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

వీడియోలు

కెప్టెన్‌గా రాహుల్.. షమీకి మళ్లీ నిరాశే..!
India vs South Africa 2nd Test Match Highlights | మూడో సెషన్లో టీమిండియా కం బ్యాక్
England vs Australia Ashes 2025 | ఆస్ట్రేలియా ఘన విజయం
Travis Head Records in Ashes 2025 | ట్రావిస్ హెడ్ రికార్డుల మోత
Shreyas Iyer Injury IPL 2026 | టీ20 ప్రపంచకప్‌ కు అయ్యర్ దూరం ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ORR Car Fire Accident: కారులో మంటలు చెలరేగి ఓఆర్‌ఆర్‌పై డ్రైవర్‌ సజీవ దహనం
కారులో మంటలు చెలరేగి Hyderabad ఓఆర్‌ఆర్‌పై డ్రైవర్‌ సజీవ దహనం
Raithanna Meekosam: అన్నదాతలకు అండగా ప్రభుత్వం.. ఏపీలో నేటి నుంచి రైతన్నా మీకోసం కార్యక్రమాలు
అన్నదాతలకు అండగా ప్రభుత్వం.. ఏపీలో నేటి నుంచి రైతన్నా మీకోసం కార్యక్రమాలు
Raj Mantena: అమెరికా అధ్యక్షుడి కొడుకు, బాలీవుడ్ స్టార్లు.. ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఇంత గ్రాండ్ వెడ్డింగ్! అసలు ఎవరీ రామరాజు మంతెన?
కూతురు పెళ్లికి జూనియర్ ట్రంప్‌నే దించాడు.. ఎవరీ రాజ్‌ మంతెన..?
CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
Best Cruiser Bikes: ఇండియన్‌ రోడ్లకు ఫ్రెండ్లీగా ఉండే టాప్ 5 క్రూజర్ బైక్స్‌, కో-రైడర్‌కూ ఫుల్‌ కంఫర్ట్‌ - ధరలు & ఫీచర్లు
ఫుల్‌ కంఫర్ట్ ఇచ్చే టాప్ 5 క్రూజర్ బైక్స్‌ - Meteor 350 నుంచి X440 వరకు
ABP Southern Rising Summit: ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొని కీలక ప్రసంగం చేయనున్న కేటీఆర్
ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొని కీలక ప్రసంగం చేయనున్న కేటీఆర్
Orthopedic Symptoms : చలికాలంలో  కీళ్ల నొప్పులు, వాపులను తేలిగ్గా తీసుకోకండి.. అస్సలు విస్మరించకూడదంటోన్న వైద్యులు
చలికాలంలో కీళ్ల నొప్పులు, వాపులను తేలిగ్గా తీసుకోకండి.. అస్సలు విస్మరించకూడదంటోన్న వైద్యులు
Royal Enfield Unveils Meteor 350 సన్‌డౌనర్‌ ఆరెంజ్‌ వచ్చేసింది - కొత్త కలర్‌, కొత్త కంఫర్ట్‌, అదే నమ్మకమైన పెర్ఫార్మెన్స్‌
Royal Enfield Unveils Meteor 350 సన్‌డౌనర్‌ ఆరెంజ్‌ లాంచ్‌ - ఇది లిమిటెడ్‌ ఎడిషన్‌ మామా
Embed widget