అన్వేషించండి

Covid-19 Cases: భారీగా నమోదవుతున్న కరోనా కేసులు, 3 వేల మంది వైరస్‌- ఆరుగురు మృతి

Covid-19 Cases: దేశంలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 3 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత కొన్ని వారాలుగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి.

Covid-19 Cases: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని వారాలుగా విపరీతంగా కేసులు వెలుగుచూస్తున్నాయి. కేసుల్లో ఉద్ధృతి తీవ్రంగా ఆందోళన కలిపిస్తోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న వేలాది కేసులతో అధికారులు అప్రమత్తం అయ్యారు. భారత్ లో నిన్న ఒక్కరోజే 3 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. మహమ్మారి బారిన పడి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 15 వేలు దాటాయి. గత 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 3,095 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత క్రియాశీల కేసుల సంఖ్య 15,208 గా ఉంది. 24 గంటల్లో 1,396 మంది కరోనాను జయించి  ఆస్పత్రి నుండి డిశ్చార్జీ అయినట్లు నివేదికలు చెబుతున్నాయి. కరోనా రికవరీ రేటు 98.78 శాతం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. 

గత కొన్ని రోజులుగా కరోనా కేసుల్లో విపరీతమైన పెరుగుదల నమోదు అవుతోంది. మార్చి 30వ తేదీన నమోదు అయిన కేసులతో పోలిస్తే మార్చి 31న వెలుగు చూసిన కేసుల్లో 50 శాతం పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో కొత్తగా 694 కేసులు నమోదు అయ్యాయి. కేరళలో 765 కేసులు వెలుగు చూశాయి. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈ వారంలో సోమవారంతో పోలిస్తే మంగళవారం దేశవ్యాప్త కేసుల్లో కొంత తగ్గుదల కనిపించింది. తిరిగి బుధవారం కేసులు పెరిగాయి. గురు, శుక్రవారాల్లోనూ విపరీతమైన పెరుగుదల ప్రస్తుతం అధికారులను ఆందోళనకు  గురి చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కరోనా కేసుల పెరుగుదలపై అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ప్రధానమంత్రి నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ 1.16 ఉద్ధృతి వల్లే కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు పెరిగితే కేసులు కూడా పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు.

గర్భధారణ సమయంలో కోవిడ్ వస్తే పుట్టే పిల్లల్లో ఊబకాయం వచ్చే ప్రమాదం 

ఎండోక్రైన్ సొసైటీకి చెందిన జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ & మెటబాలిజంలో ప్రచురించిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం, గర్భధారణ సమయంలో కోవిడ్-19 వచ్చే తల్లులకు జన్మించిన పిల్లలు ఊబకాయం వచ్చే అవకాశం ఉంది.

2019 నుంచి యునైటెడ్ స్టేట్స్‌లో 100 మిలియన్లకు పైగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ ఇన్‌ఫెక్షన్ వల్ల దీర్ఘకాలికందా ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయన్న సమాచారం ఉంది. "మా పరిశోధనలు కోవిడ్-19కి గురైన గర్భిణీలకు పుట్టిన పిల్లల జీవితంపై ప్రభావం చూపించనుంది. ఇది స్థూలకాయం, షుగర్‌,  హృదయ సంబంధ వ్యాధులకు కారణం కావచ్చు " అని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ ఎండీ లిండ్సే టీ ఫోర్మాన్ అన్నారు. "గర్భిణీ స్త్రీలు. వారి పిల్లలపై COVID-19 ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా చాలా పరిశోధనలు అవసరం." గర్భధారణ సమయంలో COVID-19 ఉన్న తల్లులకు జన్మించిన 150 మంది శిశువులను పరిశోధకులు అధ్యయనం చేశారు. తల్లులకు ప్రినేటల్ ఇన్‌ఫెక్షన్ లేని 130 మంది శిశువులతో పోలిస్తే వారు తక్కువ బరువు కలిగి ఉన్నారని కనుగొన్నారు. ఈ మార్పులు ఊబకాయం, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Donald Trump: అమెరికాకు బిగ్‌ షాక్‌!ఏ-10 యుద్ధవిమాన్ని కూల్చేసిన ఇరాన్! కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్!
అమెరికాకు బిగ్‌ షాక్‌!ఏ-10 యుద్ధవిమాన్ని కూల్చేసిన ఇరాన్! కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్!
Bengal Assembly Elections: బెంగాల్ రాజకీయాల్లో ముస్లిం కూటమి - మమతకు ముప్పు తప్పదా?
బెంగాల్ రాజకీయాల్లో ముస్లిం కూటమి - మమతకు ముప్పు తప్పదా?
Keralam Assembly Elections: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతల వ్యూహాత్మక ప్రచారం - యువనేతలకు ఎలక్షనీరింగ్ బాధ్యతలు !
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతల వ్యూహాత్మక ప్రచారం - యువనేతలకు ఎలక్షనీరింగ్ బాధ్యతలు !
Shroud of Turin: జీసస్ చివరి వస్త్రంపై ఇండియన్ DNA! సంచలనం రేపుతున్న కొత్త స్టడీ!
జీసస్ చివరి వస్త్రంపై ఇండియన్ DNA! సంచలనం రేపుతున్న కొత్త స్టడీ!

వీడియోలు

Sanjeev Goenka Behavior with LSG Captains | సంజీవ్ గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ | ABP Desam
Yuvraj Singh Slams SRH Management | కావ్య మారన్ నిర్ణయంపై యువీ అసహనం | ABP Desam
Abhishek Sharma Out vs KKR IPL 2026 | అభిషేక్ శర్మ అవుట్.. అంపైర్ తప్పిదమా? | ABP Desam
MS Dhoni Returns to Practice IPL 2026 | నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టిన ధోనీ | ABP Desam
SRH Crushes KKR by 65 Runs IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ ఊచకోత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh NTR Vaidya Seva Scheme: ఎన్టీఆర్ వైద్య సేవకు పదే పదే ఆటంకాలు - ప్రభుత్వ నిర్లక్ష్యం - పేదలకు కష్టాలు!
ఎన్టీఆర్ వైద్య సేవకు పదే పదే ఆటంకాలు - ప్రభుత్వ నిర్లక్ష్యం - పేదలకు కష్టాలు!
Amaravati Pin code: అమరావతికి కొత్త పిన్ కోడ్‌! ఈ వ్యవస్థ ఎలా ప్రారంభమైందంటే? 
అమరావతికి త్వరలోనే ఆరు అంకెల కోడ్‌! ఈ వ్యవస్థ ఎలా ప్రారంభమైందంటే? 
Gen-Z Vastu: Gen-Z కోసం అద్భుతమైన వాస్తు చిట్కాలు! ఈ మార్పులతో మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది!
Gen-Z కోసం అద్భుతమైన వాస్తు చిట్కాలు! ఈ మార్పులతో మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది!
IPL 2026 PBKS VS CSK Result Update: టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
Donald Trump: అమెరికాకు బిగ్‌ షాక్‌!ఏ-10 యుద్ధవిమాన్ని కూల్చేసిన ఇరాన్! కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్!
అమెరికాకు బిగ్‌ షాక్‌!ఏ-10 యుద్ధవిమాన్ని కూల్చేసిన ఇరాన్! కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్!
Bellamkonda Sai Sreenivas : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ - ఎంగేజ్మెంట్, మ్యారేజ్ వెన్యూ డీటెయిల్స్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ - ఎంగేజ్మెంట్, మ్యారేజ్ వెన్యూ డీటెయిల్స్
Rajasekhar: తాత అని ఎవ్వరినీ పిలవనివ్వను, పిలవరు కూడా - రాజశేఖర్
తాత అని ఎవ్వరినీ పిలవనివ్వను, పిలవరు కూడా - రాజశేఖర్
Tamil Nadu Assembly Elections : విజయ్ టిక్కెట్ ఇచ్చాడు కానీ ఆ అభ్యర్థి వెంట ఒక్కరూ కూడా ఉండటం లేదు -తిరుత్తణిలో టీవీకేకు షాక్!
విజయ్ టిక్కెట్ ఇచ్చాడు కానీ ఆ అభ్యర్థి వెంట ఒక్కరూ కూడా ఉండటం లేదు -తిరుత్తణిలో టీవీకేకు షాక్!
Embed widget